Home » AP Assembly Sessions
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 14వ రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో రెండు బిల్లులను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
ఏపీ శాసనమండలి గురువారానికి వాయిదా పడింది. వైసీపీ సభ్యుల ఆందోళనతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో చైర్మన్ సభను వాయిదా వేశారు.
శాసనమండలిలో వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సభలో తాను ఒక మంత్రిగా కాకుండా, శ్రీవారి భక్తునిగా మాట్లాడుతున్నట్లు తెలిపారు.
తిరుమల ప్రసాదం కల్తీపై శాసనమండలిలో 20 పేజీల సమగ్ర ప్రకటనను సర్కార్ సభ్యులందరికీ పంపిణీ చేసింది. ప్రకటనలో కల్తీపై వివరాలను స్పష్టంగా వెల్లడించింది.
ఏపీ శాసనమండలిలో తిరుమల లడ్డూ కల్తీపై చర్చ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ వైసీపీ సభ్యుల ఆరోపణలపై ధీటుగా సమాధానం ఇచ్చారు.
ఏపీ శాసనమండలిలో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై చర్చ విషయంలో గందరగోళం నెలకొంది. ఒకే అంశంపై ఒకే రోజు రెండు తీర్మానాలను ఆమోదించడం మంచిది కాదంటూ మండలి చైర్మన్ తీరును తప్పుపట్టారు మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్.
ఏపీ శాసనమండలిలో రెండు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. ఏపీ అసైన్డ్ భూముల సవరణ బిల్లు-2026 , ఏపీ గ్రామ వార్డు సచివాలయాల సవరణ బిల్లు 2026కు మండలి ఆమోదం తెలిపింది.
సింహాచలం దేవస్థానం పరిసరాల్లోని పంచగ్రామ సమస్యలపై ఏపీ అసెంబ్లీలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమాధానం ఇచ్చారు. భూమి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. హైకోర్టు ఆదేశాలు రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
విపత్తు నిర్వహణ చట్టం సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అగ్నిప్రమాద నివారణ చర్యలకు సంబంధించిన చట్టంలో మార్పులు చేయాలని నిర్ణయించామని హోంమంత్రి అనిత అన్నారు.
ఏపీ అసెంబ్లీలో వరి రైతుల కష్టాలు, సేంద్రీయ సాగు ప్రత్యామ్నాయ పంటలపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు. రైతులు వరి నుంచి ఇతర పంటల వైపు మారకపోతే నష్టాలు తప్పవని మంత్రి తెలిపారు.