ఏపీకే ఫైల్స్ పంపి, వాటిని క్లిక్ చేయగానే ఫోన్ హ్యాక్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లోయర్ ట్యాంక్బండ్కు చెందిన బాధితుడికి హెచ్బీఎఫ్సీ బ్యాంకు నుంచి రెండు ఎస్సెమ్మెస్లు వచ్చాయి.
బిడ్డను చూడకుండానే.. తండ్రి కన్నుమూసిన విషాద సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ధర్మవరానికి చెందిన దిలీప్కుమార్ అనే యువకుడి భార్య బిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. తల్లీ బిడ్డలను చూసేందుకు ఆయన బైక్పై బయలుదేరగా.. అది అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు.
ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి సరుకు సరఫరా చేస్తున్న వదిన మరిదిలను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. వీరినుంచి 18.823 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రైల్వే డీఎస్పీ జావీద్, సికింద్రాబాద్ రైల్వే ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్గౌడ్లు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
కిస్మత్పూర్ ఓం నగర్ ఎస్ఎం ఎంక్లేవ్లో దొంగలు పడ్డారు. ఓ ఇంట్లోకి ప్రవేశించిన దొంగ 31 తులాల బంగారు ఆభరణాలను దోచుకొని పారిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఓం నగర్ ఎస్ఎం ఎన్క్లేవ్లో కిరణ్కుమార్ గౌడ్ కుటుంబం నివాసం ఉంటోంది.
విరుదునగర్ జిల్లా రాజపాళయంలోని నచ్చాడై తవిర్తరుళియ స్వామివారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి డ్యూటీలో ఉన్న ఇద్దరు వాచ్మన్లను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని ఆ ఆలయంలో పేచ్చిముత్తు (50), శంకరపాండియన్ (65) అనే ఇద్దరు వాచ్మన్లుగా పనిచేస్తున్నారు.
లాల్దర్వాజ ఛత్రినాకకు చెందిన షకత్వారి శ్రవణ్ (28) పాత దొంగ. అల్లం, వెల్లుల్లిగడ్డల వ్యాపారం చేస్తున్నాడు. తన స్నేహితులైన బీబీనగర్కు చెందిన కాలియారాజు, మేడ్చల్కు చెందిన షకత్ ముఖేంద్రతో కలిసి సులభంగా డబ్బుల సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనాలు చోరీ చేస్తే యజమానులు కూడా చిన్న వాహనం అని ఫిర్యాదు చేసే అవకాశం ఉండదని భావించి ఆ వాహనాలను చోరీచేస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుళ్లు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. పేలుళ్లకు రెండు రోజుల ముందు గుజరాత్లో యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వారిలో హైదరాబాద్కు చెందిన సయ్యద్ మహ్మద్ మోహియుద్దిన్ ఉండటం చర్చనీయాంశమైంది.
పెళ్లి కావడం లేదని మనస్తాపంతో ఓ వ్యక్తి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్ రైల్వే హెడ్ కానిస్టేబుల్ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ ఆత్మకూర్ ప్రాంతానికి చెందిన సురేందర్ కుమారుడు నరేష్(30) అమీర్పేట్లో హాస్టల్ ఉంటూ స్థానికంగాగల దుస్తుల దుకాణంలో పనిచేస్తున్నాడు.
నిజాంపేట కార్పొరేషన్ రాజీవ్గృహకల్పలో అర్ధరాత్రి గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. ఆటోలో వస్తున్న ఇద్దరిపై దాడి చేసి తలలు పగులగొట్టింది. బాచుపల్లి పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదుగురు విదేశీయులను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ హఫీజ్పేట్ సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు మాదాపూర్ ఎస్ఓటీ, మియాపూర్ పోలీసులు సోమవారం రాత్రి దాడులు నిర్వహించారు.