Home » Akhilesh Yadav
పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలో రాజకీయ పునరేకీకరణలు, ఫిరాయింపులు పర్యంపై చర్చ జరుగుతున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ మంత్రి, సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ చీఫ్ ఓం ప్రకాష్ రాజ్భర్ బాంబు పేల్చారు. యూపీలోని సమాజ్వాదీ పార్టీ త్వరలో చీలిపోనుందని చెప్పారు.
తన కుమార్తె అదితి యాదవ్ను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద ఆన్లైన్ ప్రచారం జరుగుతుండటం, అభ్యంతకర సోషల్ మీడియా పోస్టులు రావడంపై సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ భార్య, పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ మండిపడ్డారు. ప్రజా సమస్యల నుంచి దారిమళ్లించేందుకు బీజేపీ మద్దతుదారులే ఈ ప్రచారం సాగిస్తున్నారని విమర్శించారు.
సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కుమార్తె అదితి యాదవ్పై కొందరు తప్పుడు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేయడంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర అభ్యంతర వ్యక్తం చేశారు. సమాజంలో ఎవరి ఆడపిల్లపైనా ఒకటేనని, వారిని ఇలాంటి నీచమైన ప్రజా చర్చల్లోకి లాగకూడదని అన్నారు.
సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఇటీవల విదేశీ పర్యటన ముగించుకుని భారత్కు వచ్చినప్పుడు న్యూఢిల్లీ విమానాశ్రయంలో కొత్త లుక్లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు.
ఉత్తరప్రదేశ్లో 'ఇండియా' బ్లాక్ యథాతథంగా ఉంటుందని, కాంగ్రెస్తో తమ పొత్తు కొనసాగుతుందని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ధ్రువీకరించారు. అయితే సీట్ల షేరింగ్ విషయంలో కాంగ్రెస్కు గెలిచే సీట్లే ఇస్తామనే సంకేతాలను ఆ పార్టీ పంపింది.
బెంగాల్లో అఖండ విజయం అనంతరం సీఎం రేసులో ముందు వరుసలో ఉన్న సువేందు అధికారి స్పందించారు. ఆప్లాగే టీఎంసీ అవినీతిమయమైందని, ఆ పార్టీ పతనం ఖరారైందని ఆయన విమర్శించారు.
కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టిన మూడు బిల్లులను వ్యతిరేకిస్తున్నట్లు యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తెలిపారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలపై ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. వారి మోసాన్ని యూపీలో సాగనివ్వమంటూ బీజేపీపై ఫైర్ అయ్యారు.
దీపోత్సవ్ సెలబ్రేషన్స్ కోసం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చేస్తున్న ఖర్చును అఖిలేష్ యాదవ్ నిలదీశారు. దీపావళి పండుగను క్రిస్మస్ పండుగతో పోల్చి వాళ్ల నుంచి నేర్చుకోవాలని సలహా కూడా ఇచ్చారు.
రాంపూర్ ఎన్నికల్లో ఏమి జరిగిందో అందరికీ తెలుసునని, తప్పుడు విధానాలు, ఓట్ ఫ్రాడ్తో రాంపూర్ ఎన్నికలను కైవసం చేసుకున్నారని అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. మిరాపూర్ ఎన్నికల్లోనూ అదే జరిగిందని ఆయన ఆరోపించారు.