Home » AP Govt
సౌత్ కోస్టల్ రైల్వే జీఎం మాథుర్ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ శనివారం కలిశారు. జీఎం మాథుర్ను కలిసి పలు కీలక అంశాలపై చర్చించామని తెలిపారు.
ఉత్తరాంధ్ర కలలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెక్కలు ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు. విభజన వల్ల చాలా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రపంచం మొత్తం ఉత్తరాంధ్ర వైపు చూస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. యువతకు ఉద్యోగావకాశాలు పెరగబోతున్నాయన్నారు.
నవ్యాంధ్ర ప్రయాణంలో భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం కీలక మైలురాయని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అభివర్ణించారు.
భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ప్రారంభించారు. ఎయిర్పోర్ట్ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
భోగాపురం ఎయిర్పోర్టు టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ప్రారంభించారు. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు.
మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా శ్రీకాకుళంలో వైసీపీ నేతల దౌర్జన్యాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. మహిళ అని కూడా చూడకుండా విధుల్లో ఉన్న ఎస్ఐపై వైసీపీ నేతలు ప్రవర్తించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, అలాంటి వారిని ఉపేక్షించవద్దని పోలీసు ఉన్నతాధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది.
రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న అప్పటి సీఐ ఎస్ఎస్ వీవీ నాగరాజు రెండో రోజు విచారణలోనూ మౌనం పాటించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు అడిగిన ఏ ప్రశ్నకూ ఆయన సమాధానమివ్వలేదు.
గత ప్రభుత్వంలో నిబంధనల ఉల్లంఘన, భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాదరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది.
మహిళల్ని అవమానించి, రాక్షస ఆనందం పొందడం వైసీపీ డీఎన్ఏలోనే ఉందని మంత్రి లోకేశ్ విమర్శించారు. ఈమేరకు ఎక్స్లో పోస్టు చేశారు.