అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభ్యున్నతే లక్ష్యమని కూటమి నేతలు పునరుద్ఘాటించారు. రాజకీయ కక్షలు, కుట్రలకు తావులేని స్వఛ్చమైన, స్వేచ్ఛాయుత పాలన అందిస్తున్నామని స్పష్టం చేశారు. భీమవరం సమీపంలోని రాధా కన్వెన్షన్ హాలులో శుక్రవారం కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై సదస్సు నిర్వహించారు.
ప్రభుత్వ బడులకు పూర్వవైభవం వస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరుగుతున్నాయి.
ముదినేపల్లి మండలం ములకలపల్లి గ్రామంలో నకిలీ పత్రాలతో తమ భూములు, ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ జరిగాయని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై ముదినేపల్లి పోలీస్ స్టేషన్లో గురువారం కేసు నమోదైంది.
ఇరాన్తో ఇజ్రా యిల్, అమెరికా చేస్తున్న యుద్ధం నేపథ్యంలో వంటగ్యాస్కు కొరత రావడంతో గ్యాస్ కంపెనీలు నిబంధనలు కఠినతరం చేశాయి.
జిల్లాలో భూగర్భజలాల వృద్ధికి యంత్రాంగం దిదు ్దబాటు చర్యలకు ఉపక్రమించింది. గతేడాది డిసెంబరు లో జరిగిన కలెక్టర్ల సదస్సులో జిల్లాలో భూగర్భజలాలు దిగజారిపోవడంపై సీఎం చంద్రబాబు సైతం ఆశ్చర్య వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తవడంతో నియోజకవర్గాల వారీగా మన నమ్మకం– అభివృద్ధి.. సంక్షేమం పేరుతో విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారు.. గురువారం పాలకొల్లు, ఉండి, ఆచంట నియోజకవర్గాల్లో సభలు నిర్వహించారు. నియోజకవర్గ ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఏలూరు పరిసర ప్రాంతాల్లోని పంట కాలువల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్క (వాటర్ హయాసింత్) తొలగింపు కోసం నీటిపారుదల శాఖ డ్రోన్ ద్వారా మందు పిచికారీ చేస్తోంది.
కబ్జాదారులకు ఎర్రకాలువ భూములు బంగారు కొండల్లా మారాయి..
అన్నదాతలతో కన్నీరు పెట్టించిన దొంగల ముఠాకు నూజివీడు రూరల్ పోలీసులు తగిన బుద్ధి చెప్పారు. కొన్ని నెలలుగా రైతన్నలను ఇబ్బందులకు గురి చేస్తున్న వారి భరతం పట్టారు. నిందితులను నడి రోడ్డుపై నడిపిస్తూ తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచారు.
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి తెలుగుదేశం కార్యా చరణ రూపొందించింది.