Share News

AP Assembly Live Updates: ఏపీ అసెంబ్లీ లాబీల్లో మార్షల్స్‌ అతిప్రవర్తనపై మంత్రి లోకేష్‌ ఆగ్రహం

ABN , First Publish Date - Sep 18 , 2025 | 09:33 AM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో 8 చట్ట సవరణ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అదే విధంగా పలు అంశాలపైనా కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది.

AP Assembly Live Updates: ఏపీ అసెంబ్లీ లాబీల్లో మార్షల్స్‌ అతిప్రవర్తనపై మంత్రి లోకేష్‌ ఆగ్రహం
AP Assembly monsoon session

Live News & Update

  • Sep 18, 2025 17:09 IST

    జీఎస్టీ సంస్కరణలు పేదల జీవితాల్లో ప్రభావం చూపుతుంది: చంద్రబాబు

    • గతంలో జీఎస్టీ, వ్యాట్‌ వంటి పన్నుల విధానం ఉండేది: చంద్రబాబు

    • గతంలో 17 రకాల పన్నుల, 13 రకాల సర్‌ఛార్జ్‌లు ఉండేవి: చంద్రబాబు

    • వాజ్‌పేయీ హయాంలో జీఎస్టీ సంస్కరణలు తీసుకువచ్చారు

    • అందరినీ ఒప్పించి అరుణ్‌జైట్లీ జీఎస్టీ సంస్కరణలను అమలు చేశారు

    • జీఎస్టీ అమలు.. గేమ్‌ ఛేంజర్‌గా మారింది: సీఎం చంద్రబాబు

    • జీఎస్టీ రెండో తరం సంస్కరణలు తీసుకువచ్చారు: చంద్రబాబు

    • సంస్కరణలకు నేను ఎప్పుడూ ముందుంటా: చంద్రబాబు

    • అభివృద్ధి జరిగితే సంపద సృష్టి.. ప్రభుత్వానికి ఆదాయం: చంద్రబాబు

    • ప్రభుత్వానికి ఆదాయం వస్తే సంక్షేమం, అభివృద్ధి జరుగుతుంది

    • సంపద సృష్టించనివారికి సంక్షేమం ఇచ్చే అధికారం లేదు: చంద్రబాబు

    • అప్పులు చేసి సంక్షేమం ఇవ్వడం సరికాదనేది నా నమ్మకం: సీఎం చంద్రబాబు

    • ఆర్థిక ఇబ్బందులు వచ్చినా.. దేశం, రాష్ట్రమే ముఖ్యం: సీఎం చంద్రబాబు

    • దీర్ఘకాల సంస్కరణలను దృష్టిలో పెట్టుకుని చూడాలి: చంద్రబాబు

    • గతంలో 4 టైర్‌ (5, 12, 18, 28 శాతం) పన్నుల వ్యవస్థ ఉండేది: చంద్రబాబు

    • ఒకే ఉత్పత్తికి సంబంధించి అనుబంధ ఉత్పత్తులు వస్తే పన్నులు మార్చేవారు: చంద్రబాబు

    • పన్నుల విధానంలో 2 శ్లాబులు (5, 18 శాతం) ఉంచి సరళతరం చేశారు

    • ఈసారి అన్ని పండుగలు ఘనంగా జరుపుకునే అవకాశం: చంద్రబాబు

    • మోదీ సంస్కరణలతో పరోక్షపన్ను చెల్లింపుదారులు 132 శాతం పెరిగారు

    • 2017లో 65 లక్షల మంది ఉంటే.. ప్రస్తుతం 1.51 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు: చంద్రబాబు

  • Sep 18, 2025 17:09 IST

    జీఎస్టీ సంస్కరణలు దేశ ప్రగతికి బాటలు వేస్తాయి: పవన్‌కల్యాణ్‌

    • జీఎస్టీ సంస్కరణల్లో ఒక దానికి రాష్ట్ర ప్రతినిధిగా బాధ్యత వహించా

    • సంస్కరణలను ముందుండి నడిపిన నిర్మలా సీతారామన్‌ కృషి అభినందనీయం

    • రాష్ట్ర ఆదాయానికి నష్టం కలిగినా..

    • సామాజిక ప్రయోజనాల కోసం సమర్థించాం: పవన్‌కల్యాణ్‌

    • చరిత్రాత్మక సంస్కరణలకు మద్దతు తెలిపి తొలి రాష్ట్రం ఏపీ: పవన్‌కల్యాణ్‌

  • Sep 18, 2025 14:46 IST

    ఏపీ అసెంబ్లీ: GST శ్లాబ్స్‌ తగ్గింపుపై మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రకటన

    • తక్కువ ఆదాయాల కుటుంబాల అవసరాల కోసం పన్ను తగ్గించారు.

    • నిత్యావసరాలపై 5 నుంచి సున్నా శాతం పన్ను తగ్గింపు: పయ్యావుల

    • నెయ్యి, వెన్న, వంటపాత్రలపై 12 నుంచి 5 శాతానికి పన్ను తగ్గింపు: పయ్యావుల

    • GST సంస్కరణల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి: పయ్యావుల

  • Sep 18, 2025 14:34 IST

    ఏపీ అసెంబ్లీ లాబీల్లో మార్షల్స్‌ అతిప్రవర్తనపై మంత్రి లోకేష్‌ ఆగ్రహం

    • చాంబర్‌ నుంచి మంత్రి లోకేష్‌ బయటకు వస్తున్న సమయంలో..

    • లాబీల్లో ఇతరులను తప్పుకోండి అంటూ మార్షల్స్‌ హడావుడి

    • సభ్యుల వ్యవహారాల్లో మీకేం పని అంటూ మంత్రి లోకేష్‌ ఆగ్రహం

    • ఇంకా తాడేపల్లి ప్యాలెస్‌ పాలనలో ఉన్నామనుకుంటున్నారా అంటూ చురకలు

    • బయటి వ్యక్తులు లోపలకు రాకుండా చూసుకోవాలి కానీ..

    • ఎమ్మెల్యేల వ్యవహారంలో జోక్యం వద్దని మార్షల్స్‌కు లోకేష్‌ హితవు

  • Sep 18, 2025 13:56 IST

    ఏపీ శాసనమండలి రేపటికి వాయిదా

  • Sep 18, 2025 12:35 IST

    అమరావతి: ఈ నెల 30 వరకూ ఏపీ అసెంబ్లీ సమావేశాలు.

    • 10 పనిదినాల పాటు అసెంబ్లీ నిర్వహించాలని బీఎసీ నిర్ణయం.

    • సభలో చర్చించేందుకు 18అంశాలు ప్రతిపాదించిన తెలుగుదేశం.

  • Sep 18, 2025 11:55 IST

    స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ(బీఎసీ) భేటీ

    • హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పయ్యావుల కేశవ్, జీవీ ఆంజనేయులు, విష్ణుకుమార్ రాజు తదితరులు.

    • అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏఏ అంశాలు చర్చించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్న బీఎసీ.

  • Sep 18, 2025 10:41 IST

    యూరియా, గిట్టుబాటు ధరలపై చర్చకు సిద్ధం: మంత్రి అచ్చెన్న

    • ఎవరి హయాంలో ఏం చేశారనేది చర్చలో తేలుద్దాం: మంత్రి అచ్చెన్న

  • Sep 18, 2025 10:41 IST

    టిడ్కో ఇళ్ల కేటాయింపులను గత ప్రభుత్వం తగ్గించింది: మంత్రి నారాయణ

    • కాంట్రాక్టర్లకు గత నాలుగు నెలల్లో రూ.280 కోట్లు చెల్లించాం: మంత్రి నారాయణ.

    • మొత్తం 51 ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లను మళ్ళీ ప్రారంభించాం: మంత్రి నారాయణ.

    • కాంట్రాక్టర్లకు రూ.3,664 కోట్ల బిల్లులు చెల్లించాలి: మంత్రి నారాయణ.

    • టిడ్కో ప్రాజెక్ట్ పూర్తికావాలంటే రూ.6 వేలకోట్లు అవసరం: మంత్రి నారాయణ.

  • Sep 18, 2025 10:34 IST

    ఏపీ శాసనమండలిలో వైసీపీ వాయిదా తీర్మానం తిరస్కరించిన చైర్మన్‌

    • ఏపీలో రైతుల సమస్యలపై వైసీపీ వాయిదా తీర్మానం

  • Sep 18, 2025 10:33 IST

    ఏపీ అసెంబ్లీ: జీరో అవర్‌లో మంత్రులు అధికారులపై స్పీకర్‌ అసహనం

    • ఎమ్మెల్యేలు మాట్లాడినప్పుడు అధికారులు, మంత్రులు..

    • ఎవరూ నోట్‌ చేసుకోకపోవడమేంటని నిలదీసిన స్పీకర్‌ అయ్యన్న

    • సమాధానం ఇచ్చేలా మంత్రులు, అధికారులను ఆదేశించాలని కోరిన గోరంట్ల.

  • Sep 18, 2025 09:54 IST

    నెల్లూరు రూరల్ MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చిట్ చాట్.

    • గత ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా చిన్నాభిన్నం అయిన ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది.

    • కూటమి ప్రభుత్వం హయాంలో సంక్షేమ పథకాలు సమయానికి అందిస్తున్నారు.

    • దీంతో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో మంచి స్పందన వస్తోంది.

    • తల్లికి వందనం, శ్రీశక్తి పథకాలపై ప్రజల్లో స్పందన చాలా బాగుంది.

    • శ్రీ శక్తి పథకంలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అమలులో తెలంగాణ, కర్ణాటకలో వచ్చిన సమస్యలను ఇక్కడ రాకుండా పరిష్కరించారు.

    • దీంతో ఆంధ్రప్రదేశ్‌లో శ్రీ శక్తి పథకం సూపర్ హిట్ అయింది.

    • అందువలనే పథకానికి మహిళలు నుంచి మంచి స్పందన వచ్చింది.

    • గత ప్రభుత్వ హయంలో ఆర్థిక విద్వంసం జరిగినా కూడా చంద్రబాబు వంటి పాలనా దక్షుడుకి అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో చేయడం సాధ్యమైంది.

  • Sep 18, 2025 09:49 IST

    కూటమి ప్రభుత్వం అన్ని విషయాల్లో ఫెయిల్‌: ఎంపీ అవినాష్‌రెడ్డి

    • ఏ ఒక్క పథకం అమలు కావడం లేదు: ఎంపీ అవినాష్‌రెడ్డి

    • మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం అన్యాయం: అవినాష్‌

    • చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం అంటే ఇదేనా?: ఎంపీ అవినాష్‌రెడ్డి

    • ఏపీ శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: ఎంపీ అవినాష్‌రెడ్డి

    • ఏపీకి పవన్‌ కల్యాణ్‌ టూరిస్టులా వచ్చిపోతున్నారు: అవినాష్‌రెడ్డి

    • ఆరోగ్యశ్రీకి బకాయిలు చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉంది

    • యూరియా దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు: అవినాష్‌రెడ్డి

  • Sep 18, 2025 09:47 IST

    విజయవాడ: పార్టీ MLAలు, MLCలతో ఏపీ బీజేపీ చీఫ్‌ మాధవ్‌ సమావేశం

    • గత వైసీపీ పాలనలో కేంద్ర పథకాలను దారిమళ్లించారు: మాధవ్‌

    • శాసనసభ, శాసనమండలి పనిదినాలు పెంచాలి: ఏపీ బీజేపీ చీఫ్‌ మాధవ్‌

  • Sep 18, 2025 09:47 IST

    ఇప్పటికైనా జగన్‌ అసెంబ్లీకి రావాలి: MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి

    • తన అవినీతి, అక్రమాలు బయటకు వస్తున్నందుకే జగన్ అసెంబ్లీకి రావట్లేదు.

    • తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుని జగన్‌ సొంత మీడియాతో మాట్లాడుతున్నారు.

    • పిరికి వ్యక్తి కాబట్టే ఇనుపకంచెతో నిర్మించిన ప్యాలెస్ నుంచి బయటకు రావట్లేదు.

    • ప్రతిపక్ష నేతగా జగన్ పనికిరారని ప్రజలు పక్కనపెట్టారు: బుచ్చయ్య చౌదరి.

  • Sep 18, 2025 09:33 IST

    ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.

    • అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు.

    • కార్మిక, పరిశ్రమలు, మోటార్ వాహనాలు, ఎస్టీలకు సంబంధించి.. అసెంబ్లీలో 8 చట్ట సవరణ బిల్లులు ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం

    • అసెంబ్లీలో చర్చించేందుకు 22 అంశాలు సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం.