Home » Ananthapuram
స్కిల్ డెవలప్మెంట్ తరహాలోనే బైజూస్ కంటెంట్లో అవినీతి జరిగిందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బైజుస్లో జరిగిన అవినీతిపై ఆధారాలు సేకరిస్తున్నామని.. త్వరలోనే కేసులు పెడుతామని అన్నారు.
అనంతపురం: రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి.. ఎర్రగుంట్ల వైసీపీ సర్పంచ్ వన్నూరమ్మ భర్త హనుమంతప్పకు చుక్కలు చూపించారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి రాకుంటే చర్యలు తీసుకుంటామంటూ బెదిరించారు.
శ్రీ సత్య సాయి జిల్లా: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక హిందూపురంలో టీడీపీ కార్యకర్త గుండెపోటుతో మృతి చెందాడు.
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద రెండు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్నారు. దీంతో కాల్వ శ్రీనివాసుల దీక్షను పోలీసులు ఆదివారం తెల్లవారుజామున భగ్నం చేసి ఆస్పత్రికి తరలించారు.
అనంతపురం: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వతహాగా శాంతిపరుడని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. విచ్చిన్నకర శక్తులు.. ఆరాచకాలకు దిగారని ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి ముందుకు వెళ్తానంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా పవన్పై సెటైర్లు విసిరారు. నిన్నటి వరకు పవన్ బీజేపీతో ఉన్నారని... పొత్తుపై బిజేపి సరిగా స్పందించలేదు ఏమో...! అందుకే అయన టీడీపీతో ఉంటానని తేల్చి చెప్పారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ధర్మవరంలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఉదయం పరిటాల శ్రీరామ్ను హౌస్ అరెస్టు చేసేందుకు పోలీసులు వచ్చారు. అయితే వారి కళ్లు కప్పి గోడ దూకి ఎన్టీఆర్ విగ్రహం వద్దకు పరిటాల శ్రీరామ్ చేరుకున్నారు.
మాజీ మంత్రి పరిటాల సునీతను తెల్లవారుజామున నాలుగు గంటలకే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
ప్రజాసమస్యలపై మాట్లాడితే రౌడీలతో దాడులు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మూడు రోజులు పాటు అనంతలో పర్యటించనున్నారు. ఈనెల 5న రాయదుర్గం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. టీడీపీ ప్రభుత్వ హాయంలో వేదవతి నదిపై నిర్మించిన బ్రిడ్జి వద్ద సెల్ఫీ చాలెంజ్, వేరుశనగ రైతులతో చంద్రబాబు ముఖాముఖి మాట్లాడనున్నారు.