Home » Anantapur urban
గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటు న్న సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. మండలంలోని పేరూరులో శనివారం ఆమె ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి ఇబ్బందులు గురించి విన్నారు.
వర్కింగ్ జర్నలిస్టులు నిత్యం పని ఒత్తిడితో ఉంటారని, ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనిన, జర్నలిస్ట్ డెవల్పమెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని కలెక్టర్ కాన్ఫరెన్స హాల్లో వర్కింగ్ జర్నలిస్టులకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు.
పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంతరావు అధికారులు, సిబ్బందిని హెచ్చరించారు. శుక్రవారం స్థానిక సూర్యానగర్ సర్కిల్లో జరుగుతున్న పారిశుధ్యపనులను ఆయన క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.
రాష్ట్రపతి నుంచి గ్రామస్థాయి అధికారివరకు కీర్తించే అంబేడ్కర్ జయంతిని అడ్డుకోవడం దుర్మార్గమని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకేహరి మండిపడ్డారు. ఇందుకు కారణమైన కనగానపల్లి మండలం కొండపల్లికి చెందిన చంద్రశేఖర్రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గురువారం అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించి, జడ్జిబంగ్లా మీదుగా జిల్లా కోర్టువరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.
స్కేయూ పరిధిలోని పీజీ నాల్గవ సెమిస్టర్ ఫీజులు రద్దు చేయాలని ఎస్ఎ్ఫఐ, ఏఐఎ్సఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. గురువారం ఎస్కేయూలోని పరీక్షల విభాగాన్ని విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించారు.
ప్రజా సమస్యలపై ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తోందని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ అన్నారు. గురువారం అర్బన కార్యాలయంలో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. పలు కాలనీల నుంచి వచ్చిన ప్రజలతో ఆయన అర్జీలు స్వీకరించారు.
వెనుకబడిన కురుబల అభివృద్ధికి సమష్టి కృషిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ అన్నారు. నూతనంగా కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జునను సోమవారం స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో రాజేష్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.
ప్రజా సమస్యలు పరిష్కారానికే ప్రజాదర్బార్ నిర్వహించినట్లు ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. మండలంలోని పలు సమస్యలపై ఎమ్మెల్యే అర్జీలను స్వీకరించారు.
అనంతపురంలో మహి ళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహించాలని అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ఏఎల్ఈఏపీ చైర్మన రమాదేవిని కోరారు.
జలధార పథకం కింద చేపట్టే పనులపై 10రోజుల్లో ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇరిగేషన అధికారులను ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశించారు. సోమవారం స్థానిక పంచాయతీ రాజ్ శాఖ అతిథి గృహంలో ఇరిగేషన శాఖ అధికారులతో జలధార పథకంపై సమీక్ష నిర్వహించారు.