Home » Amaravati
అమరావతి అభివృద్ధి, విస్తరణ కోసం భూములు ఇచ్చేందుకు వడ్డమాను రైతులు అంగీకారం తెలిపారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్కు గ్రామ రైతులు మద్దతుగా నిలిచారు.
రాజధానిలో మంత్రి నారాయణ పర్యటించారు. అక్కడి పనులను పరిశీలించారు. 11, 8 జోన్లలో పనులు తొందరలోనే ప్రారంభించినున్నట్లు మంత్రి తెలిపారు.
ఈతకు వెళ్లి ఓ యువకుడు మృతిచెందిన విషాద సంఘటన తిరుపతి జిల్లా వాకాడు మండలంలో చోటుచేసుకుంది. ఈశ్వరయ్య అనే యుకుడు మహాలక్ష్మమ్మ దేవాలయం పక్కన ఉన్న గుంటలో ఈత కొట్టేందుకు దిగాడు. అక్కడే నీటిలో మునిగి మృతిచెందాడు. దీంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది.
తిరుపతిలో ఫుడ్ కోర్ట్కు ఏర్పాటుకు మార్గం సుగుమం అయింది. మొత్తం ఈ ఫుడ్ కోర్ట్లో 40 నుంచి 50 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. దీన్ని వీలైనంత తొందరగా నిర్మింపజేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పట్లు చేస్తున్నారు. నిత్యం వేల సంఖ్యలో భక్తలు తిరుపతికి విచ్చేస్తుంటారు.
సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమపాళ్లలో చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 18 నెలలుగా ప్రతి గంట, ప్రతి క్షణం కష్టపడ్డామన్నారు. 93 స్కీంలను మరలా రివైవ్ చేసినట్లు తెలిపారు.
అక్కడ పంప్ తిప్పితే చాలు... ద్రవ జీవామృతం వస్తుంది. అవసరం ఉన్నవారు ఎప్పుడంటే అప్పుడు పట్టుకొని మొక్కలకు వేసుకుంటారు. ఈ జీవ ఎరువులను రైతులే స్వయంగా తయారు చేస్తారు. అందుకే ఆ గ్రామం ప్రకృతి సేద్యంతో పచ్చగా మారింది!
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిశారు.
విశాఖపట్టణంలోగల ఏసీఏ వీడీసీఏ స్టేడియం... భారత్కు విజయాల వేదికగా మారుతోంది. ఈ స్టేడియంలో మ్యాచ్ జరిగితే.. ఇక విజయం భారత్దేనని క్రికెట్ అభిమానులు అంటుంటారు. మొత్తం పది అంతర్జాతీయ వన్డే మ్యాచ్లు జరిగితే అందులో ఏడు భారత్ గెలవడం విశేషం.
పులివెందుల పట్టణానికి.. నాడు సాగునీరు.. నేడు తాగునీరు.. ఆ ఘనత చంద్రబాబునాయుడిదేనని పలువురు పేర్కొంటున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోనే పులివెందుల బీడు భూముల్లో క్రిష్ణమ్మ జలాలు సవ్వడి చేస్త్తుంటే.. ఇప్పుడు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందనుంది.
కిడ్నీ రాకెట్ కేసులో.. గ్లోబల్ ఆసుపత్రిని పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రితోని ఆపరేషన్ థియేటర్, ఆపరేషన్కు ఉపయోగించిన పరికరాలు, మందులను స్వాధీనం చేసుకున్నారు. కిడ్నీ రాకెట్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పెద్దలు కూడా దీనిపై సీరియస్ అయినట్లు సమాచారం.