Home » Anantapur
అనంతపురంలో జరిగిన శాప్ వెటరన్స జిల్లా స్థాయి పరుగు పోటీల్లో గుంతకల్లుకు చెందిన మాజీ కౌన్సిలరు బీ సుంకప్ప మొదటి స్థానాన్ని సాధించి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అనంతపురంలోని నీలం సం జీవరెడ్డి గ్రౌండ్స్లో మంగళవారం నిర్వహించిన పరుగు పందెంలో 45 ఏళ్ల పైబడిన సంకప్ప వెటరన కేటగిరిలో 100 మీటర్లు, 400 మీటర్ల విభాగాలలో మొదటి స్థానాన్ని కైవశం చేసుకున్నారు
ఉద్యోగ, ఉపాధ్యా యుల ఆర్థిక డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని యూటీఎఫ్ నాయకు లు డిమాండ్ చేశారు. స్ధానిక తహసీల్దార్ కా ర్యాలయం వద్ద మంగళ వారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఒక రోజు నిరాహార దీక్షను చేపట్టారు.
కూటమి ప్రభుత్వం కృషి ఫలితమే ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ అయిందని టీడీపీ నాయకులు పేర్కొరు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సూచనల మేరకు టీడీపీ నా యకులు మంగళవారం స్థానిక ప్రజావేదిక నుంచి బైక్ ర్యాలీగా టీ స ర్కిల్ వరకు వెళ్లారు. అక్కడ ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూ టీ సీఎం పవన కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్ర పటాలకు క్షీరాభి షేకం చేశారు.
క్షయ వ్యాధిని పారద్రోలి క్షయ రహిత దేశంగా చూడాలన్నదే ప్రతి ఒక్కరి లక్ష్యంగా ఉండాలని ఆర్డీవో వసంతబాబు పిలుపుని చ్చారు. ప్రపంచ క్షయ వ్యా ధి నిర్మూలన దినం సందర్భంగా మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి నుంచి టీ సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టారు.
పల్లెపండుగ 2025-26 లో భాగంగా మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద మూగజీవుల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం నీటితొట్టె లు ఏర్పాటుచేసింది. ఒక్కొక్క తొట్టె నిర్మాణానికి సుమారు రూ.40వేలు మేర ఖ ర్చుచేసింది
పాత గుంత కల్లులోని శ్రీశైల జగద్గురు మఠంలో ఆదివారం 1008 శ్రీశైల జగ ద్గురు డాక్టర్ చెన్న సిద్దరామ పండితారాధ్య శివాచార్య మహా స్వా ములు ఇష్ట లింగపూజ నిర్వహించారు. శ్రీశైలం నుంచి శనివారం రా త్రి గుంతకల్లుకు చేరుకున్న ఆయనకు మఠం మేనేజరు, భక్తులు స్వాగతం పలికారు.
హెచ్చెల్సీ ఆధుని కీకరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి, కాలువల మరమ్మతులకు తక్ష ణం రూ. 430 కోట్లు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు డు డి జగదీష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన ఆదివారం కళ్యాణదుర్గంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్తో కలిసి మీ డియాతో మాట్లాడారు.
డి.హీరేహాళ్ మండలం లోని మురడి గ్రామంలో వెలసిన ఆంజనేయ స్వా మి ఉత్సవాల సందర్భం గా ఆదివారం రాత్రి లం కా దహనం కార్య్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
మండలంలోని తూట్రా ళ్లపల్లిలో ఆదివారం చౌడేశ్వరీదేవి జ్యోతుల ఉత్సవాన్ని ఘనంగా నిర్వ హించారు. భక్తిశ్రద్ధలతో తయారుచేసిన జ్యోతులను ఊరేగింపుగా ఆల యానికి తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు.
పట్టణంలోని మార్కండేయ స్వామి ఆలయంలో శనివారం పద్మశాలీయ సంఘం పట్టణ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జలదుర్గం దామోదర్దాస్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సంఘం సభ్యుల కు కృతజ్ఞతలు తెలిపారు.