Home » Andhrajyothy Breaking News
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పర్యటనలో గొడ్డలి పార్టీ శ్రేణులు బస్సులు అడ్డుపెట్టి, సైలెన్సర్లు తొలగించి బలప్రదర్శన చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించాయని ధ్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలతో పులుల మరణాలపై అటవీ శాఖ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అధికారుల తనిఖీల్లో ఆత్మకూరు అటవీ శాఖ డివిజన్లో ఓ వ్యక్తి వద్ద పులి గోర్లను అటవీశాఖ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
మణికొండ బీఆర్ఎస్ మహిళా వింగ్ ప్రెసిడెంట్ పట్లోళ్ల రూపారెడ్డి ఇంటి వద్ద పలువురు బాధితులు ఆందోళన చేపట్టారు. చిన్నాచితక వ్యాపారుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేశారంటూ ఆరోపించారు.
తెలంగాణలో డయల్ 112 సేవలను రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి బుధవారం ప్రారంభించారు.
ఫేస్బుక్ యాజమాన్యానికి కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన విషయం తెలసిందే. కేంద్రం సమన్లకు ఫేస్బుక్ యాజమాన్యం స్పందించింది.
విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
క్షుద్రపూజలు ఎందుకు చేశావంటే మాజీ మంత్రి హరీశ్రావు తమకు లీగల్ నోటీసులు పంపుతున్నారని తెలంగాణ ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్తో సహా ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వారికి లీగల్ నోటీసులు పంపారని ధ్వజమెత్తారు.
కల్తీ మసాలా దినుసులపై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. నిందితులపై బీఎన్ఎస్ 110 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపింది.
జమ్మూకశ్మీర్, లద్దాఖ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ప్రతి పౌరుడు వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.
ప్రపంచ స్థాయి క్రీడాకారులను పీవీ సింధు అకాడమీ తయారు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. యువత ముఖంలోనే దేశ భవిష్యత్తు దాగి ఉందని పేర్కొన్నారు.