Home » Amaravati
ఏపీలో మరోసారి అధికారంలోకి వస్తే ఏం చేస్తామో క్లారిటీ ఇస్తూ వైసీపీ 2024 ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. మా నమ్మకం నువ్వే జగన్ పేరిట విడుదల చేసిన మేనిఫెస్టోలో గతంలో ఇచ్చిన హామీలనే మరోసారి పేర్కొంటూ.. పెన్షన్ను 2028లో రూ.250, 2029లో మరో రూ.250 చొప్పున ఐదో ఏడాదికి రూ.3,500కు పెంచుతామని హామీ ఇచ్చారు. పాత హామీలకే రంగులద్ది కొత్త మేనిఫెస్టోలో చేర్చారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటిలిజెన్స్ చీఫ్ (నిఘా విభాగాధిపతి)గా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు బుదవారం అర్థరాత్రి రాష్ట్ర సీఎస్ కె ఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
Andhrapradesh: ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు కేసు ఈనెల 29 కు వాయిదా పడింది. తనపై రెండవ సారి సస్పెన్షన్ విధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ను (CAT) వెంకటేశ్వరరావు ఆశ్రయించారు. దీనిపై ఈరోజు (మంగళవారం) విచారణకు రాగా... ఒకే ఆరోపణలపై రెండవ సారి ఎలా సస్పెండ్ చేస్తారని ప్రభుత్వ న్యాయవాదిని బెంచ్ ప్రశ్నించింది.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సీఎం జగన్ రాష్ట్రానికి చేసిందేముందని, చెప్పుకోడానికి కూడా ఏమీ లేదని.. ఆయన జిల్లాల పర్యటనకు ఎందుకు తిరుగుతున్నారన్న ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతోందన్నారు.
అమరావతి: కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం డీఎస్సీపైనే చేస్తానని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఓ ఆడబిడ్డ జగ్గంపేటలో తనను కలిసినప్పుడు పెన్ ఇచ్చిందని, ఆ పెన్నుతో సీఎం అయ్యాక డీఎస్సీపై తొలి సంతకం చేయాలని కోరిందని చంద్రబాబు తెలిపారు.
అమరావతి: ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చేశాం. ‘నాడు - నేడు’తో అన్ని పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దాం..8వ తరగతి పిల్లలకు ప్రతి ఏడాది ట్యాబ్లు ఉచితంగా పంపిణి చేస్తున్నాం.. ఇవన్నీ చూస్తే త్వరలో కార్పొరేట్ పాఠశాలలే ప్రభుత్వ బడులతో పోటీ పడాల్సిన పరిస్థితి వస్తుందని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు..
అమరావతి: జగనన్న కాలనీలకు భూ సేకరణ గతంలో వైసీపీ నేతలు బాగా సొమ్ము చేసుకున్నారు. తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అంటగట్టారు. జగన్ సర్కార్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి మరీ ఇప్పుడు వారికి బిల్లులు చెల్లిస్తోంది.
అమరావతి: తెలుగుదేశం పార్టీ ఐదు స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. స్థానికంగా ఉన్న పరిస్థితులు.. ఇప్పటికే ఇచ్చిన అభ్యర్థులు ప్రచారంలో వేగం లేకపోవడం వంటి అంశాలతో మార్పులు, చేర్పులు చేయాలని నిర్ణయించింది.
అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల పర్వం ప్రారంభం కానుండటంతో ఆదివారం ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో తెలుగు దేశం పార్టీ నుంచి పోటీ చేసే అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులకు చంద్రబాబు బీ.ఫామ్స్ ఇస్తున్నారు.
మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా నవనీత్ రాణా బరిలో దిగారు. అయితే ఆమెపై శివసేన-యుబీటీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ డ్యాన్సర్ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రౌత్ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘాన్ని బీజేపీ అశ్రయించింది. రౌత్పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ విజ్జప్తి చేసింది.