Home » AP Govt
ఏపీ లాసెట్ / పీజీ లాసెట్ - 2026 ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ పరీక్షలకు మొత్తం 23,996 మంది విద్యార్థులు హాజరుకాగా, అందులో 19,197 మంది అర్హత సాధించారు. దీంతో ఈ ఏడాది ఏపీ లాసెట్లో సుమారు 80 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కేరళం కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. కేరళం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వీడీ సతీశన్కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
తిరుమలలో 89.4 శాతం అటవీ విస్తీర్ణం సాధించిన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. శేషాచలం అడవుల్లో స్థానిక జాతుల పునరుద్ధరణకు టీటీడీ కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి స్వీడన్ ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ క్రాస్’ ప్రదానం చేసింది. ఈ పురస్కారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
మహానాడు రద్దుపై తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదేశాలతో ఇంధన వనరులు ఆదా చేసుకునే నేపథ్యంలో భాగంగా నెల్లూరులో జరగాల్సిన మహానాడు కార్యక్రమాన్ని రద్దు చేశామని తెలిపారు.
క్వాంటమ్ టెక్నాలజీకి అమరావతి కేంద్రమని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. యువ భారతీయులు అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతామని అంటున్నారని పేర్కొన్నారు.
ప్రపంచ టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. సురక్షిత కమ్యూనికేషన్లు, విశ్వాసనీయ డిజిటల్ మౌలిక సదుపాయాలు, సైబర్ భద్రత భవిష్యత్తు ప్రపంచానికి అత్యంత అవసరమని పేర్కొన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు సీఎం విజయ్తో పోల్చి తనను వైసీపీ నేతలు విమర్శలు చేయడంపై పవన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
విజయవాడ కొత్త సర్వజన ఆసుపత్రి (న్యూ జీజీహెచ్)లో జరిగిన షాకింగ్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఓ రోగికి శస్త్రచికిత్స అనంతరం తొలగించిన కాలి భాగాన్ని కుక్క నోట కరుచుకుని ఆస్పత్రి బయట తిరిగిన ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేసింది.
బకింగ్ హామ్ కెనాల్పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి గడ్డర్లు ఒరిగిపోయాయంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏడీసీఎల్) స్పష్టం చేసింది. స్టీల్ వంతెనల నిర్మాణంలో అత్యంత పొడవైన గడ్డర్లు తయారుచేసి జాయింట్ చేస్తారని చెప్పింది.