యూఎస్కు చెందిన ఎఫ్-35 ఫైటర్ జెట్ పైలట్ ఇరాన్కు చిక్కినట్టు మీడియాలో సంచలన కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై అమెరికా ఇంకా స్పందించాల్సి ఉంది.
ఇరాన్ ముడి చమురుతో భారత్కు రావాల్సిన ఒక ఆయిల్ ట్యాంకర్ తన గమ్యాన్ని చైనాకు మార్చుకున్నట్టు షిప్ ట్రాకింగ్ వెబ్సైట్ కెప్లర్ తాజాగా పేర్కొంది. ఇందుకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆందోళన వ్యక్తం చేశారు. నాయకులు విధ్వంసాన్ని ఆపి చర్చలకు మొగ్గుచూపాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇరాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ను పదవీ బాధ్యతల నుంచి తప్పించి.. ప్రస్తుత వైస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా ఉన్న క్రిస్టోఫర్కు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించింది.
యూఎస్ శాశ్వతంగా తన పరువును పోగొట్టుకునే వరకూ ఘర్షణలు కొనసాగుతూనే ఉంటాయని ఇరాన్ సైన్యం తాజాగా స్పష్టం చేసింది. ఇరాన్ సైన్యం బలహీనపడిందన్న ట్రంప్ వ్యాఖ్యలను ఐఆర్జీసీ ప్రతినిధి తోసిపుచ్చారు.
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం వల్ల ఎవరి ప్రయోజనాలు నెరవేరుతున్నాయో ప్రశ్నించుకోవాలని అమెరికా ప్రజలకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సూచించారు. తమపై దాడుల నేపథ్యంలో అమెరికా ప్రజలను ఉద్దేశించి పెజెష్కియాన్ ఓ బహిరంగ లేఖ రాశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన బర్త్రైట్ సిటిజన్షిప్ (జన్మ ఆధారిత పౌరసత్వం) మార్పులపై అమెరికా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు స్వయంగా డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యారు.
నాటో నుంచి తప్పుకునే అంశాన్ని తమ దేశం పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్పై యుద్ధంలో నాటో దేశాలు తమకు సహకరించడం లేదని ట్రంప్ తెలిపారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని అమెరికా భావిస్తోంది. అయితే ఇరాన్ మాత్రం అమెరికాతో శాంతి చర్చలకు సుముఖంగా ఉన్నట్టు కనిపించడం లేదు. దీంతో పశ్చిమాసియాలో పరస్పర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
భారత సంతతికి చెందిన టెక్నాలజీ నాయకురాలు మంగళ కుప్పా యూఎస్ కార్మిక శాఖ ముఖ్య సమాచార అధికారిగా నియమితులయ్యారు. గతేడాది అక్టోబరు నుంచి తాత్కాలిక హోదాలో పనిచేసిన ఆమెకు పూర్తి స్థాయి సీఐవో బాధ్యతలు అప్పగించారు.