Home » Andhra Pradesh
మదనపల్లిలో చిన్నారి హత్య కేసు నిందితుడు కులవర్ధన్ మృతిపై జిల్లా ఎస్పీ ధీరజ్ స్పష్టతనిచ్చారు. కురబలకోట మండలం కనసానిపల్లె చెరువులో ఈరోజు ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని తెలిపారు.
మదనపల్లిలో దారుణ హత్యకు గురైన ఏడేళ్ల బాలిక అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. చిన్నారికి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి వీడ్కోలు పలికారు.
రోడ్ల విస్తరణలో చెట్ల తొలగింపు అంశంపై ఏపీ అసెంబ్లీలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. వన సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు.
మదనపల్లిలో ఏడేళ్ల చిన్నారి హత్య కేసులో నిందితుడు మృతిచెందాడు. ముదివేడు మండలం కనసానిపల్లి చెరువులో ఓ మృతదేహం లభించగా.. చిన్నారి హత్య కేసు నిందితుడిగా పోలీసులు గుర్తించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్కి స్వల్ప ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం విశాఖపట్నంలోని సిరిపురం నుంచి పెద్ద వాల్తేరు వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
వైసీపీ సభ్యుల నిరసనలతో ఏపీ శాసనమండలి వాయిదా పడింది. వైసీపీ ఇచ్చిన రెండు వాయిదా తీర్మానాలను చైర్మన్ తిరస్కరించారు.
రేణిగుంటలో ఓ యువకుడు నడిరోడ్డుపై కత్తితో గొంతు కోసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనను చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఆరోగ్యవంతమైన బాల్యాన్ని లక్ష్యంగా పెట్టుకొని ప్రారంభించిన ప్రజారోగ్య కార్యక్రమాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినం ఒక టని మలేరియా యూనిట్ జిల్లా అధికారి ఓబులు పేర్కొన్నారు. నులి పురుగుల నిర్మూలన ద్వారా పిల్లల శారీరక, మానసిక వికాసం మెరుగ వుతుందన్నారు.
సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులతో కలిసి మున్సిపాల్టీలోని ప్రతి వార్డును సందర్శిస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన తలారి గౌతమి సోమశేఖర్ పేర్కొన్నారు. ఆమె మంగళవారం మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్తో కలిసి 11వ వార్డులో పర్యటించారు.
విద్యుతతీగలు చేతికి అందే ఎత్తులో ముళ్లకంపల్లో పడిఉండి ప్రమాదకరంగా ఉన్నా యని ఆవులదట్ట గ్రామస్థులు ఆంజనేయులు, శంకర్నాయక్, రామాంజి, నాగరాజు మంగళవారం పేర్కొన్నారు. వీటితో పలుమార్లు ప్రమా దాలు జరిగినా విద్యుత అధికారులు పట్టించుకోవడం లేదని వాపో యారు.