Home » AP Govt
దేశంలో అనేక భాషలు ఉన్నా.. ఆరు భాషలకు మాత్రమే ప్రాచీన హోదా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇలాంటి సభలు తెలుగు భాష గొప్పతనాన్ని చాటేందుకు ఉపయోగ పడతాయని వివరించారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై వైసీపీ నేతల విమర్శలకు ధీటుగా ఏపీ మంత్రులు సమాధానం ఇచ్చారు. వైసీపీ, సాక్షి మీడియా చేస్తోన్న తప్పుడు ప్రచారంపై మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, బీసీ జనార్థన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనంలో గుడ్డు మాయమవుతోంది. ఎప్పుడిస్తారో తెలీదు అస్సలు ఇస్తారో.. లేదో, కూడా తెలీదు. విషయం ఉన్నతాధికారుల నుంచి హెచ్ఎంల వరకు అందరికీ తెలిసినా ఎవ్వరూ నోరుమెదపరు. బిల్లులు మాత్రం ఎంచక్కా ఇచ్చేస్తున్నారు.
పారిశ్రామికంగా పాయకరావుపేట నియోజకవర్గం అభివృద్ధి చెందుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్, బొమ్మల పరిశ్రమ లాంటి ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయని వివరించారు.
ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఏపీ కీలక మైలురాయి సాధించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విశాఖపట్నం రిఫైనరీ ఆధునికీకరణ ప్రాజెక్టులో కొత్త రెసిడ్యూ అప్గ్రెడేషన్ సదుపాయం అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు.
తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న వైకుంఠ ద్వారా దర్శనాలు భక్తుల విశేష ఆదరణతో కొనసాగుతున్నాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ప్రారంభమైన ఈ ప్రత్యేక దర్శనాలకు దేశవ్యాప్తంగా భక్తులు భారీగా తరలివస్తున్నారు.
కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలో తాగుబోతుల ఆగడాలకు పోలీసులు గట్టి హెచ్చరిక ఇచ్చారు. మద్యం మత్తులో వీరంగం సృష్టించి ప్రజలకు ఇబ్బంది కలిగించిన యువకులపై పోలీసులు కఠినంగా వ్యవహరించారు.
ఏపీ నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని మారిషస్లో సంస్కృతిక వేడుకగా నిర్వహించుకుంటారని మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ వ్యాఖ్యానించారు. తెలుగు భాష విద్య సంస్కృతిని కాపాడటంలో మారిషస్ తెలుగు మహాసభ ముఖ్య పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో దళితులపై దాడులు చేశారని ఏపీ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. ఈ ఘటనలు ప్రజలకు ఇంకా గుర్తున్నాయని చెప్పుకొచ్చారు. వెలిగొండకు డబ్బులు ఇవ్వలేదని వైసీపీ నేతలు ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
తెలంగాణ ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేసిందన్న తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు సరికాదని ఏపీ మంత్రి సవిత పేర్కొన్నారు. చంద్రబాబును ఓ కారణంగా చూపి తెలంగాణ రాజకీయాలు నడుపుతూ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు చేశారు.