Home » Airport
ముంబై ఎయిర్పోర్ట్లో 29 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. దీని విలువ సుమారు రూ.38 కోట్లు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. కెన్యాలోని నైరోబీ నుంచి ఈ బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
తెలంగాణ ప్రజలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో రెండు నూతన విమానాశ్రయాలు నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎయిర్పోర్టులు నిర్మించనున్నట్లు తెలిపారు.
ఉడాన్ పథకం ద్వారా ఏపీలోని కడప, కర్నూలు ఎయిర్పోర్టుల నుంచి ఢిల్లీకి విమాన సర్వీసులను నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు.
ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతానికి రేపటి నుంచి రెండో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుందని కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రతిష్ఠాత్మకమైన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించనున్నారని ఆయన వెల్లడించారు.
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా అధికారులు ఒక పెను ప్రమాదాన్ని అడ్డుకున్నారు. శంషాబాద్ నుంచి కేరళం వెళ్లేందుకు సిద్ధమైన ఒక ప్రయాణికుడి బ్యాగేజీలో బుల్లెట్లు బయటపడటంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
అమెరికాలోని అత్యంత రద్దీగా ఉండే లాగ్వార్డియా విమానాశ్రయంలో సోమవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. కెనడాలోని మాంట్రియల్ నుంచి వచ్చిన ఎయిర్ కెనడా ఎక్స్ప్రెస్ విమానం రన్వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక ఫైర్ ఇంజిన్ను బలంగా ఢీకొట్టడంతో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వివిధ దేశాలకు వెళ్లాల్సిన పలు అంతర్జాతీయ విమానాలు రద్దు అయ్యాయి. మిడిల్ ఈస్ట్లో కొనసాగుతున్న ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధ పరిస్థితుల కారణంగా విమానాలు రద్దు అయ్యాయని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.
వేసవికాలం గ్రేటర్ ప్రయాణికులకు 20-30 శాతం రాయుతీతో ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు సేవలు అందించనుంది. ఈ మేరకు గ్రేటర్ ఆర్టీసీ చర్యలు చేపట్టింది.
పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో విమాన సర్వీసులకు వరుసగా మూడో రోజు కూడా అంతరాయం ఏర్పడింది.
పశ్చిమాసియాలో ఘర్షణల వల్ల తలెత్తిన పరిణామాల వల్ల గల్ఫ్కు వెళ్లాల్సిన అనేక విమానాలను విమానయాన సంస్థలు రద్దు చేయడంతో వందలాది మంది ప్రయాణికులు ముంబై విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. వివరాల్లోకి వెళితే..