Home » America
పశ్చిమాసియాలో యుద్ధాన్ని నిలిపివేసే విషయమై రెండ్రోజులుగా ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారంనాడు ప్రకటించడం, అలాంటిదేమీ లేదంటూ ఇరాన్ తోసిపుచ్చడంపై తాజాగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
అడల్ట్ కంటెంట్ ప్లాట్ఫామ్ ‘ఓన్లీ ఫ్యాన్స్’ యజమాని లియోనిడ్ రాడ్విన్స్కీ మృతిచెందారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన సోమవారం కన్నుమూశారు.
ఇరాన్తో రెండు రోజులుగా జరుగుతున్న చర్చలు ఫలప్రదంగా సాగుతున్నాయని, దీంతో ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలు, విద్యుత్ కేంద్రాలపై దాడులను ఐదు రోజులు వాయిదా వేయాలని తన బలగాలను ఆదేశించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై టెహ్రాన్ స్పందించింది. అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదని స్పష్టం చేసింది.
మధ్యప్రాచ్యంలో ఘర్షణలు తీవ్రమవుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ విద్యుత్ ప్లాంట్లు, మౌలిక వసతులపై 5 రోజుల పాటు దాడులు నిలిపివేయాలని తాను ఆదేశాలు జారీచేసినట్టు తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ట్రంప్.
హోర్ముజ్ జలసంధి మీదుగా సరకు రవాణా నౌకలను అనుమతించేందుకు ఒక్కో నౌకకు 2 మిలియన్ డాలర్ల చొప్పున ఇరాన్ ఛార్జీలు విధిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
అమెరికాలోని అత్యంత రద్దీగా ఉండే లాగ్వార్డియా విమానాశ్రయంలో సోమవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. కెనడాలోని మాంట్రియల్ నుంచి వచ్చిన ఎయిర్ కెనడా ఎక్స్ప్రెస్ విమానం రన్వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక ఫైర్ ఇంజిన్ను బలంగా ఢీకొట్టడంతో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
ఇరాన్ రాజధానిపై ఈ తెల్లవారుజామున ఇజ్రాయెల్ భారీ స్థాయిలో వైమానిక దాడులు చేసింది. టెర్రర్ మౌలిక సదుపాయాలు, వైమానిక రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రకటించగా, హోర్ముజ్ జలసంధి శాశ్వతంగా మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది.
ఇంధన కేంద్రాలపై దాడులు ఆపాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్తో ఆయన ఫోన్ ద్వారా కీలక చర్చలు జరిపారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి యుద్ధం కంటే చర్చలే మార్గమని స్పష్టం చేశారు.
విమానం దిగుతూ తడబడటం, మెడపై ఎర్రటి మచ్చలు వంటి పరిణామాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హోర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్కు 48 గంటల డెడ్లైన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ డెడ్లైన్పై ఇరాన్ ఆదివారం స్పందించింది. శత్రుదేశాలకు మాత్రమే హోర్ముజ్ జలసంధిని మూసి వేశామని స్పష్టం చేసింది.