Home » Anantapur urban
అనంత నగరం జలమయమైంది. గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి అన్ని ప్రాంతాల్లోని రోడ్లల్లో, వీధుల్లో పెద్దఎత్తున నీరు చేరాయి.. కలెక్టర్ ఆనంద్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ కలెక్టర్ సచిన రహార్, నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు.
ఆడపిల్లలకు శాస్త్రీయ అవగాహన అవసరమని జేవీవీ రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ ప్రసూన అన్నారు. శనివారం కురుగుంట బాలికల రెసిడెన్షియల్ హైస్కూల్ల్లో జన విజ్ఞాన వేదిక మహిళా విభాగం సమత ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహించారు.
పాఠశాల స్థాయి నుంచే ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని అహుడా చైర్మన టీసీ వరుణ్ అన్నారు.
దివ్యాంగులను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. రాప్తాడు ఉన్నత పాఠశాలలో దివ్యాంగ విద్యార్థులకు ఉచిత ఉపకరణాల ఎంపిక శిబిరానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నగరంలోనుంచి రూరల్ పరిధిలోకి వెళ్లే దారిలో సిమెంటు లారీ అడ్డంగా పెట్టడంతో వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. రుద్రంపేటలోని చంద్రబాబునగర్ ప్రధాన రహదారిలో పెట్రోలు బంకు పక్కనే ఓ భవనాన్ని నిర్మిస్తున్నారు.
సమాజంలోని అన్ని అవకాశాల్లో బాలికలకు సమానత్వముందని, వారిని ప్రోత్సహించడం కుటుంబ సభ్యులు మరవకూడదని డీఎంహెచఓ ఈబీ దేవి అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజేంద్ర నగరపాలకోత్న పాఠశాలలో వేడుకలు నిర్వహించారు.
సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ద్వారా ప్రజలకు భారం తగ్గి, ప్రతి కుటుంబంలో వెలుగులు నింపే నిర్ణయాలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుందని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ అన్నారు. మండల కేంద్రంలో జీఎస్టీ తగ్గింపుతో ధరల తగ్గుదలపై శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
బాలికలు లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువులో బాగా రాణించాలని ఎమ్మెల్యే పరిటాలసునీత అన్నా రు. చెన్నేకొత్తపల్లిలోని మోడల్ స్కూల్లో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ధర్మవరం ఆర్డీఓ మహేశతో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మానవదేహంలో ప్రధానమైన నేత్రాలకు విశ్రాంతినివ్వాలి. నిరంతరాయంగా మొబైల్, ల్యాప్టాప్ వినియోగం. వెలుతురులేని ప్రదేశాల్లో అధికసమయం ఉండటం వంటి అంశాలు నేత్రాలకు నిరంతర శ్రమలాంటిది.
తాడేపల్లి ప్యాలె్సలోని వైసీపీ నేతల డైరెక్షనలో చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహానికి సర్పంచ నిప్పుపెట్టాడని టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మండిపడ్డారు.