Home » Andhra Pradesh
అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట జడ్పీ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు రెండ్రోజుల కిందట విద్యార్థులతో పనులు చేయించారు. పనులు చేస్తుండగా 8వ తరగతి విద్యార్థి మణికంఠ చేతికి తీవ్రగాయమైంది.
జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 22A పేరుతో విశాఖలో వేల ఎకరాల చుక్క భూములను కబ్జా చేయడాన్ని దోపిడీ అంటారని ఎమ్మెల్సీ అనురాధ ఆరోపించారు. అమరావతి అంటే కేవలం భూములు కాదు.. అది ఐటీ హబ్, స్పోర్ట్స్ సిటీ, యూనివర్సిటీలు, వేల మంది యువతకు ఉపాధి కల్పించే గ్లోబల్ సెంటర్ అని కొనియాడారు.
కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్స్టేషన్లో బాణసంచా పేలుడు ఘటనలో గాయపడిన బాధితులను హోంమంత్రి అనిత పరామర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను కలిసి ధైర్యం చెప్పిన హోం మంత్రి.. వారి కుటుంబసభ్యులతో మాట్లాడారు.
మార్కాపురం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పుల్లలచెరువులోని మొక్కజొన్న ఫ్యాక్టరీపై పిడుగుపడింది. పిడుగుపాటుకు గురై కన్నయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
శ్రీకాకుళం జిల్లా వాసుల చిరకాల ఆకాంక్ష మూలపేట పోర్టు అని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. నవంబర్ నాటికి పోర్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించే దిశగా కీలక ముందడుగు పడింది. పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు-2026.. సోమవారం రాష్ట్రపతి భవన్కు చేరుకుంది.
రాష్ట్ర భవిష్యత్తు, వ్యవసాయ సుస్థిరత కేవలం నీటి సంరక్షణతోనే సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించారు. యాడికిలో సాగునీటి సంఘాలు, రైతులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు..
దేశం పట్ల ప్రేమ, దేశ ప్రజల పట్ల అంకితభావం అనే సిద్ధాంతాలే ఆలంబనగా బీజేపీ ముందుకు వెళ్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీలోని పలు ప్రాంతాల్లో రాబోయే కొన్ని గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వివరాల్లోకి వెళితే..
బీజేపీ 47వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ సీఎం ట్వీట్ చేశారు.