Home » America
ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులతో సతమతమవుతున్న ఇరాన్ వాసులను మరోవైపు యాసిడ్ వర్షం ఆందోళనకు గురి చేస్తోంది. ఇరాన్లోని పలు ప్రాంతాల్లో నల్లటి ఆమ్ల వర్షం కురిసినట్టు స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం రోజురోజుకు ముదురుతుంది. ఈ దేశాల మధ్య ఘర్షణ కారణంగా గల్ఫ్ ప్రాంతాలు విలవిల్లాడుతున్నాయి. తాజాగా దుబాయ్, కువైట్ ఎయిర్ పోర్టులపై ఇరాన్ డ్రోన్లతో దాడులు చేసింది.
ఇజ్రాయెల్, అమెరికాలపై ఇరాన్ ఘాటు విమర్శలు చేసింది. అమెరికా, ఇజ్రాయెల్లు తమ షాహెద్-136 మోడల్ డ్రోన్లను రూపొందించి పలు దేశాలపై దాడులకు పాల్పడుతూ.. ఆ నిందను తమపై మోపుతున్నాయని ఇరాన్ మండిపడింది.
ఇజ్రాయెల్ ప్రధాని గురించి సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న పుకార్లకు ఫుల్స్టాప్ పడింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మరణవార్త కేవలం ఒక పుకారు మాత్రమేనని పేర్కొంది. ఇవి.. దేశంలో అలజడి సృష్టించేందుకు శత్రువుల తప్పుడు ప్రచారమని వ్యాఖ్యానించింది.
ఇరాన్ , అమెరికా- ఇజ్రాయెల్ల పరస్పర దాడులతో పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.
హోర్ముజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో ఇరాన్ తీరంపై బాంబుల వర్షం కురిపిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. జలసంధిని తెరిచి ఉంచేందుకు అమెరికాతో పాటు ఇతర దేశాలు కూడా యుద్ధ నౌకలను మోహరించే అవకాశముందని తెలిపారు.
అమెరికాలో భారత సంతతికి చెందిన వారి బంగారం దుకాణంపై ఓ సాయుధ ముఠా మెరుపు దాడి చేసింది. సినిమా ఫక్కీలో కేవలం 70 సెకన్ల వ్యవధిలోనే దుండగులు సుమారు రూ.16 కోట్లు విలువైన బంగారం, వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారు.
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది. ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ క్షిపణి దాడి జరిపింది. శనివారం ఉదయం భారీ పేలుడు అనంతర అమెరికా ఎంబసీ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నట్టు అధికారులు తెలిపారు.
ఇరాన్ చేసిన దాడిలో అమెరికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు వార్తలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన ఐదు రీ ఫ్యూయలింగ్ విమానాలు ఇరాన్ దాడిలో ధ్వంసమైనట్టు వాల్స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఇటీవల సౌదీ అరేబియాలోని అమెరికా వైమానిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసిన సంగతి తెలిసిందే.
ఇమిగ్రేషన్ ప్రయోజనాలను పొందడం కోసం ప్రణాళికాబద్ధంగా కుట్ర పన్నారనే ఆరోపణలపై అమెరికాలో 11 మంది భారతీయ పౌరులను అరెస్టు చేశారు. వారు వీసా మోసానికి కుట్ర పన్నారనే అభియోగం మోపారు.