Home » ACB
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలంలో భూమి రికార్డుల సవరణ కోసం లంచం డిమాండ్ చేసిన వీఆర్వో పోతల శంకర్రావు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. ఒక రైతు తన భూమి రికార్డుల్లో పేరు మార్పు చేసి, ఎల్పీఎం జారీ చేయించుకోవడానికి వీఆర్వోను సంప్రదించారు.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఏ2 నిందితుడు వాసుదేవ రెడ్డికి ఏసీబీ కోర్టు ఈరోజు (శుక్రవారం) షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతిని రెండు రోజుల పోలీస్ కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 15, 16వ తేదీల్లో విచారించేందుకు అనుమతిచ్చింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కళింగిరి శాంతి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆమెను విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కుప్పం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు హడావుడి చేశారు. ఇదంతా గతంలో ఇక్కడ సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తూ అవినీతి కేసులో పట్టుబడ్డ వెంకటసుబ్బయ్య, నాటి జూనియర్ అసిస్టెంటు మోహన్తోపాటు ఇతర సాక్షుల విచారణ నిమిత్తమేనని తేలింది.
రాష్ట్రంలోని టౌన్ ప్లానింగ్ విభాగాల్లో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. బిల్డింగ్ ప్లాన్ ఆమోదాల్లో అక్రమాలు, లంచాల ఆరోపణలపై సోదాలు జరుగుతున్నాయి.
ఏపీలోని పలు ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు జరిగాయి. విజయవాడ, విశాఖ, కడప, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, శ్రీకాకుళం, రాజమండ్రిలోని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసుల్లో అధికారులు తనిఖీలు చేశారు.
ప్రకాశం జిల్లాలో ఏసీబీ సోదాల కలకలం రేగింది. నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేసిన నామన కృష్ణ మోహన్ రావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లాలో ఏసీబీ అధికారులు సోమవారం విసృత తనిఖీలు చేపట్టారు. డీసీసీబీ కాలనీలోని అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గడ్డి బాలముకుందం ఇంట్లో విస్తృత సోదాలు నిర్వహించారు.
కడప జిల్లా పులివెందులలో భారీ అవినీతి తిమింగలాలపై ఏసీబీ అధికారులు జరిపిన మెరుపు దాడులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఏసీబీ అధికారులు సీఐ ఇంటికి చేరుకుని సోదాలు నిర్వహించారు.