రెండేళ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఒక్క చిన్న రోడ్డు అయినా వేశారా అని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నల వర్షం కురిపించారు. . కాంగ్రెస్ చేసిన విధ్వంసాన్ని సరిచేయాలంటే మళ్లీ ఇంకెంత సమయం పడుతుందోనని విమర్శించారు మాజీ మంత్రి హరీశ్రావు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం ముమ్మరంగా కొనసాగింది. ఈరోజుతో ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు జోరుగా ఇవాళ ప్రచారం చేయనున్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బోగస్ ఓట్ల, దొంగ ఓట్లతో గెలవాలని అధికార కాంగ్రెస్ పార్టీ చూస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. కారు గుర్తుకు ఓటెయ్యాలనుకునే వాళ్లు నవంబర్ 11వ తేదీ ఉదయం 6 గంటలకు పోలింగ్ బూత్కు వెళ్లి లైన్లో నిల్చోని కారు గుర్తుకి ఓటు వేయాలని కోరారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ పలు ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. మద్యం షాపులని నిబంధనల మేరకు బంద్ చేయాలని ఆదేశించారు. ఆంక్షలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
సరైరంజన్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధి డిస్పాచ్ సెంటర్ సమీపంలో కొన్ని వీవీప్యాట్ స్లిప్పులు కనిపించాయని, అధికారులతో కలిసి తాము అక్కడికి వెళ్లామని డీఎం కుష్వాహ తెలిపారు. అభ్యర్థుల సమక్షంలో ఆ స్లిప్పులను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.
బీజేపీతో ఒప్పందంలో భాగంగానే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బయట ఉన్నారని ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్రెడ్డి, కేంద్రమంత్రి కిషన్రెడ్డిల మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. రేవంత్రెడ్డి ఢిల్లీ పోతే ఎవర్ని కలిసేది.. ఎవరి కారులో తిరిగేది బయటకు వస్తున్నాయని ఎద్దేవా చేశారు.
సీతామర్హిలో శనివారం నాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ, ఒకానొక సమయంలో బిహార్ ఇతర రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి చేపలను సేకరించేదని, కానీ మత్స్యశాఖకు సంబంధించి తాము తీసుకున్న చర్యల కారణంగా బిహార్ ఇప్పుడు చేపల పెంపకంలో స్యయం సమృద్ధిని సాధించిందని చెప్పారు.
తొలి దశ పోలింగ్లో వచ్చిన స్పందన తమకు సానుకూలంగా లేకపోవడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలను కుదించుకున్నారని తెలిసిందని పవన్ఖేరా చెప్పారు. పోలింగ్ జరిగిన 121 నియోజకవర్గాల్లో చాలాచోట్ల మహాగఠ్బంధన్ ముందంజలో ఉందన్నారు.
హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీ చేసిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బీజేపీ చేస్తున్న ఓటు చోరీపై ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. యూపీ వంటి ఇతర రాష్ట్రాల వారికి కూడా హర్యానాలో ఓట్లు ఉన్నాయని ఆరోపించారు మహేష్ కుమార్ గౌడ్.
ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలవడం, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఎల్ఈడీ వెలుగుల్లో మెరిసిపోవడం ఖాయమని యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేశారు.