Home » Amaravati
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవడమే వైసీపీ అధ్యక్షుడు జగన్ పనిగా పెట్టుకున్నారు. అమవావతిపై అక్కసు, అడ్డగోలు వ్యవహారాలు, అడ్డదిడ్డమైన మాటలతో గత ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీని అధికారానికి దూరం చేసినా బుద్ధి తెచ్చుకోలేదు. అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నారు..
అమరావతిని రాజధానిగా అందరూ అంగీకరించారు. ఇప్పుడు మళ్లీ వివాదం చేయడం సరికాదని సీపీఎం నేత బీవీ రాఘవులు అన్నారు. జగన్ మొదట్లో అమరావతిని రాజధానిగా అంగీకరించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. జగన్ ఇకనైనా తన తీరు మార్చుకోవాలని రాఘవులు సూచించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిపై జగన్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అమరావతి నిర్మాణంపై జగన్.. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒకలా, అధికారంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు..
సావరపాలెం గ్రామ పెద్దలు సబ్ జూనియర్స్కు 70 కిలోల బరువు, సీనియర్స్కు 120 కిలోల బరువుతో కూడిన ‘గుండు రాయి’ పోటీలు జరుపుతారు. పోటీలకు నిర్ణీత సమయం ఐదు నిమిషాలు కాగా, ఆ సమయంలో పోటీదారులు గుండు రాయిని పైకి ఎత్తి భుజం పైనుంచి వెనక్కు పడేయాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి చెందకూడదనేది జగన్ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశమని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులు, నిధులు రాష్ట్రానికి రాకూడదన్నదే ఆయన లక్ష్యంగా తెలుస్తోందని విమర్శించారు..
భూమాత పరిచిన పచ్చని తివాచీల్లాంటి వరిచేలు... అందమైన కొబ్బరిచెట్ల నడుమ... నేలకు దిగి వచ్చిన ఇంద్రధనస్సులా సాగుతుంది కోనసీమ ‘ప్రభల తీర్థం’. అదొక దృశ్య కావ్యం లాంటిది.
అమరావతిని ప్రపంచం మెచ్చే 'ప్రజా రాజధాని'గా తిరిగి అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. రెండేళ్లలో అమరావతి రూపుదిద్దుకుని విజయవాడ–గుంటూరు–మంగళగిరితో కలిసి గ్లోబల్ సిటీగా, 2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని చేరుకుంటుందని అన్నారు.
వైద్యులు బిజీగా ఉన్నప్పటికీ, కనీసం నెలలో ఒక రోజైనా గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవలు, అవగాహన శిబిరాలు నిర్వహించాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. అమరావతిలో నిర్మాణాల పేరుతో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు..
రాష్ట్రమంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అపరభగీరథుడు సీఎం చంద్రబాబునాయుడు.. అతిపెద్ద దొంగ జగన్ అని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలపై వైసీసీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఆమె ఏమన్నారంటే..