Home » Andhra Pradesh
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
చేపల వేటకు వెళ్లి తిరిగి రాని మత్స్యకారుల బోటు కోసం కోనసీమ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అల్లవరం మండలం ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్కు చెందిన IND-AP-E8-MO-135 బోటు ఈ నెల 3న చేపల వేటకు వెళ్లినట్లు జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ తెలిపారు.
‘పాఠాలు చెప్తాం.. గుణపాఠాలు కూడా నేర్పుతాం’ అంటూ టీచర్లు చేస్తున్న ర్యాలీలను గొడ్డలి పార్టీ గుర్తు పెట్టుకోవాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. గిరిజనులను గొడ్డలి పార్టీ నాయకులు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
అమరావతి రాజధాని ప్రాంతంలో విద్యారంగ అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. అబ్బురాజుపాలెంలోని E3–N14 జంక్షన్ వద్ద మూడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న అమరావతి ఎడ్యుకేషనల్ & కల్చరల్ అకాడమీకి శంకుస్థాపన జరిగింది..
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గమ్యానికి కొత్త రెక్కలు తొడుగుతూ భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో నేటి నుంచి సేవలు ప్రారంభం కావడం ఎంతో ఆనందదాయకమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
ఏపీ గ్రీనింగ్, రీఫారెస్టేషన్ కార్యక్రమాల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు పర్యావరణ, అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
మెగా డీఎస్సీ నియామకాల అంశంపై ఏపీ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. మంచి విద్య, నైపుణ్యాలు అందిస్తే అత్యుత్తమ మానవ వనరులుగా విద్యార్థులు తయారవుతారని విశ్వసించామన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. తమ వారి ఆచూకీ కోసం అల్లవరం మెరైన్ పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. శాసనసభలో యనమదురు డ్రెయిన్ ఆధునీకరణ, కేశనపల్లి కెనాల్ ప్రాజెక్టు స్థితిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ఇచ్చారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలను నాలుగు రోజుల పాటు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. ఈరోజు స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది.