Home » AP Assembly Sessions
హెరిటేజ్ నుంచి ఒక్క కేజీ నెయ్యి కూడా ప్రభుత్వ శాఖలు కొనుగోలు చేయలేదని సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ శాసనసభలో స్పష్టం చేశారు. అయినప్పటికీ ప్రతిపక్షాల పత్రికలు వ్యతిరేక కథనాలు రాశాయని విమర్శించారు.
నెయ్యిలో రసాయనాలు కలవలేదని వైసీపీ అబద్ధాలు చెబుతోందని.. అందుకే తాము వివరణ ఇవ్వాల్సి వచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కల్తీ నెయ్యిపై ఏపీ అసెంబ్లీలో లఘు చర్చ కొనసాగుతోంది. నెయ్యి కావాలంటే పాల నుంచే కాదు రసాయనాల నుంచీ తయారు చేయొచ్చని నిరూపించారని పవన్ అన్నారు.
విశాఖను అడ్వెంచర్, యాంకర్ హబ్గా తీర్చిదిద్దుతున్నామని మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. ఏపీ శాసనసభలో విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే సీహెచ్ వంశీ కృష్ణ శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు మంత్రి దుర్గేశ్ సమాధానం ఇచ్చారు.
గుంటూరు ఛానల్ ఆధునీకరణపై ఎమ్మెల్సీ హనుమంతరావు ప్రశ్నకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ఇచ్చారు. ఈ ఛానల్ను మెరుగుపరిచేందుకు 369 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించారని.. ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆయన తెలిపారు.
మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు సంబంధించి సుదీర్ఘ ప్రసంగం చేయడంపై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణిపై ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఇలాంటి సుదీర్ఘ ప్రసంగాలు వద్దన్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ‘అడవితల్లి బాట’ కార్యక్రమంపై ఎమ్మెల్యే రామకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానం ఇచ్చారు.
పశు వైద్యశాలల్లో సౌకర్యాల కొరత, వైద్యుల నియామకాలపై ఎమ్మెల్యే సాంబశివరావు అడిగిన ప్రశ్నకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం అన్ని శాఖల్లో నిర్వహణను పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శించారు.
రాష్ట్ర మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ హెరిటేజ్పై ఫేక్ ప్రచారం చేశారని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందపూరు డెయిరీకి హెరిటేజ్కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో నేడు సంక్షేమ బడ్జెట్ కేటాయింపులపై చర్చించారు. సామాజిక సమానత్వం అనే లక్ష్యం కోసం ఎన్డీయే కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని వ్యాఖ్యానించారు.
ఏపీ శాసనమండలి బీఏసీ సమావేశం ఇవాళ (సోమవారం) జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీ కాసేపటి క్రితమే ముగిసింది..