Home » 2025
మండల పరి ధిలోని కేశాపురం గ్రామానికి వెళ్లే బ్రిడ్జి సమీపంలో రోడ్డును వెంకటలక్ష్మమ్మ అనే మహిళ తవ్వేశారంటూ గ్రామస్థులు సోమవారం తహసీల్దార్ బాలాంజినేయులుకు స్థానిక తహసీ ల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ధర్మవ రం ప్రధానరహదారి నుంచి కేశాపురానికి వె ళ్లేందుకు మాజీ మంత్రి పల్లెరఘునాథ రెడ్డి ఆ యన మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు రూ.8 కోట్ల తో చిత్రావతి నదిపై బ్రిడ్జితో పాటు తారురోడ్డును వేయించారు.
ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి కురాషా పోటీల్లో ధర్మవరం విద్యార్థిని సింధు ప్రతిభ కనబరచి జా తీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్టు జీవీఈ జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల హెచఎం సుమన తెలిపారు. ఇటీవల అనంత పురం సమీపంలోని మాంటి స్సోరి పాఠశాలలో నిర్వహించిన ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి కురాషా పోటీల్లో తమ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న సింధు పాల్గొన్నారు.
ఽనియోజకవర్గంలోని చేనేత కార్మికుల ఎన్నో ఏళ్ల కల నేడు సాకారమైందని బీజేపీ నియోజకవర్గ ఇనచార్జ్ హరీశబాబు తెలిపారు. మెగా హ్యాండ్ లూమ్ క్లస్టర్కు భూమి కేటాయింపు కోసం రాష్ట్ర క్యాబినేట్ ఆమోదం తెలపడంతో సోమవారం స్థానిక కదిరిగేటు వద్ద ఉన్న నేతన్న విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం అక్కడే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనకల్యాణ్, మంత్రి సత్యకుమార్యాదవ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
మండల కేం ద్రంలోని చిన్నమిట్ట వద్ద నూ తనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠను సోమవారం ఘ నంగా నిర్వహించారు. ఇం దులో భాగంగా తెల్లవారుజా మున 2 గంటల నుంచి నే త్రోన్మీలనం, మహా పూర్ణా హుతి, నెయ్యి అభిషేకం, మ హా కుంభాభిషేకం తదితర పూజా కార్యక్రమాలను వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
వర్షం వస్తే చాలు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో పరిస్థితే మారిపోతుంది. ఏగదిలో చూసినా వర్షంపు నీరు కారుతోంది. ఇలా అయితే కార్యాలయంలో రికార్డులను ఎలా భద్రపరుస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే మండలంలో ఏడువేల ఎకరాలను సోలార్కు ఇచ్చారని, సోలార్ ద్వారా వచ్చే సీఎ్సఆర్ నిధులతో నూతనంగా తహసీల్దార్భవనం నిర్మించాలని ప్రజ లు కోరుతున్నారు.
మండలం లోని కుణుతూరులో పురాతన చంద్రమౌళీశ్వర స్వామి ఆల యంలో ఆదివారం ధాత్రి నారాయణ పూజ, అభిషేకాలు, హో మాలు, కార్తీక వనభోజనాల ను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమాలను అర్చకులు రాఘవ శర్మ, ఆయన శిష్య బృందం వేద మంత్రాల నడుమ నిర్వహిం చారు. ఈ పూజా కార్యక్రమాలకు గ్రామస్థులతో పాటు ధర్మవరం పట్టణ ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.
మండల కేంద్రంలో అయ్యప్పస్వామి గ్రామోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించా రు. అయ్యప్పస్వామి ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ఠలో భాగంగా నాలుగో రోజు అయ్యప్పస్వామి పంచలోహ విగ్రహం, వినాయకుడు తదితర విగ్రహాలను ఊరేగించా రు.
మండలపరిధిలోని అ నంతసాగరం గ్రామంలో నూత నంగా నిర్మించిన ఆలయంలో ఆదివారం రామలింగే శ్వరస్వామి, అ మ్మవారు, వినా యకుడు, కుమారస్వామి విగ్రహాల తో పాటు ధ్వజ స్తంభ ప్రతిష్ఠను ఘంనగా నిర్వహించారు. శుక్రవా రం నుంచి మూడు రోజు ల పాటు హోమాలు వి విధ పూజా కార్యక్రమా లను వేదిపండితులు ని ర్వహించారు.
కరువు ప్రాంతమైన అమడగూరు మండలంలో వ్యవసాయంతో రైతులు ప్రతి యేటా నష్టాలు చవి చూస్తున్నారు. దీంతో పె ట్టుబడులు పెట్టి పంటలు సాగుచేయలేక, పంటలు సాగిచేసినా పెట్టుబడులు తిరిరాని పరిస్థితిలో కొట్టుమిట్టాడు తున్నారు. దీంతో చాలామంది రైతులు రైతులు పాడిపరిశ్రమపై మక్కువ చూపుతున్నారు. ఎవరి శక్తి వారు రెండు లేదా నాలుగు ఆవులు, గేదెలు పెట్టుకొని పాలవ్యాపారం చేస్తున్నారు.
కొద్దికాలం క్రితం వరకు ఆలయాలే టార్గెట్గా దొంగలు రెచ్చిపోయారు. ఆలయాల వద్ద సీసీ కెమెరాలు అమర్చుకోవడంతో ఇప్పుడు రైతుల పొలాలను టార్గెట్గా చేసు కున్నారు. వేలకు వేలు ఖర్చుచేసుకుని పంటలకు విద్యుతకనెక్షన కోసం రైతులు అమర్చుకున్న ట్రాన్స ఫార్మర్లను ధ్వంసం చేసి వాటిలోని ఆయిల్ ను, కాపర్ వైర్ను ఎత్తుకెళ్తుండడంతో విద్యుతసరఫరా లేక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు.