Home » Home Minister Anitha
అగ్నిమాపక శాఖ పనితీరుపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత సచివాలయంలో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫైర్స్టేషన్లు లేని 22 నియోజకవర్గాల పరిస్థితిపై అధికారులతో చర్చించారు.
కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో మంత్రులు అనిత, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, పోలీస్ స్టేషన్ను మంత్రులు ప్రారంభించారు.
అంకితభావం, కృషితో సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న శ్రామిక సోదర సోదరీమణులందరికీ హోం మంత్రి అనిత అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికులు, కర్షకులే దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది అని అన్నారు.
శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి అనిత స్పందించారు. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోవడం అత్యంత బాధాకరమని ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన నారా లోకేశ్కు మంత్రులు నారాయణ, అనిత శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకవైపు పార్టీని మరోవైపు తన శాఖను ఎంతో బాధ్యతగా నిర్వర్తిస్తూ లోకేశ్ అందరికీ స్పూర్తిగా నిలుస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు.
అనకాపల్లి జిల్లా నాతవరంలో అంబేడ్కర్ జయంతి వేడుకల్లో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోం మంత్రి అనిత పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు నేతలు.
సింహాచలం అప్పన్న స్వామివారి వార్షిక చందనోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు.
తప్పు చేసిన వారి విషయంలో చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటామని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏదైనా చట్ట ప్రకారం చేయడమే తప్ప ఎక్కడా ఉదాసీనతగా వ్యవహరించదని పేర్కొన్నారు
ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థలపై వైసీపీ దాడులను హోంమంత్రి అనిత, ఎంపీలు కేశినేని శివనాథ్, కలిశెట్టి అప్పలనాయుడు ఖండించారు. డైవర్షన్ కోసమే ఏబీఎన్ సంస్థలపై వైసీపీ దాడులకు పాల్పడిందని నేతలు ఆరోపించారు.
కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్స్టేషన్లో బాణసంచా పేలుడు ఘటనలో గాయపడిన బాధితులను హోంమంత్రి అనిత పరామర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను కలిసి ధైర్యం చెప్పిన హోం మంత్రి.. వారి కుటుంబసభ్యులతో మాట్లాడారు.