వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు మరో రూ.200 కోట్ల పరిహారాన్ని బుధవారం సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ప్రాజెక్టు కోసం ఊళ్లను త్యాగం చేసిన వారిని ఆయన అభినందించారు. నిర్వాసితుల తరఫున అమరావతి వెళ్లిన వారికి అసెంబ్లీ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో సీఎం చెక్కును అందజేశారు.
దర్శి ఎన్ఏపీ రక్షిత మంచినీటి పథకం నిర్వహణ అధ్వాన్నంగా తయారైంది.ఎంతోకాలంగా ఫిల్టర్ బెడ్లు పనిచేయ టం లేదు. క్లోరినేషన్ సక్రమంగా కావటం లేదు.
చందవరం-1 సాగర్ జలాల స్టోరేజీ నుంచి వారం రోజులుగా దొనకొండకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో మండల పరిధిలోని 28 గ్రామాల ప్రజలు మంచినీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అనుమానంతో తరచూ వేధింపులకు గురిచేస్తున్న భర్త శ్రీకాంత్రెడ్డిపై దాడి చేసి హతమార్చిన కేసులో భార్యతో పాటు మరో ఇద్దరు కుటుంబసభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇంట్లో అద్దెకు ఉంటూ వృద్ధురాలిని నమ్మించి దొంగతనానికి పాల్పడిన భార్యాభర్తలను అరెస్టు చేసినట్లు ఎస్పీ వి.హర్షవర్దనరాజు చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం కావాలని కలెక్టర్ పీ రాజాబాబు ఆదేశించారు.
పొగాకు రైతుకు మరో సమస్య వచ్చిపడింది. నిన్న మొన్నటి వరకు మార్కెట్లో ధరలు లేక, కొనుగోళ్లు సక్రమంగా సాగక నిత్యం భారీ నోబిడ్లతో సతమతమయ్యారు. వారు చేసిన ఆందోళనలు, ప్రభుత్వ జోక్యంతో మార్కెట్ కొంతమేర కుదుటపడింది.
ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అఽథారిటీ (ఒడా) పునర్వ్య వస్థీకరణ జరిగింది. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని అన్ని పట్టణ, స్థానిక సంస్థలు, మండలాల పరిధిలో ఈ సంస్థ ఏర్పాటు కాగా, ప్రస్తుతం మారిన జిల్లాలకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేశారు.
కేంద్రం నూతనంగా తెచ్చిన వీబీ జీరామ్జీ పథకంలో ఉపాధి ద్వారా పొందే లబ్ధిపై ఆంక్షలు విధించారు. గతంలో ఈ పథకం పరిధిలో ఎన్ని స్కీంలు ఉన్నా వాటన్నింటినీ వినియోగించుకునే అవకాశం లబ్ధిదారులకు ఉంది. నిబంధనల ప్రకారం అర్హత గల వారికి వాటిని మంజూరు చేసి తద్వారా వచ్చే లబ్ధి ఎంత మొత్తం అయినా ఇచ్చేవారు.
దర్శి నియోజకవర్గంలో కుసుమ్ పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. ఎనిమిది ప్రాంతాల్లో సోలార్ యూనిట్ల నిర్మాణానికి అధికారులు స్థలసేకరణ పూర్తి చేశారు. కొన్నిచోట్ల మెటీరియల్ తోలి పనులను ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న విషయం విదితమే.