Home » America
భారత రక్షణ సామర్థ్యాన్ని పెంచడానికి అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇరుదేశాల మధ్య కుదిరిన ఈ ఒప్పందంతో భారీ సామర్థ్యంతో కూడిన ఆయుధాలను భారత్కు విక్రయించనుంది అగ్రరాజ్యం. ఈ ఆయుధాలు మన దేశ రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేయడం సహా ప్రాంతీయ ముప్పులనూ ఎదుర్కొనేందుకు ఉపకరిస్తాయని అమెరికా పేర్కొంది.
వలస విధానాలు, హెచ్-1బీ వీసాల విషయంలో డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. విదేశీ ఉద్యోగులు అమెరికన్ల ఉద్యోగాలను లాక్కుంటున్నారని హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేసిన ట్రంప్ తాజాగా వెనక్కి తగ్గారు. అమెరికాకు విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని బహిరంగ వేదికపై అంగీకరించారు
ఎప్స్టీన్ ఫైల్స్ను విడుదల చేసే బిల్లుపై ట్రంప్ సంతకం చేశారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్ ద్వారా వెల్లడించిన ట్రంప్.. ఈ సందర్భంగా డెమొక్రాట్లపై పలు ఆరోపణలు చేశారు. జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం గతంలో అగ్రరాజ్యం అమెరికాను కుదిపేసిన సంగతి తెలిసిందే.
అమెరికాలోని న్యూజెర్సీలో 2017 మార్చిలో జరిగిన జంటహత్యల కేసు చిక్కుముడి ఎట్టకేలకు వీడింది. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. హత్యలు జరిగిన తర్వాత.. భారత్కు తిరిగి వెళ్లిపోయిన ఓ యువకుడే ఈ హత్యలకు పాల్పడినట్టు నిర్ధారణ అయింది.
న్యూయార్క్ మేయర్గా ఎన్నికైన మమ్దానీపై డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ మరోసారి విమర్శలు గుప్పించారు. మమ్దానీకి భారతీయులు నచ్చరని సంచలన కామెంట్ చేశారు. వాపపక్షవాద భావజాల వ్యాప్తిని సంప్రదాయవాదులు అడ్డుకోవాలని గతంలో కూడా ఎరిక్ ట్రంప్ పిలుపు నిచ్చారు.
తాను గవర్నర్ బాధ్యతలు చేపట్టిన తొలి రోజు సాయంత్రానికల్లా ఫ్లోరిడా ప్రభుత్వ శాఖల్లో పని చేస్తు్న్న హెచ్-1బీ వీసాదారులందరినీ తొలగిస్తానని అమెరికన్ ఇన్వెస్టర్ జేమ్స్ ఫిష్బర్న్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట సంచలనంగా మారింది.
పురుగు కుట్టడం ద్వారా పాడైన రెడ్ మీట్ బర్గర్ తిన్న ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆల్ఫా గాల్ సిండ్రోమ్ వచ్చి చనిపోయాడు. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వర్జీనియాలోని ‘యూవీఏ హెల్త్’కు చెందిన పరిశోధకుల బృందం సదరు వ్యక్తి మరణంపై పరిశోధనలు చేసింది. ఓ నివేదికను వెలువరించింది.
అమెరికా నిషేధిత జాబితాలోని 12 దేశాల జనాలపై మరిన్ని ఆంక్షలకు ట్రంప్ సర్కారు సిద్ధమవుతోంది. నిషేధానికి ముందే అమెరికాకు వచ్చిన ఆయా దేశాల వారికి గ్రీన్ కార్డులు, ఇతర వీసాల జారీ మరింత కష్టతరంగా మార్చేలా కొత్త విధానంపై కసరత్తు చేస్తోంది.
ప్రాణ భయంతో ఓ సీలు పడవ ఎక్కేసింది. కిల్లర్ వేల్స్ గుంపు నుంచి తప్పించుకోవడానికి ఆ సీలు ఈ పని చేసింది. వేల్స్ అక్కడినుంచి వెళ్లిపోయే వరకు ఆ సీలు బోటు మీదే ఉండిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పురాణ ఇతిహాసాల ఆధారంగా రూపొందించిన తానా విశ్వగురుకులం అనే ప్రత్యేక బోధనా పద్దతిని ప్రపంచంలో, మరీ ముఖ్యంగా ఉత్తర అమెరికాలో తెలుగు వారికి పరిచయం చెయ్యడానికి డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి...