భారత స్టార్ బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి–చిరాగ్ శెట్టి ప్రపంచ ఛాంపియన్షిప్లో మరో పతకం సాధించాలన్న ఆశలు క్వార్టర్ ఫైనల్లోనే ముగిశాయి. చైనాకు చెందిన ప్రపంచ నంబర్-3 జోడీ లియాంగ్ వీ కెంగ్–వాంగ్ చాంగ్ చేతిలో భారత జంట వరుస గేముల్లో ఓటమి పాలైంది.
భారత్-అఫ్గానిస్థాన్ మధ్య వచ్చే నెల జరగాల్సిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. మ్యాచ్ల తేదీలను కొన్ని రోజులు ముందుకు జరపాలని అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) ప్రతిపాదించినట్లు సమాచారం.
ప్రస్తుతం చర్చంతా టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గురించే! శ్రీలంకతో తొలి టెస్టులో అతడికి అవకాశాలు ఇవ్వలేదంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్పై స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంకతో తొలి టెస్టులో పెద్దగా ప్రభావం చూపలేకపోయినప్పటికీ.. అతడిపై టీమ్ మేనేజ్మెంట్కు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశాడు.
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ 165 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే బౌలింగ్, ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత్ అదరగొట్టినా.. బ్యాటింగ్పై మాత్రం శ్రీలంక మాజీ క్రికెటర్ రస్సెల్ ఆర్నాల్డ్ ప్రశ్నలు సంధించాడు.
శ్రీలంకతో రెండో టెస్టుకు ముందు భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ముఖ్యంగా లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిల్.. శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో అదే అంశంపై సుదీర్ఘంగా సాధన చేశాడు.
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత షట్లర్లు ట్రీసా జాలీ–గాయత్రీ గోపిచంద్ సత్తా చాటారు. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ఫైనల్లో చైనాకు చెందిన జియా యి ఫాన్-జాంగ్ షు షియాన్ జోడీపై అద్భుతమైన పోరాటంతో విజయం సాధించిన భారత జోడీ.. సెమీఫైనల్కు దూసుకెళ్లింది.
మాంచెస్టర్ యునైటెడ్ జట్టు మాజీ థెరపిస్ట్ రాడ్ థార్న్లే వద్ద భద్రపరిచిన ఫుట్బాల్ వస్తువులకు వేలంలో అద్భుతమైన స్పందన లభించింది. బార్సిలోనా తరఫున ఆడిన కాలంలో లియోనెల్ మెస్సి ధరించిన ఒక జెర్సీ వేలంలో ఏకంగా రూ. 56.4 లక్షల ధర పలికింది.
22 ఏళ్ల క్రితం నమోదైన ఓ కేసులో టీమిండియా మాజీ క్రికెటర్ జాకబ్ మార్టిన్ నిర్దోషిగా తేలాడు. అతడిపై వచ్చిన అభియోగాలకు సరైన ఆధారాలు లేకపోవడంతో కోర్టు అతడిని నిర్దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చింది.
2027లో జరగబోయే ఫిఫా మహిళల ప్రపంచకప్కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. గురువారం స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్లో ఉన్న ఫిఫా ప్రధాన కార్యాలయంలో ఫిఫా ఈ షెడ్యూల్ను ప్రకటించింది.