Home » AP Assembly Sessions
ఈ మేరకు మంత్రులు, అధికారులు తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే విధంగా స్పీకర్ ఆదేశించాలని ఎమ్మెల్యే బుచ్చయ్య పట్టుబట్టారు. దీనిపై వెంటనే స్పందించిన స్పీకర్, మంత్రులు వెంటనే సమాధానం చెప్పాలని ఆదేశాలు ఇచ్చారు.
ఎవరి ప్రభుత్వంలో ఏం చేశారు అనేది చర్చలో తేలుద్దామంటూ మంత్రి సవాల్ విసిరారు. యూరియా, పంటలకు గిట్టుబాటు ధరలపై బీఏసీ సమావేశంలో సమయం కేటాయిస్తే ఎన్ని గంటలు అయినా చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధం అని అచ్చెన్న స్పష్టం చేశారు.
జగన్ పెట్టిన పథకాలలో అవినీతిపై ఒకరోజు చర్చ పెట్టాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోరారు. ప్రస్తుతం లబ్ధిదారులను బ్యాంక్లు ఇబ్బందిపెడుతున్నాయని, జగన్ చేసిన అప్పులకు లబ్ధిదారులు బలి అవుతున్నారన్నారు.
తెలుగు రాష్ట్రాల మాజీ సీఎంలపై సీపీఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచిన మాజీ సీఎం జగన్ రెడ్డి, తెలంగాణ మాజీ సీఎం చంద్రశేఖర్ రావులు అసెంబ్లీకి రావాలని ఆయన డిమాండ్ చేశారు.
ఏపీ రాజధాని అమరావతిలో రేపటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:00 గంటలకు శాసనసభ, 10:00 గంటలకు శాసన మండలి సమావేశాలు మొదలవుతాయి.
వైసీపీ అధినేత జగన్ ప్రజాస్వామ్య వాది అయితే అసెంబ్లీకి రావాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సవాల్ విసిరారు. అసెంబ్లీకి రాకుండా కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేయడం సరికాదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలన్నది మాజీ సీఎం జగన్ రెడ్డి కోరిక అని రఘురామకృష్ణరాజు తెలిపారు. ఆ కోరికకు అనుగుణంగా విధివిధానాలు లేవని ఆయన స్పష్టం చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చురకలు అంటించారు. ప్రజాప్రతినిధుల ప్రవర్తన సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండాలని అయ్యన్నపాత్రుడు సూచించారు.
ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో బదిలీలకు సంబంధించి కీలక చర్యలు తీసుకుంటుంది.
ఈ నెల 18వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగబోతున్నాయి. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. వరుసగా 60 అసెంబ్లీ పని దినాలకు హజరుకానిపక్షంలో వైసీపీ సభ్యులకు అనర్హత వేటు..