సెల్ఫోన్.. మరో విద్యార్థిని ఊపిరితీసింది. ఫోన్ ఎక్కువగా చూడొద్దని కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా హిందూపురం సత్యనారాయణపేటలో జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
అనుమానాస్పద స్థితిలో తల్లీకొడుకు మృతిచెందిన విషాద సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఉరికి వేలాడిన తల్లి మృతిచెంది ఉండగా మూడేళ్ల సహర్షను కిరాతకంగా హతమార్చారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తగా తీవ్ర సంచలనానికి దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
బావ మీద ఉన్న కోపాన్ని తన మేనల్లుడిపై చూపించాడో దుర్మార్గుడు. పసివాడిని కూడా చూడకుండా గొంతు నులిమి చంపేశాడు. ప్రేమ నటించి, మేనల్లుడు ఐదు సంవత్సాల హర్షవర్ధన్ను దారుణంగా హతమార్చాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
ఓ వృద్ధుడు సైబర్ మోసగాళ్ళ చేతిలో బలైపోయాడు. రూ.1.36లక్షలను పోగోట్లుకున్నాడు. హైదరాబాద్ నగరంలోని గాంధీనగర్కు చెందిన వృద్ధుడొకరు అమెజాన్ కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్లో వెతికి సైబర్ నేరాగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
తానొక ఐఏఎస్ అధికారినంటూ పలువురి వద్ద నుంచి వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన బత్తిని శశికాంత్ అనే వ్యక్తి తాను ఐఏఎస్ అధికారినంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. చివరకు ఆయన పాపం పండి పోలీసులకు దొరికిపోయాడు. వివరాలిలా ఉన్నాయి.
ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన విశాఖ నగరంలో చోటుచేపుకుంది. హైదరాబాద్కు చెందిన ర్యాలీ శ్రీనివాసరావు (57) అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. అయితే.. కుమార్తె పెళ్లి ఆగిపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పోలీసులే దొంగలుగా మారారు. బాధ్యతగా ఉండాల్సిన రెండు చుక్కల అధికారులు కూడా దారితప్పారు. తమ స్వార్ధబుద్దితో ఓ వ్యాపారిని బెదిరించి బంగారాన్ని ఎత్తుకెళ్లారు. చివరకు కటకటాలపాలయ్యారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం దావణగెరెలో జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
మార్కులు తక్కువ వచ్చాయని తండ్రి మందలించడంతో.. మనస్థాపానికి గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డ విషాద సంఘటన సికింద్రాబాద్ హబ్సిగూడలో చోటుచేసుకుంది. సిరి వైష్ణవి(15) అనే బాలిక పదో తరగతి చదువుతోంది. అయితే.. మార్కులు తక్కువగా వస్తుండడంతో తండ్రి మందలించాడు. దీంతో ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది.
ప్రేమ విఫలమైందని మనస్తాపంతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన హైదరాబాద్ నగర శివారులో జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన కుర్ర పవన్ కళ్యాణ్రెడ్డి ఉద్యోగం చేస్తున్నాడు. అయితే.. ప్రేమ విఫలమైందన్న కిరణంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పులి దాడిలో ఓ వృద్ధురాలిని చంపేసిన విషాద సంఘటన తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లలో చోటుచేసుకుంది. నాగియమ్మాళ్ అనే వృద్ధురాలు పులి దాడిలో మృతిచెందడంతో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.