నేటి రాత్రి ఇరాన్ నాగరికత అంతమైపోతుందంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. అమెరికా, దాని మిత్రదేశాలపై ఎన్నడూ మర్చిపోలేని దెబ్బ పడుతుందని హెచ్చరించింది.
ఇరాన్కు ట్రంప్ భయానక వార్నింగ్ ఇచ్చారు. నేటి రాత్రి ఒక నాగరికత అంతమైపోవచ్చని సంచలన కామెంట్ చేశారు.
పాక్లో ఇంధన కొరత తీవ్రమైన నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ తరహా ఆంక్షలకు తెరతీసింది. రాత్రి 8 గంటల తరువాత షాపులు, మాల్స్, ఇతర వాణిజ్యసముదాయాలను మూసేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పాక్ ప్రధాని తాజాగా ఈ విషయాలను వెల్లడించారు.
హోర్ముజ్ జలసంధి తిరిగి తెరిచేందుకు యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విధించిన డెడ్లైన్ మరికొన్ని గంటల్లో ముగియనుంది. దీంతో ఇరాన్ అప్రమత్తమైనట్టు తెలుస్తోంది.
హోర్ముజ్ జలసంధిని తెరవకుంటే ఇరాన్ను సర్వనాశనం చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు సమీపిస్తుండగా ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని కాపాడుకునేందుకు ఇరాన్ ప్రజలు ప్రాణత్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నారని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్టు పెట్టారు.
తాత్కాలిక కాల్పుల విరమణకు బదులు శాశ్వతంగా యుద్ధానికి తెరదించే పరిష్కారం కావాలని అమెరికాకు ఇరాన్ తేల్చి చెప్పింది. కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా ప్రతిపాదనలను తమ ప్రభుత్వం తిరస్కరించిందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ సోమవారం ఓ కథనాన్ని ప్రచురించింది.
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ చాలా రోజుల నుంచి కోమాలో ఉన్నారా? ప్రస్తుతం ఖోమ్ నగరంలో చికిత్స పొందుతున్నారా? ఇరాన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో మొజ్తాబా ప్రమేయం ఏమీ లేదా?.. అవుననే అంటోంది అంతర్జాతీయ మీడియా.
సాధారణంగా ఏ సంస్థ అయినా తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. అయితే అమెరికాకు చెందిన చాక్లెట్–హాజెల్నట్ జామ్ 'న్యుటెల్లా'కు రూపాయి ఖర్చు లేకుండా భారీ పబ్లిసిటీ వచ్చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ను ఉద్దేశించి మరోసారి నిప్పులు చెరిగారు. ఇరాన్తో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
పొరుగు దేశమైన కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా కలపాలనేది డొనాల్డ్ ట్రంప్ ఆలోచన. ఆ విషయాన్ని ఆయన కొన్నేళ్లుగా చెబుతున్నారు. అందుకోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని కూడా చెబుతూ వస్తున్నారు.