Home » Amaravati
శ్రీహరి, గిరీశ్ల పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఇద్దరి అభ్యర్థనలను కోర్టు తిరస్కరించింది. అరెస్టు చేస్తారనేందుకు ఆధారాలు ఉన్నాయా అని హైకోర్టు ప్రశ్నించింది.
అనంతపురం జిల్లాలోని కక్కలపల్లి టమోటా మార్కెట్లో కిలో టమోటా గరిష్ఠంగా రూ.20తో అమ్ముడుపోయినట్లు రాప్తాడు మార్కెట్ యార్డు ఇన్చార్జ్ కార్యదర్శి రూప్కుమార్ తెలిపారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ 22 నెలల్లోనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు.
అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నుంచి మామిడి ఎగుమతులు పదిరోజుల క్రితం ప్రారంభమయ్యాయి.
అమరావతి శంకుస్థాపన స్థలం ఉద్దండరాయునిపాలెంలో సీఎం చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేదం, రుద్రం పఠనాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. 76 కదంబ మొక్కలను నాటారు.
అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ వ్యాధితో బాధపడుతున్న కర్నూలుకు చెందిన పునర్విక అనే చిన్నారికి రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ను మంత్రి నారా లోకేశ్ సమకూర్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ప్రేరణ పొందిన ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్రపంచంలోని ఐదు రాజధానుల్లో ఒకటిగా అమరావతిని నిర్మించాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యమని ఏపీ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. జగన్ హయాంలో రైతులను అనేక ఇబ్బందులు పెట్టారని ధ్వజమెత్తారు.
పరిటాల రవీంద్ర వంటి నాయకుడిని ఎప్పటికీ మరువలేమని సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతతో ప్రస్తావించారు.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేశ్ ఉండవల్లిలోని నివాసంలో గురువారం సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పనులను ఎస్ఎమ్సీలకు అప్పగించాలని అధికారులను ఆదేశించారు.