రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. తుది జట్టులో నితీశ్ కుమార్ రెడ్డిని ఆడించకపోవడంపై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. బెంచ్కే పరిమితం చేయాలనుకున్నప్పుడు ఎందుకు ఎంపిక చేశారని సెలక్టర్లను ప్రశ్నించాడు.
ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో టీమిండియా స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్య పునరాగమనం చేశాడు. పంజాబ్తో జరిగిన ఈ మ్యాచ్లో పాండ్య ఆల్రౌండ్ షోతో బరోడా జట్టు ఘన విజయం సాధించింది.
ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు స్టార్ ప్లేయర్లు వీడ్కోలు పలుకుతున్నారు. తాజాగా ఈ జాబితాలో స్టార్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ చేరాడు. ఈ ఏడాది వేలంలో తన పేరును రిజిస్టర్ చేయించుకోవద్దని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాడు.
గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ అయ్యాక భారత్ వరుస ఓటములను చవి చూస్తుంది. సౌతాఫ్రికాతో టెస్టులో స్వదేశంలోనే వైట్ వాష్కు గురైంది. ఈ విషయంపై మాజీ కోచ్ రవి శాస్త్రి స్పందించాడు. తానే కోచ్గా ఉంటే ఓటమికి బాధ్యత తీసుకునేవాడినని తెలిపాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో కర్ణాటక స్టార్ ప్లేయర్ దేవదత్ పడిక్కల్ సెంచరీతో విశ్వరూపం చూపించాడు. పడిక్కల్ మెరుపు శతకం దెబ్బకు కర్ణాటక జట్టు 145 పరుగుల తేడాతో తమిళనాడుపై ఘన విజయం సాధించింది.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ రికార్డు నెలకొల్పాడు. మహారాష్ట్ర-బిహార్ మధ్య జరిగిన మ్యాచ్లో అతి పిన్న వయసులోనే సెంచరీ బాదిన ఆటగాడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో విజయం సాధించిన భారత్ జట్టు.. రెండో వన్డే కోసం రాయ్పుర్ చేరుకుంది. ఈ క్రమంలో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి చిన్నారులు గులాబీ పూలతో ఘనస్వాగతం పలికారు.
న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో ఈ ఘనత సాధించాడు. వెయ్యి పరుగులు చేసిన రెండో న్యూజిలాండ్ ప్లేయర్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు.
ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఐపీఎల్ కు గుడ్ బై చెప్పి... పాకిస్థాన్ సూపర్ లీగ్ లోకి వెళ్లనున్నట్లు ప్రకటించాడు.
క్రీడా రంగంలో విషాదం చోటుచేసుకుంది. ఇటాలియన్ టెన్నిస్ దిగ్గజం, రెండు సార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేత నికోలా పీట్రాంగెలి(92) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు.