Home » ACB
పెద్దపల్లి జిల్లా మంథని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. సోదాలకు ముందు డాక్యుమెంట్ రైటర్ ఎండీ రషీద్.. ఓ రైతు నుంచి రూ.16,500ల లంచాన్ని తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు..
మేడ్చల్ - మల్కాజ్గిరి జిల్లాలోని దుండిగల్లోని మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఇవాళ (గురువారం) సోదాలు నిర్వహించారు. పరిపాలనా రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, హాజరు రిజిస్టర్లు, పెండింగ్ దరఖాస్తుల వ్యవహారంపై విచారణ చేపట్టారు..
కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. జోనల్ కార్యాలయంలో పలు విభాగాల్లో అవినీతి, అక్రమాలు జరుగుతున్నట్లు ఏసీబీకి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం.
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో విశాఖకు చెందిన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు చెందిన విశ్రాంత ఉద్యోగి కె.శ్రీనివాసరావు నివాసాల్లో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా ప్రాంతాలతో పాటు హైదరాబాద్లోని శేరిలింగంపల్లి ప్రాంతంలో ఏకకాలంలో ఈ దాడులు జరుగుతున్నాయి.
విశాఖపట్నం నగరంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ఓ సచివాలయ ఉద్యోగి.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.
దర్శి మున్సిపల్ కమిషనర్ మహేశ్వర రావు నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు కీలక డాక్యుమెంట్లను ఏసీబీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం మెరుపు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారంతో ఒకే రోజు ఇద్దరు ప్రభుత్వోద్యోగుల ఇళ్లలో ఏకకాలంలో రైడ్స్ నిర్వహించారు.
నెల్లూరు జిల్లా నాయుడుపేట అర్బన్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు ఆదివారం మెరుపు సోదాలు నిర్వహించారు. లంచం తీసుకుంటూ పోలీసు సిబ్బంది రెడ్ హ్యాండెడ్గా పట్టుబడటం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గత నెలలో లంచం తీసుకుంటూ డిప్యూటీ కలెక్టర్ వెంకట్ రెడ్డి ఏసీబీకి చిక్కారు.
మదనపల్లె డీఈవో కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న నాగిశెట్టి రాజశేఖర్ ఆస్తులు రూ.1.60కోట్లు వున్నట్లు ఏసీబీ అధికారులు లెక్కగట్టారు.