Home » Andhra Pradesh
ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఇందులో భాగంగా తీర ప్రాంతాలలో మౌలిక సదుపాయాలపై ఎమ్మెల్యే సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రశ్నించారు.
ఏపీలో డేటా సెంటర్ల ఏర్పాటుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదానీ ఇన్ఫ్రా ప్రతిపాదనలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది.
మిలాద్-ఉన్-నబి పండుగకు సంబంధించిన సెలవు తేదీని మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా ప్రకటించిన ఆగస్టు 25కు బదులుగా ఆగస్టు 26వ తేదీని(బుధవారం) సాధారణ సెలవు దినంగా ప్రకటించింది.
ప్రకాశం జిల్లా ఒంగోలులో విషాద ఘటన చోటు చేసుకుంది. లిఫ్ట్, ఫ్లోర్ మధ్యలో ఇరుక్కుని 50 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అనకాపల్లి జిల్లాలో చేపట్టనున్న BARC ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊరట కల్పించింది. ప్రాజెక్టు కోసం భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులను మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
విశాఖపట్నం జూ పార్కు వద్ద పోలీస్ ఎస్కార్ట్ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో సుమారు 10 మంది కానిస్టేబుళ్లు గాయపడ్డారు.
కాకినాడ జిల్లా తుని చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు పోలీసులు నివేదిక సమర్పించారు. ఇప్పటివరకు జరిగిన కేసు దర్యాప్తు వివరాలను ఆ నివేదిక ద్వారా కోర్టుకు తెలియజేశారు.
ఏపీలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సాధారణ ఎన్నికల ప్రక్రియకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య రైల్వే లైన్ల విస్తరణ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు ఉభయ సభల్లో పలు కీలక అంశాలపై చర్చలు, బిల్లుల ఆమోదం, నివేదికల సమర్పణ జరగనున్నాయి.