Share News

AP Law and Order: గంజాపై పటిష్ట చర్యలు.. తగ్గేదేలే అన్న హోంమంత్రి

ABN , Publish Date - Sep 25 , 2025 | 02:21 PM

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్‌తోపాటు పలువురుపైనా పోలీసులను ప్రయోగించారని హోంమంత్రి అనిత గుర్తుచేశారు. చాలా మందికి తాము ఎందుకు జైలుకు వెళుతున్నామో తమకు తెలియని పరిస్ధితి అప్పట్లో ఉండేదన్నారు.

AP Law and Order: గంజాపై పటిష్ట చర్యలు.. తగ్గేదేలే అన్న హోంమంత్రి
AP Law and Order

అమరావతి, సెప్టెంబర్ 25: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శాంతిభద్రతలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత (Home Minister Anitha) మాట్లాడుతూ.. గతంలో పోలీసులను అతిగా ఉపయోగించడం జరిగిందని.. దానికి నిదర్శనమే 151 నుంచి 11 సీట్లకు జగన్ మోహన్ రెడ్డి పడిపోయారని అన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్‌తోపాటు పలువురుపై పోలీసులను ప్రయోగించారని గుర్తుచేశారు. చాలా మందికి తాము ఎందుకు జైలుకు వెళుతున్నామో కూడా తెలియని పరిస్థితి అప్పట్లో ఉండేదన్నారు. శాంతిభద్రతలను కాపాడడానికి ఎంతో ప్రయత్నించామని... ఈ ఏడాది రాష్ట్రంలో 16 శాతం నేరాలు తగ్గాయని వెల్లడించారు. బలహీన వర్గాలు, మహిళలపై నేరాల సంఖ్య రాష్ట్రంలో తగ్గిందని సభకు తెలియజేశారు.


గతంలో విపరీతంగా గంజాయి పెరిగిపోయిందని.. అప్పట్లో గంజాయి ఎక్కడ దొరికినా దాని మూలాలు ఏపీలోనే ఉండేవని.. చివరకు స్కూళు బ్యాగుల్లోకీ గంజాయి చేరిపోయిందన్నారు. గత ఐదేళ్ల ప్రభుత్వంలో నిఘా విఫలం అయ్యిందని చెప్పడానికి కారణం గంజాయి విపరీతంగా పెరిగిపోవడమే అని వెల్లడించారు. లిక్కర్ రేటు పెరిగిపోవడంతో గంజాయిని చాలా మంది మత్తు కోసం ఆశ్రయించారని హోంమంత్రి తెలిపారు. సెబ్‌ను రద్దు చేసి ఈగల్ అనే వ్యవస్ధను ఏర్పాటు చేసి ఐపీఎస్ అధికారితో పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పారు. ఈరోజు గాంజా కల్టివేషన్ రాష్ట్రంలో జీరోకి చేరిందని పేర్కొన్నారు.


జనవరి 1 నుంచి ఈరోజు వరకు 32 వేల కేజీల గాంజాను సీజ్ చేశామని సభలో వెల్లడించారు. మెడికల్ షాపులలో డ్రగ్స్‌కు సంబంధించినవి దోరుకుతున్నాయని సభ్యులు తమ దృష్టికి తెచ్చారని.. దీనికి వ్యతిరేకంగా ఆపరేషన్ గరుడా, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అని నడిపామని తెలిపారు. 40 వేల బడ్డీలపై రైడ్ చేశామని... ఆపరేషన్ చైతన్య, సంకల్పలను పాఠశాలల్లో నిర్వహిస్తున్నామన్నారు. గత ఐదేళ్లు మహిళల క్యారెక్టర్‌ను దిగజార్చి మాట్లాడారని మండిపడ్డారు. ఉమెన్, ఛైల్డ్ సేప్టీకి ఒక మహిళా ఐపీఎస్‌ను పెట్టి శక్తి యాప్‌ను ఏర్పాటు చేశామని అన్నారు. ఒక అమ్మాయి.. ఇబ్బందుల వల్ల రైలు పట్టాలవైపు వెళుతుంటే అది చూసిన వారు శక్తి బృందానికి సమాచారం ఇచ్చారని.. ఆ బృందం వెళ్లి ఆ అమ్మాయిని రక్షిస్తే ఆమె ఇప్పుడు డీఎస్సీ రాసి ఉద్యోగం సాధించారని హోంమంత్రి అనిత తెలియజేశారు.


జగన్ ఓ ఆర్గనైజ్డ్ క్రిమినల్..

ఫోరెన్సిక్ కేసులు 25వేలు పెండింగ్‌లో ఉంటే కూటమి వచ్చాక వాటిని 1600కి తగ్గించగలిగామని తెలిపారు. ఇప్పుడు కన్వెక్షన్ రేటు కూడా పెరిగిందన్నారు. సోషల్ మీడియా ఎంత మంచికి ఉపయోగించినా ఇప్పుడు చెడుకూ ఉపయోగిస్తున్నారని అన్నారు. జగన్ ఓ ఆర్గనైజ్డ్ క్రిమినల్ అని సాక్షాత్తూ చంద్రబాబు చెప్పారన్నారు. సోషల్ మీడియాలో కావాలని ఫేక్ పేర్లతో కులాలు మార్చుకొని మరీ పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లోకి వచ్చిన పాపానికి మన పిల్లలు కూడా మాట పడాల్సి వస్తోందని ఫైర్ అయ్యారు. డిప్యూటీ సీఎం పిల్లల గురించి కూడా ఇష్టానుసారంగా పోస్టులు పెట్టారని ఆగ్రహించారు.


నా దృష్టికి తీసుకురండి: హోంమంత్రి

జర్నలిస్టులు, అమరావతి మహిళలపైనా అనేక కేసులు అప్పట్లో పెట్టారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి భార్య, ఓ ముఖ్యమంత్రి కుమార్తెను అన్న మాటలే ప్రజల్లో మార్పునకు కారణమని చెప్పవచ్చన్నారు. సభ్యులకు చిన్నచిన్న సమస్యలు ఉన్నాయని తనకు అర్థం అవుతోందని.. వాటిని తన దృష్టికి తీసుకువస్తే సరిచేస్తామని హోంమంత్రి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

శాంతిభద్రతలపై చర్చ... అయ్యన్న కీలక కామెంట్స్

మంత్రి సమాధానంతో అసంతృప్తి.. మండలి నుంచి బొత్స వాకౌట్

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 25 , 2025 | 04:01 PM