Home » Andhrajyothy Breaking News
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ఆటోలను ఈవీలుగా మార్చేందుకు.. తెలంగాణలో ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకాన్ని అమలు చేయనుంది.
ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుక హైదరాబాద్లోని JRC కన్వెన్షన్లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు పలువురు ప్రముకులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు.
2025 డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గర ఆదివారం ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భారీగా ఉపాధ్యాయులు పాలుపంచుకున్నారు.
బీఆర్ఎస్, మాజీ మంత్రి కేటీఆర్పై కేంద్రమంత్రి బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పదేళ్లు తెలంగాణను పాలించిందని... కానీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత, అకస్మాత్తుగా ‘భారత్లో మంచి కాలేజీలు లేవు’ అని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 8వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సర్మించుకున్నారు.
సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా, ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వారు పోస్టు పెట్టారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోందని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వ్యాఖ్యానించారు. సైబర్ నేరాల బారినపడుతున్న వారిలో రిటైర్డ్ ఉద్యోగులే ఎక్కువగా ఉంటున్నారని పేర్కొన్నారు.
ఏపీలో ఆధునాతన అగ్నిమాపక వాహనాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రారంభించారు. సీడ్ యాక్సెస్ రోడ్లో ఫైర్ వెహికల్స్ ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమం నిర్వహించారు.
80వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ వినూత్నంగా కొన్ని ఆఫర్లు తీసుకువచ్చింది. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్ CGM ఎం. శేషాచలం ఓ ప్రకటనలో తెలిపారు. ఫ్రీడం 2.0 ఆఫర్ కింద ఒక్క రూపాయికే సిమ్ అందిస్తున్నామని పేర్కొన్నారు.