Home » Anantapur urban
నగరపాలక సంస్థలో ప్రధాన అధికారుల పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇనచార్జ్లతో నే పాలనను నెట్టుకొస్తున్నారు. ఏఎంసీ సెక్రటరీ, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, ఏసీపీ, మేనేజర్, అడిషినల్ కమిషనర్ ఇలా అన్ని రకాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో నగరపాలక సంస్థ ఆశించిన మేర అభివృద్ధికి నోచుకోలేకపోతోంది. నగరపాలక సంస్థగా రూపాంతరం చెంది దాదాపు రెండు దశాబ్దాలు గడిచినా నగరంలో అభివృద్ధి అంతంతమాత్రంగానే ఉంది.
విద్యార్థులకు సైన్సతో కూడిన సృజనాత్మకత అవసరమని జీవశాస్త్ర అధ్యాపకురాలు అరుణ అన్నారు. జనవిజ్ఞాన వేదిక నగర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కేఎ్సఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన చెకుముకి మండలస్థాయి సైన్స సంబరాల కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
కార్తీకమాసమంటేనే భక్తిభావం. ఈ మాసంలో పౌర్ణమి రోజు వెలిగించే ప్రతి దీపంలోనూ సాక్షాత్తు త్రయంబకేశ్వరుడు కొలువై వుంటాడన్నది పురాణాలు చెబుతున్న సారాంశం. ఈ పర్వదినంకోసం యావత్ భక్తకోటి వేయికళ్లతో ఎదురుచూస్తుంటుంది.
దేవుడికి సేవ చేయాలన్నదే నా లక్ష్యమని సూగూరు ఆంజనేయస్వామి ఆలయ నూతన చైర్మన వైసీ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం ఆలయం వద్ద చైర్మన, కమిటీ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఆలయ అధికారులు కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఎస్కే యూనివర్శిటీ అంతర్ కళాశాలల మహిళా కబడ్డీ పోటీల్లో ఎస్ఎ్సబీఎన, ఎస్ఎల్ఎన కళాశాలల జట్లు ఫైనల్కు చేరాయి. శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ అంతర్ కళాశాలల మహిళల కబడ్డీ పోటీలు గురువారం స్థానిక ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించారు.
అనంత నగరం జలమయమైంది. గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి అన్ని ప్రాంతాల్లోని రోడ్లల్లో, వీధుల్లో పెద్దఎత్తున నీరు చేరాయి.. కలెక్టర్ ఆనంద్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ కలెక్టర్ సచిన రహార్, నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు.
ఆడపిల్లలకు శాస్త్రీయ అవగాహన అవసరమని జేవీవీ రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ ప్రసూన అన్నారు. శనివారం కురుగుంట బాలికల రెసిడెన్షియల్ హైస్కూల్ల్లో జన విజ్ఞాన వేదిక మహిళా విభాగం సమత ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహించారు.
పాఠశాల స్థాయి నుంచే ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని అహుడా చైర్మన టీసీ వరుణ్ అన్నారు.
దివ్యాంగులను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. రాప్తాడు ఉన్నత పాఠశాలలో దివ్యాంగ విద్యార్థులకు ఉచిత ఉపకరణాల ఎంపిక శిబిరానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నగరంలోనుంచి రూరల్ పరిధిలోకి వెళ్లే దారిలో సిమెంటు లారీ అడ్డంగా పెట్టడంతో వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. రుద్రంపేటలోని చంద్రబాబునగర్ ప్రధాన రహదారిలో పెట్రోలు బంకు పక్కనే ఓ భవనాన్ని నిర్మిస్తున్నారు.