Home » Accident
నర్మదా నదిలో బోటు మునిగిపోతున్న సమయంలో ప్రాణభయంతో తల్లీకొడుకులు ఒకరినొకరు గట్టిగా పట్టుకుని నీటిలో మునిగిపోయారు. గాలింపు చర్యల తర్వాత లభ్యమైన వారి మృతదేహాలు అదే స్థితిలో (ఒకరినొకరు హత్తుకుని) ఉండటం చూసి సహాయక సిబ్బంది కూడా కన్నీరు పెట్టారు.
పాఠశాలలకు సెలవులు రావడంతో మేనల్లుడిని సరదాగా కారులో తిప్పడానికి వెళ్లి, తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు.
ఆఫ్రికా దేశమైన దక్షిణ సూడాన్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని జుబా సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 14 మంది దుర్మరణం పాలయ్యారు.
విశాఖపట్నం గాజువాకలో ఘోర ప్రమాదం జరిగింది. తుంగ్లం దగ్గర రైల్వే బ్రిడ్జ్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి.
అనకాపల్లిలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఓ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కూలడంతో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు.
తమిళనాడులోని విరుదునగర్ జిల్లా శివకాశిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు దుర్మరణంపాలయ్యారు.
ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. ఇప్పటికే అత్యంత రద్దీగా ఉండే గచ్చిబౌలి, నానక్రామ్గూడ, నార్సింగి, హైటెక్ సిటీ మార్గాల్లో ఒక వాహనం బ్రేక్డౌన్ అయినా చాలు.. క్షణాల్లోనే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది.
సత్యసాయి జిల్లా కుమ్మరవాండ్లపల్లిలో గ్యాస్ పేలుడు ఘటనపై మంత్రి సవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆవేదన కలిగించిందని పేర్కొన్నారు.
హైదరాబాద్ శివారు ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెట్లకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్ను వెనుక నుంచి కారు ఢీకొంది.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పెద్దవాగు రైల్వే బ్రిడ్జి పనుల్లో కార్మికులకు ప్రమాదం జరిగింది. థర్డ్ లైన్ పనులు చేస్తూ ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.