Home » Home Minister Anitha
అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటన కొనసాగుతోంది. పాయకరావుపేట పట్టణంలోని పాత పెద్దిరెడ్డి వారి వీధిలో పెన్షన్లను పంపిణీ చేశారు.
ముస్సోరీలో అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన టెకీ రాధాగాయత్రి తల్లిదండ్రులు.. హోం మంత్రి అనితను కలిశారు. కూతురి మరణం, అల్లుడు శ్రీచరణ్ ప్రవర్తనపై అనుమానాలను హోం మంత్రికి వివరించారు.
కొవిడ్ తర్వాత సైబర్ నేరాలు పెరిగాయని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. ఎన్డీఏ ప్రభుత్వం సైబర్ క్రైమ్పై దృష్టి పెట్టిందని పేర్కొన్నారు.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో హోంమంత్రి వంగలపూడి అనిత, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా బోయపాడు, దొండవాక తీరాల్లో నిర్మించ తలపెట్టిన రెండు ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు.
వైసీపీ నేతలను రాజధాని రైతులు అడ్డుకోవడంపై హోం మంత్రి అనిత స్పందించారు. వైసీపీ నేతలకు అమరావతిలో పర్యటించే నైతిక అర్హత లేదన్నారు.
ఏపీని డ్రగ్స్రహిత రాష్ట్రంగా మార్చేందుకు అందరూ సహకారం అందించాలని హోంమంత్రి వంగలపూడి అనిత కోరారు. ఈగల్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నామని.. నిర్మానుష్య ప్రదేశాల్లో డ్రోన్స్ తిరుగుతున్నాయని హోం మంత్రి తెలిపారు.
అనకాపల్లి జిల్లా నక్కలపల్లిలో మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హోం మంత్రి వంగలపూడి అనిత కృషితో గురుకుల పాఠశాల మంజూరు అయ్యింది.
తమ ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ నిర్మూలన విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని ఏపీ హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. యువతను మాదక ద్రవ్యాల బారి నుంచి రక్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబసభ్యులను హోం మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. రెండేళ్ల చిన్నారి అదృశ్యమవడం చాలా బాధాకరమని హోం మంత్రి అన్నారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలపై ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్కు మహిళా నేతలు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.