Home » Andhra Pradesh
అమరావతే రాజధాని అని గతంలో జగన్తో సహా అన్ని పార్టీలు ఒప్పుకున్నాయని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గుర్తుచేశారు. 2019లో అధికారంలోకి రాగానే జగన్ మాట మార్చి మూడు రాజధానులు అన్నారని మండిపడ్డారు.
బీసీ సంక్షేమానికి తొలి మూడు బడ్జెట్లలో వరుసగా రూ.39 వేల కోట్లు, రూ.47 వేల కోట్లు, రూ.51 వేల కోట్లను కూటమి ప్రభుత్వం కేటాయించిందని మంత్రి సవిత తెలిపారు. మూడో బడ్జెట్లో బీసీల సంక్షేమం కోసం రికార్డు స్థాయిలో రూ.51 వేల కోట్లు కేటాయించామన్నారు.
ఐదేళ్లలో 20 వేల స్టార్టప్లు, లక్ష ఉద్యోగాలే లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ‘వన్ ఫ్యామిలీ–వన్ ఎంటర్ప్రెన్యూర్’ లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల స్థానిక కేడర్లలో పోస్టుల కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. 2025 రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా కేడర్ బలం నిర్ణయించే విధానాన్ని జీవోలో స్పష్టంగా పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. సునీత గంధం, ఆలపాటి గిరిధర్, పురుషోత్తమ్ కుమార్ చింతలపూడి అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించారు.
ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మార్కాపూర్ జిల్లా ఓఎస్డీగా నవ్ జ్యోతి మిశ్రాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినానిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ను వ్యక్తిగతంగా ఎప్పుడూ తిట్టలేదని.. ఆయన వ్యతిరేక సిద్ధాంతాలపైనే మాట్లాడుతానని చెప్పుకొచ్చారు.
అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం రేవు పోలవరం సముద్ర తీరంలో పడవ బోల్తా ఘటనలో మత్స్యకారుల గల్లంతుపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు.
టిబెట్కు చెందిన బౌద్ధ మత గురువు దలైలామా పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. దలైలామాకు సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు.
దక్షిణ కొరియా పర్యటనలో ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ బిజీబిజీగా ఉన్నారు. ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో వరుసగా భేటీ అయి చర్చలు జరుపుతున్నారు.