Home » AP Govt
ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించటమే ఎన్డీయే ప్రభుత్వ ప్రధాన అజెండా అని ఏపీ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. అవుటర్ రింగ్ రోడ్డు వేయాలన్నది నుడా చైర్మన్ ఉద్దేశమని.. ఆయన ఆలోచన మంచిదేనని పేర్కొన్నారు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. అమరావతిలో నిర్మాణాల పేరుతో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు..
పౌష్టికాహారం అందించడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని వెల్లడించారు..
సంక్రాంతి పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు దోపిడీకి తెరలేపాయి. టికెట్ ధరలు సాధారణ రోజుల్లో నామమాత్రంగా ఉంటే.. పండుగ సీజన్లో మాత్రం మూడింతలు వసూలు చేస్తున్నట్లు ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి.
చరిత్రలో అత్యంత హీనమైన ఓటమి జగన్దేనని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఎద్దేవా చేశారు. వైసీపీ చరిత్ర అయిపోయిందని విమర్శించారు. మరో 25ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓపీ, ఐపీ, ఇతర సేవలు గతంతో పోలిస్తే 12శాతం పెరిగాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. రోగులు అధిక శాతం ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేలా చేయగలిగామని పేర్కొన్నారు..
పట్టాదారు పాసు పుస్తకాలు తీసుకున్న రైతులంతా సభకు రాకపోవటంపై కలెక్టర్, రెవెన్యూశాఖ అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురంలో ఏ చిన్న ఘటన జరిగినా.. వైసీపీ నేతలు వైరల్ చేస్తున్నారని విమర్శలు చేశారు.
శిశువుల విక్రయం కేసులో పసికందులంతా తల్లిదండ్రులు విక్రయించినవారే అని అంతా అనుకున్నారు. ఢిల్లీ ముఠాలో పనిచేసి ముంబయిలోని థానే జైల్లో ఉన్న అనిల్బాబా కైర్ గురించి తెలిసిన తర్వాత.. కొత్త అనుమానాలు కలుగుతున్నాయి. గత ఏడాది మార్చిలో నగరంలో శిశువులను విక్రయిస్తుండగా పోలీసులు సరోజిని గ్యాంగ్ను పట్టుకున్నారు..
తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం వేకువ జామున శ్రీవారి ఆలయంలోని పవిత్రమైన వైకుంఠ ద్వారాలను అధికారికంగా మూసేసింది. ప్రతి ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా మాత్రమే ఈ ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ దర్శనం భక్తులకు అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. ఈ ఏడాది కూడా లక్షలాది మంది భక్తులు ఈ అపూర్వ దర్శనానికి తరలివచ్చారు.