Home » Amaravati
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2026 బడ్జెట్లో పెద్దపీట వేసింది. మౌలిక సదుపాయాలు, గ్రామీణ అభివృద్ధి, విద్యారంగాలకు సంబంధించి స్పష్టమైన నిధుల కేటాయింపులు జరిగాయి.
బిట్స్ పిలానీ తన ఏపీ రాజధాని అమరావతి క్యాంపస్ నిర్మాణ కార్యకలాపాలను ప్రారంభించడానికి పూర్తి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం బిట్స్ పిలానీ సంస్థ 70.011 ఎకరాల్లో తన క్యాంపస్ను ఏర్పాటు చేయనుంది. ప్రజా రాజధాని అమరావతిలో ఈ క్యాంపస్ నిర్మాణం అభివృద్ధికి కీలకమైన ముందడుగు అని భావిస్తున్నారు..
ఏప్రిల్ 1వ తేదీ నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హ్యాండ్లూమ్ మగ్గానికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందించనుంది. అలాగే మర మగ్గానికి 500 యూనిట్ల ఉచిత కరెంట్ అందించనుంది.
సోషల్ మీడియా జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడంపై బుధవారం సచివాలయంలో మంత్రి లోకేష్ అధ్యక్షతన మంత్రుల బృందం సమావేశం అయింది. నిర్ణీత వయసు కలిగిన మైనర్లను సోషల్ మీడియాకు దూరంగా ఉంచే విషయమై విధివిధానాలను రూపొందించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమావేశం సందర్భంగా అధికారులను ఆదేశించారు.
ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. 35 ఎజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పీపీపీ పద్దతిలో పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ అభివృద్ధికి కేబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
ఏపీ రాజధాని అమరావతి రైతులకు ఈనెల 29న మలివిడత ప్లాట్ల కేటాయింపు జరగనుంది. సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం భూములిచ్చిన రైతులకు ఈ-లాటరీ ద్వారా ప్లాట్లను కేటాయించనున్నారు.
యువగళం పాదయాత్ర మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర మంత్రి నారా లోకేశ్కు పార్టీ శ్రేణులు పెద్దఎత్తున అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ భవన్లో లోకేశ్తో కేక్ కట్ చేయించి సంబరాలు చేసుకున్నారు.
అనంతపురం జిల్లా గుంతకల్లు-వాడి, గుంతకల్లు-బళ్లారి డబ్లింగ్ సెక్షన్లను నాలుగు లైన్లుగా మార్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు రైల్వేశాఖ అన్ని ప్రణాళికలు రూపొందిస్తోంది. అయితే.. ఇదేగాని జరిగితే ఇక ప్రయాణం సులువుగా మారే అవకాశం ఉంది.
గన్నవరం ఎయిర్పోర్టులో మనసును హత్తుకునే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ మహిళ కష్టం తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చలించిపోయారు. ఆమె సమస్యను పరిష్కరించాలంటూ వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కలల రాజధాని అమరావతిలో తొలిసారిగా నిర్వహించిన గణతంత్ర వేడుకలు అత్యంత అద్భుతంగా జరిగాయని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు.