Home » Amaravati
మున్సిపల్ ఛైర్మన్గా ఉండి కూడా తలారి రాజ్కుమార్ ప్రజాసమస్యలను నిర్లక్ష్యం చేశారని, దాని ఫలితంగానే పదవి పోయిందని, ఇందులో రాజకీయాలు ఏమీ లేవని.. టీడీపీ పట్టణ అధ్యక్షుడు సర్మస్వలీ స్పష్టం చేశారు.
ప్రతి నెలా కొందరు డీలర్లు బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నారు. గుంతకల్లు పట్టణంలో 70, మండలంలో 39 రేషన్ షాపులు ఉన్నాయి. దాదాపు 42 వేల కార్డులు ఉన్నాయి. పలు రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు సుమారు ఒకటిన్నర కిలోల బరువున్న డబ్బాను ఉంచి.. తూకం వేసి లబ్ధిదారులకు వేస్తున్నారు. 20 కేజీల బియ్యాన్ని ఒకసారి ఇలా తూకం వేసి ఇస్తారు.
సోషల్ మీడియా వేదికపై వలపు వలలో పడి యువకులు, పెళ్లైనవారు విలవిలలాడుతున్నారు. స్నేహం, జోడీ పేరిట కనిపించే వెబ్సైట్ లింకులను క్లిక్ చేసి.. బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసుకుంటున్నారు. ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్.. ఇలా ఏదో ఒక మార్గంలో అమ్మాయిల గొంతుతో కేటుగాళ్లు వాయిస్ కాల్స్ చేసి బురిడీ కొట్టిస్తున్నారు.
శ్రీకాళహస్తీశ్వరస్వామికి శుక్రవారం హైదరాబాద్కు చెందిన ఇందిర రూ.9.32లక్షల విలువైన 96గ్రాముల బంగారు కాసుల దండ, 650గ్రాముల వెండి బిందెను వితరణ చేశారు. వీటిని ఈవో బాపిరెడ్డి స్వీకరించి దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీనివాసమంగాపురం నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లే శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత సంచారంతో కలకలం రేగింది. శుక్రవారం ఉదయం 150వ మెట్టు వద్ద అటవీ ప్రాంతంలోకి చిరుత దాటుతుండగా భక్తులు చూసి భయాందోళనకు గురై కేకలు వేయడంతో పారిపోయింది.
వెంగమాంబ అన్నప్రసాద ట్రస్టుకు భక్తుల నుంచి ఆరు నెలల కాలంలో రూ. 180 కోట్లు విరాళంగా అందాయి. అంటే సగటున రోజుకు కోటి రూపాయలు ఈ ఒక్క ట్రస్టుకే భక్తులు సమర్పిస్తున్నారు. శ్రీనివాసుడి సమక్షంలో అన్నదానం అన్నది గొప్ప పుణ్యకార్యక్రమం కావడంతో విశేషంగా స్పందిస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ ‘అఖండ2’ సినిమాకు సంబంధించి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కొంతమేరకు పూర్తయిందని డ్రమ్స్ కళాకారుడు శివమణి తెలిపారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఎస్వీయూలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రత్యేక ఫీజుతో అడ్మిషన్లకు అనుమతించారు. ఈమేరకు ఎంటెక్, ఎంఫార్మసీ, బీఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు అవకాశమేర్పడింది. అర్హత,ఆసక్తి ఉన్న విద్యార్థులు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్ కార్యాలయంలో సంప్రదించాలని వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ భూపతి నాయుడు ప్రకటనలో తెలిపారు.
తిరుచానూరు.. తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్ మధ్య తరచూ ఎక్కడో ఒక చోట రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎక్స్ప్రెస్ రైళ్లలో కిక్కిరిసిన ప్రయాణికుల్లో ఉంటున్న జనరల్ బోగీల్లో ఫుట్పాత్పై ప్రమాదకర పరిస్థితుల్లో కూర్చున్న వారిలో పలువురు ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందుతున్నారు.
మొంథా తుఫాన్ ప్రభావంతో సోమవారం తిరుమలలో వేకువజాము నుంచే ముసురు వాతావరణం కనిపించింది. చిరుజల్లులే కావడంతో భక్తులకు పెద్దగా అసౌకర్యం కలుగలేదు. ఉండిఉండీ దట్టమైన పొగమంచు తిరుమలను కప్పేస్తోంది.