Home » Anantapur urban
తెలుగుదేశం పార్టీ అర్బన నియోజకవర్గం మినీ మహానాడును విజయవంతం చేద్దామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పిలుపునిచ్చారు. అర్బన నియోజకవర్గం మినీ మహానాడును మంగళవారం ఉదయం 10 గంటలకు నగరంలోని కమ్మభవనలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవా రం పలువురు నాయకులతో కలిసి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ కమ్మభవనలో మినీమహానాడు ఏర్పాట్లను పరిశీలించారు.
ఎమ్మెల్యే దగ్గుపాటి వెంక టేశ్వరప్రసాద్ ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేశకు అనంతపురం నగర శివారులోని తపోవనం వద్ద అపూర్వ స్వాగతం పలికారు. శుక్రవారం గుత్తిలో పర్యటన ముగించుకొని నగరానికి వచ్చిన నారా లోకేశకు రెండు భారీ జగమాలలతో స్వాగతం పలికారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తన తరలివచ్చారు. అలాగే మధ్యాహ్నం జేఎనటీయూ హెలి ప్యా డ్ వద్ద ఘనంగా వీడ్కోలు పలికారు.
మండ లంలోని నసనకోట సమీ పంలో వెలసిన దుర్గాం బ దేవత ఉత్సవాల్లో భా గంగా మూడో రోజు శుక్రవారం భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు ని ర్వహించారు. అభ యాంజనేయస్వామి విగ్రహాన్ని వేదపండి తు ల మంత్రోచ్ఛారణ నడు మ పునఃప్రతిష్ఠించారు. ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె కుటుంబ సభ్యులతో పాటు నసనకోట, వెంకటాపురం, గంగంపల్లి గ్రామస్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
జేఎనటీయూ స్నాతకోత్సవాలను పురస్కరించుకుని శనివారం జిల్లాకు వస్తు న్న రాష్ట్ర గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ పర్యటనకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ పేర్కొ న్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఆయన జేఎన్టీయూ, సూ పర్ స్పెషాలిటీ హాస్పిటల్, రైల్వేస్టేషన, ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ గవర్నర్ పర్యటించే అన్ని ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు, రైల్వేస్టేషన వీఐపీ లాంజ్లో ఏర్పాట్లను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
కాలనీలోకి వచ్చిన వర్షపు నీరు వెళ్లేందుకు వీలులేక పోవడంతో కురుగుంట వైఎస్సార్ కాలనీ వాసు లు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వచ్చిందంటే వారి అవస్థలు వర్ణతీ తం. రూరల్ మండలం కురుగుంట పంచాయతీలోని పాత కురుగుంటతో పాటు చుట్టు పక్కల గ్రామాలైన యాలేరు, మదిగుబ్బ, కామారుపల్లి ప్రాంతాల పరిధిలోని పొలాల నుంచి పారే వర్షపు నీరు వైఎస్సార్ కాలనీ నుంచి సమీపంలోని తడకలేరు లోకి వేళ్లేందుకు చిన్న పాటి వంక ఉంది.
రాష్ట్రంలో ప్రభుత్వ శాఖ లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్శింగ్ కార్మికుల కోసం చట్టప్రకారం కనీస వేతన బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త ఆందోళన పిలుపులో భాగంగా ఆ సంఘం నాయకులు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు.
మూడు రోజుల్లో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే నగరపాలక సంస్థ కార్యాలయం ముట్టడిస్తామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్ హెచ్చరించారు. సీఐటియు ఆధ్వర్యంలో సోమవారం నగరపాలక సంస్థ ఎదుట ధర్నా నిర్వహించారు.
మండలంలోని బొమ్మే పర్తి గ్రామంలో వెలసిన జయలక్ష్మీమాత విగ్రహానికి గణపతి సచ్చి దానందస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం నుంచి బొమ్మేపర్తి ఆశ్రమంలో జయలక్ష్మీమాత జయంతి ఉత్సవాలు ప్రారంభమ య్యాయి.
ఉద్యోగభద్రత కల్పించాలని, ఎనహెచఎం ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలనే తమ పలు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న సీహెచఓ ల నిరసన జిల్లాలో కొనసాగింది. ఇప్పటికే నిరవధిక సమ్మెకొన సాగిస్తున్నా రు.
మండల కేంద్రమైన రాప్తాడు సమీపంలో ఉన్న జగనన్న కాలనీలో మినీ వాటర్ ట్యాంకులు నిరుపయో గంగా ఉన్నాయి. ట్యాంకులకు నీరు సరఫరా చేయకపోవడంతో అవి నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో రాప్తాడు సమీపంలో పండమేటి వెంకటరమణస్వామి ఆలయం సమీపంలో రాప్తా డు, ప్రసన్నాయపల్లి గ్రామ ప్రజలకు దాదాపు 500 మందికి ఇళ్ల పట్టాలు అందజేశారు.