Home » Andhrapradesh
అధికారులందరూ సమన్వ యంతో పనిచేసి ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని ఆర్డీఓ మహేశ పేర్కొన్నారు. ఆయన బుధవారం ధర్మవరం మా ర్కెట్యార్డ్లో ఉన్న ఎంఎల్ఎస్ స్టాక్పాయింట్ను తనిఖీ చేశారు. గోదాములో ఉన్న నిత్యావసర సరుకులను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్, ఇతర రికార్డులను పరిశీలించి సరుకుల లభ్యత, పంపిణీ వివరాలను క్రాస్ చెక్ చేశారు.
మండల వ్యాప్తంగా నాడు - నేడు పథకం పనులతో పాఠశాలల దశ మారుతుందని ఇటు విద్యార్థులు, అటు తల్లిదండ్రులు ఆశపడ్డారు. అయితే పలు పాఠశాల భవనాలు అర్థాం తరంగా ఆగిపోవడంతో అసౌకర్యాల నడుమ విద్యార్థులు చదువులు కొన సాగిస్తున్నారు. మండలంలోని పాఠశాలల తరగతి గదుల నిర్మాణా లను నూతనంగా చేపట్టి, మోడల్ స్కూళ్లుగా తీర్చిదిద్ది ప్రైవేటు విద్యా సంస్థల కు దీటుగా ఉండేలా చేస్తామని గత వైసీపీ పాలనలో అప్పటి పాలకు ఎంతో ఆర్భాటంగా గొప్పలు పలికారు.
మండలపరిధిలోని గోళ్లవారి పల్లి సమీపంలో ఉపాధి నిధులతో పశువుల దాహార్తిని తీర్చడానికి నీటి తొట్టెలు నిర్మించారు. అయితే నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ తరువాత తన కేమీ సంబంధం లేదని అలాగే వదిలేశారు. మరి ఆ తొట్టెలకు నీటి సౌకర్యం ఎవరు కల్పిస్తారో తెలియక పశువుల కాపర్లు ఇబ్బందులు పడుతున్నారు.
తమ గ్రామానికి హంద్రీ నీవా కాలువ ద్వారా సాగు, తాగునీరు వచ్చేలా చూడాలని మండలం లోని ఓబుళనాయునిపల్లి గ్రామస్థులు టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్కు వినతులు అందించారు. ‘మీ సమస్య-మా బాధ్యత’ కార్యక్రమాన్ని ఆయన మంగళవారం మండలంలోని ఓబుళనాయునిపల్లి లో నిర్వహించారు. ప్రజల నుంచి సమస్యలను ఆర్జీల రూపంలో స్వీక రించారు.
తల్లిపాలే బిడ్డకు శ్రీరామ రక్ష అని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ తిప్పేంద్రనాయక్ పేర్కొన్నారు. స్థానిక ఏరియా ప్రభుత్వాస్పత్రిలో మంగళవారం తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా సూపరింటెండెంట్ తిప్పేంద్రనాయక్ తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివ రించారు. తల్లిపాలే బిడ్డకు శ్రేష్టమని, బిడ్డల వ్యాదినిరోధక శక్తిపెర గాలంటే తల్లిపాలే ముఖ్యమన్నారు.
అక్రమార్కులెవరూ తప్పించుకోలేరని ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అన్నారు. పట్టణంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎమ్మిగనూరు పట్టణంలో 2008లో మంజూరై 2009లో అప్పటి ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి హయాంలో రూ. 44కోట్లతో ప్రారంభమై నేటికి అసంపూర్తిగా ఉన్న యూజీడీ(అండర్గ్రౌండ్ డ్రైనేజీ)లో జరిగిన అక్రమాలపై విచారణ కమిటీ వేస్తామన్నారు.
పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తుంగభద్ర నుంచి బుధవారం వరకు 20 క్రస్ట్గేట్ల నుంచి నీటిని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే.. వరద తగ్గుముఖం పట్టడంతో గురువారం కేవలం ఐదు క్రస్ట్గేట్లకు పరిమితం చేశారు.
ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకూ తప్పక పరిష్కారం చూపిస్తామని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. పట్టణంలోని శివానగర్, కేశవనగర్లో జరిగిన ‘మీ సమస్య.. మా బాధ్యత’ పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకుని, అక్కడే ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.
చెట్ల పొదల్లో మనల్ని ఎవరు చూస్తారులే అనుకున్నారు. మత్తు ఇంజక్షన్లు వేసుకుంటూ.. మత్తులో మునిగి తేలుతున్నారు. ఇలా తిరుపతి రూరల్ మండలం లింగేశ్వరనగర్లో బుధవారం మత్తు ఇంజక్షన్లు వాడుతున్న నలుగురు యువకులను డ్రోన్ కెమెరాతో నిఘా వుంచి పోలీసులు పట్టుకున్నారు.
పెళ్లి కాలేదని నమ్మించి, తనను వివాహం చేసుకుని మోసగించాడని గుంతకల్లు పట్టణానికి చెందిన వీఆర్వో మహ్మద్ అలీపై షేక్ షమీమ్ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీపీఐ ఎంఎల్ న్యూడెమోకస్రీ పార్టీ నాయకులతో కలిసి బాధితురాలు న్యాయం కోసం గుంతకల్లు వన్టౌన్ పోలీసులకు ఆశ్రయించారు.