Home » Amaravati
ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునే వారు తమ ఉన్నత విద్య కలను సాకారం చేసుకునే అవకాశం లభించింది.
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు.
‘మెగా డీఎస్సీ’పై వైసీపీ కసి కొనసాగుతూనే ఉంది. డీఎస్సీ-2025లో జరిగిన టీచర్ల నియామకాలన్నీ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో మరోసారి ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది.
చదువులో ప్రతిభ... సీఎం ప్రశంసలు... ముందు కనిపిస్తున్న ఉజ్వల భవిష్యత్తు! అయితే ఇంతలోనే ముర్రం శివాని ఎందుకు బలవన్మరణానికి పాల్పడింది? ఆ బాలిక ఆత్మహత్య వెనుక అసలు కారణమేంటి? ఇప్పుడు ఇదే ప్రశ్నకు సమాధానం కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఆ రైతు పొలంలో ఎర్ర బంగారం పండింది. ధర కూడా నషాళాన్ని అంటేలా ఉంది. ఎగుమతిదారులు ఆ టాప్ క్వాలిటీ మిర్చికి క్వింటాకు రూ.32 వేలు ఇస్తామని ముందుకొచ్చారు. అయితే ఇంకా ఎక్కువ ధర వస్తుందన్న ధీమాతో ఆ రైతు విక్రయించడానికి అంగీకరించలేదు.
వాయవ్య బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం మంగళవారం ఉదయం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య డిఘా వద్ద తీరం దాటింది.
కృష్ణమ్మ శ్రీశైలం వైపు అడుగులు వేస్తోంది. జూరాల ప్రాజెక్టు ఎగువన కర్ణాటకలోని ఆలమట్ట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండుకుండలా కళకళలాడుతున్నాయి.
‘‘ఎల్నినో ఉపద్రవాన్ని అధికార యంత్రాంగం ఓ సవాల్గా తీసుకుని పని చేయాలి. ఈ కష్టకాలంలో రైతులను ఆదుకోవాలి. అన్నదాతలకు సరైన సమాచారాన్ని, సహకారాన్ని అందిస్తూ అండగా నిలవాలి. తీవ్ర ప్రభావిత మండలాల్లో బోర్లు ఆధారంగా పంటలను కాపాడుకునే అంశాన్ని పరిశీలించాలి.’’ అని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
టమోటా రైతులకు ఈసారి ఆదిలోనే హంసపాదు అన్న పరిస్థితి ఎదురవుతోంది. ఎన్నో ఆశలతో సాగు చేసిన పంట చేతికొచ్చిన సమయంలో ధరల పతనం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
ఒకాయన టీడీపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు. మరొకాయన వైసీపీ నేత. టీటీడీ బోర్డు సభ్యుడి కుమారుడితోనూ, ఆయన పీఏతోనూ వైసీపీ నేత కుమారుడు సన్నిహితంగా ఉంటారు.