Home » AP Govt
శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు తరిగిపోతున్నాయి. డ్యాం నీటిమట్టం 885 అడుగులు కాగా.. ఎగువ నుంచి వచ్చిన వరదతో వా రం క్రితం 879.50 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 876.20 అడుగులకు తగ్గింది.
ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రీచ్మెంట్ (ఏపీ గ్రీన్) కార్యనిర్వాహక కమిటీ చైర్మన్గా జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రరావు (నాగబాబు) నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు క్యాబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
ఎంత ఆవేదన కలిగిందో తెలియదుగానీ మొత్తం కుటుంబానికే మరణ శాసనం రాశాడు ఆ ఇంజనీరు. రెండేళ్లలో ఏఈగా ఉద్యోగ విరమణ పొంది విశ్రాంత జీవనాన్ని ప్రశాంతంగా సాగించాల్సిన వయసులో.. గోదావరిలో దూకారు.
ఎల్నినో లాంటి పరిస్థితులు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేలా మూడేళ్ల కార్యాచరణ చేపట్టినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఎల్నినో ఎన్ని సవాళ్లు విసిరినా.. ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీటి కష్టాలు రానివ్వకుండా చివరి వరకు ప్రయత్నిస్తామని అసెంబ్లీ సాక్షిగా భరోసా ఇచ్చారు.
శాసనమండలిలో ‘మెగా డీఎస్సీ-2025’ వ్యవహారం మంటలు పుట్టించింది. ఈ చర్చ బొత్స వర్సెస్ అచ్చెన్నాయుడులా మారిపోయింది. బొత్సను ఉద్దేశించి మంత్రి అచ్చెన్న ‘దద్దమ్మ’ అని అంటే.. బొత్స ‘ఎద్దులా ఎదిగితే తెలివితేటలు రావు’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో మండలి వేడెక్కింది.
మెగా డీఎస్సీపై ప్రతి ఆరోపణకూ వివరణ ఇచ్చినా.. వైసీపీ వాళ్లు రోజుకో కుట్ర చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. 80, 90 ఏళ్లవారిని కూడా నిరుద్యోగులుగా చూపించి ధర్నాలు చేయిస్తున్నారని ఎద్దేవా చేశారు.
‘‘చాలెంజ్ చేస్తున్నా. అసెంబ్లీలో అయినా సరే. అసెంబ్లీ బయట అయినా సరే. ఎక్కడైనా సరే. తేదీ, సమయం మీరే ఫిక్స్ చేయండి. ఎప్పుడైనా చర్చకు సిద్ధం.’’ అని మెగా డీఎస్సీ-2025పై వైసీపీ అధ్యక్షుడు జగన్కు మంత్రి లోకేశ్ సవాల్ విసిరారు.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం కోటా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై మంగళవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో తీర్మానం ఆమోదించనుంది. ఆ తర్వాత... జీవో జారీ చేసి, దీనిని అమలు చేసేందుకు సిద్ధమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్... రాష్ట్ర జనాభాలో బీసీల వాటా 50.6 శాతం ఉన్నట్లు లెక్కతేల్చింది.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజున.. తొలి విమానం ల్యాండింగ్తో ఆనందోత్సహాలు ప్రారంభం కాగా.. మరోవైపు మొదటి రోజునే బాలారిష్టాలు ఎదురయ్యాయి.
‘పాఠాలు చెప్తాం.. గుణపాఠాలు కూడా నేర్పుతాం’ అంటూ టీచర్లు చేస్తున్న ర్యాలీలను గొడ్డలి పార్టీ గుర్తు పెట్టుకోవాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. గిరిజనులను గొడ్డలి పార్టీ నాయకులు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.