Home » Anantapur
పట్టణంలోని జిల్లా పరిషత సెంట్రల్ ఉన్నత పాఠశా లలో 2005-06 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిం చారు. ఇరవైఏళ్ల తర్వాత ఒక చోట కలుసుకున్న వారు చిన్ననాటి జ్ఞాప కాలను నెమరు వేసుకున్నారు.
నియోజకవర్గంలో ఈ ఏడాది రబీసీజనలో 1.15 లక్షల ఎకరాల దాకా సాగునీటితో రైతులు వరిపంట సాగుచేశారని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. అధిక ది గుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం మండలంలోని కలుగోడు గ్రామంలో బీటీపీ సాగునీటితో పండిస్తున్న వరి పంట పొలాలను పరిశీలించారు.
పాడి రైతులను ప్రోత్స హించేందుకు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన గోకులం పథకం కింద పలువరు పాడి రైతులు అప్పులు చేసి షెడ్లు నిర్మించుకున్నారు. వాటిని గత యేడాది నిర్మించుకోగా ఇప్పటికీ సంబంధిత బిల్లులను జమ చేయక పోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు.
పట్టణంలోని ప్రసిద్ధి చెందిన ప్రసన్న వెంకట రమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం మ యూరవాహనంపై శ్రీవా రు భక్తుల కు దర్శనమి చ్చారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామివారి ఉత్సవ విగ్రహాలను సా యంత్రం మయూర వా హనంపై కొలువుదీర్చి దేవాలయం వద్ద నుంచి వినాయక సర్కిల్ మీదు గా నేసేపేట వరకు ఊరేగించారు.
నియోజకవర్గంలో రూ. 17 కోట్ల వ్యయంతో గ్రామీణ, అంతర్ రాష్ట్ర రహదారుల మరమ్మతు పను లు చేపట్టామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు వెల్లడించారు. మండల కేంద్రంలో శనివారం రూ. 6కోట్లతో చేపట్టిన గుండ్లపల్లి- బళ్లారి జాతీయ రహదారి మరమ్మతు పనులకు ఆయన భూమి పూజ చేశారు.
మండల పరిధిలోని పెన్నహోబి లం లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి. గత నెల 29వ తేదీన ధ్వజారోహణంతో ఉత్స వాలకు అంకురార్పణ జరి గింది. 12రోజుల పాటు ఉత్సవాలు వైభవోపేతంగా సాగాయి. ఈ సంద ర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, ఉత్సవ విగ్రహాలతో వాహన సేవలు నిర్వహించారు.
కంబదూరు మండల కేంద్రంలో కన్నీటి కష్టా లు రోజురోజుకీ అధికమవుతున్నాయి. ఆర్నెల్లు గా బిందెడు నీటి కోసం ప్రజలు నానా తం టాలు పడుతున్నారు. ఇక గత్యంతరం లేక ట్యాంకర్లను పెట్టి నీటిని కొనుగోలు చేసే పరిస్థితి వచ్చింది. లోతట్టు ప్రాంతాలకు బిం దెడు నీరు దొరకాలంటే ఎన్ని రోజులు పడు తుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని పలు కాలనీల ప్రజలు వాపోతున్నారు.
పట్టణంలోని మార్కండేయస్వామి ఆలయంలో శనివారం భద్రావతి భావనా రుషీశ్వరుల కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేదపం డితులు జానకిరామశర్మ భద్రావతి భావనా రుషీశ్వరుల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉత్సవ విగ్ర హాలను అలంకరించి పద్మ శాలి సంఘం ఆధ్వర్యంలో కల్యాణాన్ని ని ర్వహించారు. భక్తులు, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
అర్హులైన పేదలందరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావు ల కేశవ్ పేర్కొన్నారు. ఇంటి స్థలాల పంపిణీ కోసం అవసరమైన, అ నువైన స్థలాలను మంత్రి శుక్రవారం పరిశీలించారు.
దశాబ్దాల తరబడి అర్చక వృత్తిలో ఉంటూ మండలకేంద్రంలోని లక్ష్మీచెన్నకేశవస్వామి, కొత్తరాయుడుస్వామి ఆలయాల్లో స్వామివార్లకు సేవలు అందిస్తున్న అర్చకుడు హరికృష్ణశ ర్మను శుక్రవారం ఆర్యవైశ్యులు ఘనంగా సన్మానించారు.