Home » Andhrajyothy Breaking News
ఉజ్జయిని మహంకాళి ఆలయం ముందు జోగినిలు సోమవారం ధర్నా చేపట్టారు. ఆదివారం బోనాల వేడుకల్లో జోగినిలను అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్ శిఖా గోయల్పై ఎక్స్లో గుర్తుతెలియని వ్యక్తి అభ్యంతరకర పోస్ట్ పెట్టారు. ఐపీఎస్ అధికారిణి శిఖా గోయల్ను సోషల్ మీడియా వేదికగా తీవ్ర పదజాలంతో దూషించాడు.
వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని కర్నూలు జిల్లాలోని చిప్పగిరిలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు ఆయన తనయుడు చంద్ర, పలువురు వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.
మినీ మార్ట్ల ద్వారా రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్ను అడ్డుకుంటామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్ను చాలా వరకు అరికట్టామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఈరోజు(ఆదివారం) లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్ - ఆస్ట్రేలియాల మధ్య నాలుగు ఎంవోయూలు కుదిరాయి. ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్, ఆస్ట్రేలియా మంత్రి జూలియన్ హిల్ సమక్షంలో ఎంవోయూలను కుదుర్చుకున్నారు.
మత్తు రహిత సమాజమే లక్ష్యంగా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు.
గాదె సాయికృష్ణ కేసులో సిట్ అధికారులు వేగం పెంచారు. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుడు సురేశ్ ఆచూకీ తెలపాలంటూ గుర్తులతో ప్రకటన విడుదల చేశారు.
సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
పొగాకు రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ సహాయ ప్యాకేజీ ప్రకటించాయని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ప్రతి రైతుకు రూ.50 వేల వడ్డీలేని రుణలను రెండేళ్లలో చెల్లిస్తున్నట్లు ప్రకటించారు.