Home » Anantapur urban
ఇనఫినిటీ పాఠశాలలో విద్యార్థులను చదువుతోపాటు పరిశోధనలవైపు ప్రోత్సహించడం ఆనందదాయకమని ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ టీకే సుందరమూర్తి అన్నారు. శనివారం నగరంలోని ఇనఫినిటీ స్కూల్ను ఆయన సందర్శించి ఇస్రో అనుబంధ అంతరిక్షర పయోగశాలను ప్రారంభించారు.
రైతుల అవసరం మేరకు ఎంత విత్తనమైన అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మె ల్యే పరిటాలసునీత అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రం వద్ద ఆమె విత్తన వేరుశనగ పంపిణీని ప్రారంబించారు.
అర్హులైన ఏ ఓటరుకూ అన్యాయం జరక్కూడదని, అక్రమ ఓట్లపైనా దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పార్టీ నేతలను ఆదేశించారు. శనివారం అర్బన కార్యాలయంలో ఆయన పార్టీ క్లస్టర్ ఇనచార్జులు, యూనిట్, డివిజన ఇనచార్జులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.
రాప్తాడు, ధర్మవరం నియోజకవవర్గాల్లో విద్యుత సమస్యలు పరిష్కరించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ను ఎమ్మెల్యే పరిటాల సునీత కోరారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి సంక్షేమ పేరుతో తిరుపతి దామినేడులో జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి నారాలోకేశ, విద్యుత శాఖ మంత్రి గొట్టిపాటితో పాటు పలువురు మంత్రులతో ఆమె భేటీ ఆయ్యారు.
అధికారుల ఒత్తిళ్లతోనే కర్నూలులో వీఆర్వో హుస్సేన ఆత్మహత్య చేసుకున్నారని సచివాలయ ఉద్యోగుల అసోసియేషన నాయకులు విమర్శించారు. వీఆర్వో ఆత్మహత్యకు నిరసనగా సోమవారం సాయంత్రం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి జడ్పీ ఎదురుగా ఉన్న అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.
ఎలాంటి షరతులు లేకుండా మహిళా రిజర్వేషన బిల్లును ప్రవేశపెట్టి తీర్మానం చేయాలని ఏపీ మహిళా సమాఖ్య నేతలు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్వద్ద వారు నిరసన తెలిపారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తరణ సవరణ(సర్) నేపథ్యంలో ఓట్ల కూర్పులు, చేర్పులపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ నగర అధ్యక్షుడు సుధాకర్ యాదవ్ సూచించారు. బుధవారం అర్బన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
కార్యకర్తల కష్టంతోనే కూటమి అధికారంలోకి వచ్చిందని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన(సర్)పై అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పరిటాల సునీత నాయకులు, కార్యకర్తలకు సూచించారు. మండల కేంద్రంలో సోమవారం క్లస్టర్, యూనిట్, బూతలెవల్ ఏజెంట్లు, నాయకులతో సమావేశమై సర్పై అవగాహన కల్పించారు.
పొగాకు ఉత్పత్తుల వినియోగంతో శరీర దృఢత్వాన్ని కోల్పోతారని జిల్లా పొగాకు నియంత్రణ అధికారి శ్రీరాములు అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జేఎనటీయూలో క్రీడాకారులకు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే అనంతపురం అర్బనలో ప్రజలకు రూ.6.04 కోట్ల సీఎంఆర్ఎఫ్ సాయం అందించామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ అన్నారు.