Home » America
ట్రంప్ ఇప్పటికే భారత్నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న చాలా వస్తువులపై 50 శాతం టారిఫ్లు విధించారు. భారత వ్యాపారాన్ని దెబ్బ తీసేలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. మరోసారి భారత్, రష్యా వాణిజ్య ఒప్పందాలపై ఆయన ఫైర్ అయ్యారు.
అర్ధరాత్రి మిలిటరీ ఆపరేషన్తో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అపహరించిన అమెరికా.. ఆయనను కరుడుగట్టిన నేరస్థుడి మాదిరిగా చేతులకు బేడీలు వేసి జైలుకు తరలించింది.
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో భార్య సిలియా ఫ్లోరెస్ పై అమెరికా (యూఎస్) ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను సులభతరం చేయడానికి, దేశపు యాంటీ-డ్రగ్ కార్యాలయాన్ని మార్చడానికి పెద్దఎత్తున లంచం తీసుకున్నట్లు అమెరికా కేసులు పెట్టింది.
మదురో 12 ఏళ్ల పాలనకు తెరదించుతూ వెనుజువెలాపై అమెరికా ఆపరేషన్ జరిపింది. మదురో సమాచారం చెప్పన వారికి 50 మిలియన్ డాలర్లను బహుమతిని కూడా గతంలో ప్రకటించింది. దాడుల అనంతరం మదురో చేతులకు బేడీలు వేసి, కళ్లకు గంతలు తగిలించి కరేబియన్లో అమెరికా నేవీ షిప్ను ఎక్కిస్తున్న ఫోటోను ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్ట్ చేశారు.
అమెరికా బలగాలు వెనెజువెలాపై శనివారంనాడు దాడులతో విరుచుకుపడింది. ఆ దేశం అధ్యక్షుడు నికోలాస్ మదురో, ఆయన భార్యను యూఎస్ డెల్టా ఫోర్స్ అదుపులోనికి తీసుకుని న్యూయార్క్ తరలించింది. అక్కడి కోర్టులో వీరు విచారణను ఎదుర్కోనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
దారుణమైన నేరానికి పాల్పడి 24 ఏళ్ల జైలు శిక్షకు గురైన ఓ యువకుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. అతడికి విధించిన శిక్షను తగ్గించాలని నెటిజన్లు డిమాండ్లు చేస్తున్నారు. ఎందుకంటే ఆ యువకుడు అందంగా, అమాయకంగా ఉండడమే.
వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భారయ సిలియా ఫ్లోర్స్ అమెరికా భద్రతా దళాల అదుపులో ఉన్నారు. మదురోకి సంబంధించి వీడియోను యూఎస్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఓ వీడియోను విడుదల చేశాయి.
వెనెజువెలా దేశంపై అమెరికా వైమానిక దాడులు చేయడంపై మిశ్రమ స్పందన వస్తోంది. ఈ దాడులను మెజారిటీ దేశాలు ఖండించగా.. అర్జెంటీనా మాత్రం ప్రశంసించింది. ఇక.. స్పెయిన్ ఇరుదేశాలకు మధ్యవర్తిత్వం వహిస్తామని పేర్కొంది.
దక్షిణ అమెరికా దేశమైన వెనెజువెలాలో శనివారం భారీ పేలుళ్లు సంభవించాయి. ఇటీవల అమెరికా, వెనుజువెలా దేశాల మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్న వేళ.. ఈ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది.
వారం వారం ఏ మేరకు రష్యా, యూఎస్ నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్నారో చెప్పాలని కేంద్రం రిఫైనరీలను కోరినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం త్వరలో కుదరనుందన్న వార్తల నడుమ ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది.