Home » America
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ కారణంగా కెన్యా తీరంలో వేలాది లగ్జరీ కార్లు చిక్కుకున్నాయి. జపాన్ నుంచి దుబాయ్ చేరాల్సిన 4 వేల కార్లు కెన్యా పోర్టులో నిలిచిపోయాయి. ఇరాన్ హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
అమెరికాకు చెందిన అత్యాధునిక ఎఫ్-35 ఫైటర్ జెట్ ఎమర్జెన్సీ లాండింగ్ చేసింది. ఇరాన్ మిసైల్ దాడి వల్లే ఇలా జరిగి ఉండవచ్చన్న కథనాలు అంతర్జాతీయ మీడియాలో వెలువడ్డాయి.
గుడ్ న్యూస్.. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్ సరఫరాలో నెలకొన్న ఇబ్బందులు ఇక తొలగిపోనున్నాయి. అమెరికా నుండి భారీ ఎల్పీజీ కార్గో నౌక కర్ణాటకలోని మంగళూరు తీరానికి చేరుకుంది. ఇంధన భద్రత, సరఫరాలో ఇదొక కీలక పరిణామంగా నిలుస్తుంది.
హోర్ముజ్ జలసంధిని 48 గంటల్లోగా పునరుద్ధరించాలి.. లేదంటే ఇరాన్ విద్యుత్ కేంద్రాలను నేలమట్టం చేస్తాం.. అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్కు అల్టిమేటం ఇచ్చారు. అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన జలసంధిని తెరిపించేందుకు ట్రంప్ ఈ హెచ్చరిక జారీ చేశారు.
దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. తాజాగా ఇరాన్లోని నతాంజ్ అణు శుద్ధి కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడులకు పాల్పడినట్టు స్థానిక మీడియా సంస్థ తస్నిమ్ తెలిపింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత నతాంజ్ అణు క్షేత్రంపై దాడులు చేయడం ఇది రెండోసారి.
పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకూ మరింత తీవ్రమవుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ కూడా భీకరంగా ప్రతిస్పందిస్తోంది. పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై దాడులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో భారత్ కేంద్రంగా పలు అసత్య వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.
ఆ వ్యక్తి ఒకే బ్యాంక్కు చెందిన ఆరు బ్రాంచ్లలో దొంగతనానికి పాల్పడ్డాడు. వారం రోజుల వ్యవధిలోనే ఆ చోరీలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేశాడు. కొన్ని డాలర్లను తస్కరించాడు. అయితే అతడు ఎంత దోచుకున్నాడో తెలిస్తే మాత్రం నవ్వు రాక తప్పదు.
ఇరాన్పై సైనిక చర్యను క్రమంగా తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. దీనిపై తాజాగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పందించారు. కాల్పుల విరమణకు తాము అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.
ఇరాన్ దూకుడు పెంచింది. 4 వేల కిలోమీటర్ల దూరంలో యూఎస్-యూకే సైనిక స్థావరంపై దాడికి యత్నించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ జరుపుతున్న యుద్ధంలో తమకు సహకరించడం లేదంటూ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్పై ట్రంప్ విమర్శలు గుప్పించారు. అమెరికా లేకపోతే నాటో ఒక 'కాగితం పులి' అని సంచలన వ్యాఖ్యలు చేశారు.