Home » AP Assembly Sessions
ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యుల ఆందోళనలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు మీదకు వైసీపీ ఎమ్మెల్సీలు దూసుకెళ్లారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో వివిధ సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు.
హెరిటేజ్కి.. వీఎస్ఆర్ ఏవియేషన్కి ఎలాంటి సంబంధం లేదని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. మాజీ మంత్రి వివేకారెడ్డిని చంపి ఆ కత్తి తమ చేతిలో పెట్టారని.. ఇప్పుడు కూడా వీఎస్ఆర్ ఏవియేషన్పై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అలాంటివేనని ధ్వజమెత్తారు.
ఏపీ శాసనమండలిలో ఆడబిడ్డ నిధి పథకంపై వైసీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం ఇచ్చారు. ఆడబిడ్డ నిధి పథకం ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి తెలిపారు.
నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం ఏర్పాటుపై ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేశ్ సమాధానం ఇచ్చారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చామని, క్లస్టర్ ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు.
ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో పొరుగు సేవల ఉద్యోగుల సమస్యలపై ఎమ్మెల్యే గల్లా మాధవి అడిగిన ప్రశ్నకు మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి సమాధానం ఇచ్చారు.
హెరిటేజ్ నుంచి ఒక్క కేజీ నెయ్యి కూడా ప్రభుత్వ శాఖలు కొనుగోలు చేయలేదని సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ శాసనసభలో స్పష్టం చేశారు. అయినప్పటికీ ప్రతిపక్షాల పత్రికలు వ్యతిరేక కథనాలు రాశాయని విమర్శించారు.
నెయ్యిలో రసాయనాలు కలవలేదని వైసీపీ అబద్ధాలు చెబుతోందని.. అందుకే తాము వివరణ ఇవ్వాల్సి వచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కల్తీ నెయ్యిపై ఏపీ అసెంబ్లీలో లఘు చర్చ కొనసాగుతోంది. నెయ్యి కావాలంటే పాల నుంచే కాదు రసాయనాల నుంచీ తయారు చేయొచ్చని నిరూపించారని పవన్ అన్నారు.
విశాఖను అడ్వెంచర్, యాంకర్ హబ్గా తీర్చిదిద్దుతున్నామని మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. ఏపీ శాసనసభలో విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే సీహెచ్ వంశీ కృష్ణ శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు మంత్రి దుర్గేశ్ సమాధానం ఇచ్చారు.
గుంటూరు ఛానల్ ఆధునీకరణపై ఎమ్మెల్సీ హనుమంతరావు ప్రశ్నకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ఇచ్చారు. ఈ ఛానల్ను మెరుగుపరిచేందుకు 369 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించారని.. ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆయన తెలిపారు.