ప్రస్తుతం యూపీఐతో చెల్లింపులు జరపకుండా ఉండలేని పరిస్థితి ఉంది. అయితే, రెండు నెలల పాటు యూపీఐ వాడకపోవడంతో తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ ఓ మహిళ పెట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో ఓ ఇంటి బాత్ రూమ్లో ఏడడుగుల మొసలి కనిపించి కుటుంబాన్ని భయాందోళనకు గురిచేసింది. అప్రమత్తమైన యజమాని వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించారు.
క్యాన్సర్తో పోరాడుతూ.. మరణానికి చేరువలో ఉన్న ఓ వ్యక్తి.. తన కుమారుడికి జాగ్రత్తలు చెబుతున్నాడు. ఆ వీడియో అందరిని కంటతడి పెట్టిస్తుంది.
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో వృద్ధాశ్రమంలో చోటుచేసుకున్న దాడి కలకలం రేపింది. 14 ఏళ్ల బాలుడు వృద్ధ మహిళలను కర్రతో కొట్టిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
రహదారిపై ప్రయాణం అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. మనం ఎలా వెళ్తున్నామో కాదు.. ఎదురు వచ్చే వారు ఏటు వైపు నుంచి వస్తున్నారో కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నా.. ఎదురుగా వచ్చే వాహనం ఢీ కొడుతుంది.
సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో చిన్న పిల్లల ప్రతిభకు సంబంధించిన వీడియోలూ ఉంటాయి. ఆ కోవలోనే సైనికుల ముందు వేగంగా పుష్అప్స్ చేస్తూ.. అద్భుతమైన విన్యాసాలు చేసిన ఓ చిచ్చరపిడుగు వీడియో వైరల్ అవుతోంది.
మహారాష్ట్రలోని పింప్రి-చించ్వాడ్లో అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు ఓ ఆవును దొంగిలించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహారాష్ట్రలోని మల్షేజ్ ఘాట్లో ఓ పికప్ ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడిపి పలువురి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన డాష్క్యామ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. చివరకు వాహనదారు అతడిని అడ్డగించి పోలీసులకు అప్పగించారు.
ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు ముంచెత్తుడంతో.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ తండ్రి తన పిల్లలను కాపాడడం కోసం చేసిన ప్రయత్నానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వరద నీటిలో చిక్కుకుపోయిన ఆవు దూడ కోసం ఓ వ్యక్తి తన ప్రాణాలను పణంగా పెట్టాడు. భయంతో గజగజలాడుతున్న ఆవు దూడ కోసం వరద నీటిలోకి దిగాడు. ఎంతో కష్టం మీద దాన్ని బయటకు తీసుకువచ్చాడు.