మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం వెళ్లే భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో దోర్నాల-శ్రీశైలం ఘాట్ రోడ్డులో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఇన్చార్జి ఎస్పీ వి. హర్షవర్ధన్రాజు చెప్పారు.
మార్కాపురం జిల్లాకు సంబంధించిన రెవెన్యూ రికార్డులన్నీ కలెక్టరేట్కు చేరాయి.
జిల్లాలో 66,972 మంది వయోజనులకు విద్య అందించే కార్యక్రమం ఉల్లా్స-అక్షరాంధ్రను విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు చెప్పారు.
శీతల గిడ్డంగులు తగినన్ని లేక కొండపి ప్రాంతంలోని రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఐదారేళ్లుగా పొగాకు రైతులు బేళ్లను కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేయడానికి అలవాటు పడ్డారు. ఈ కారణంగా ప్రస్తుతం కొండపి ప్రాంతంలో ఉన్న గిడ్డంగులు సరిపోవడం లేదు.
మండలంలోని మాలకొండ శ్రీమాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో తలనీలాల పాటను దక్కించుకున్న గుంటూరు గౌతమబుద్ధ సంస్థ ప్రతినిధి రూ.కోటికి పైగానే ఎగనామం పెట్టారు. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన తలనీలాల వేలం పాటను ఆ సంస్థ తరఫున రూ.2.30 కోట్లకు పాడుకున్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో విద్యార్థులు తక్కువగా ఉన్న ఎయిడెడ్ పాఠశాలలకు మూసివేత ముప్పు పొంచి ఉంది. 40మంది కంటే తక్కువ పిల్లలు ఉన్న బడులకు తాళం వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఆ స్కూళ్లల్లో విద్యార్థుల సంఖ్యను పెంచకోకపోతే చర్యలు తప్పవని విద్యాశాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీచేసింది.
ఉద్యోగ, కార్మిక హక్కుల పరిరక్షణ లక్ష్యంగా దేశవ్యాప్తంగా వివిధ సంఘాలు ఇచ్చిన సార్వత్రిక సమ్మె పిలుపునకు అనుగుణంగా గురువారం జిల్లాలో విభిన్నరంగాల కార్మికులు, ఉద్యోగులు, స్కీం వర్కర్లు సన్నద్ధమయ్యారు. కేంద్ర కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఏటీయూసీ, ఇతర పది కార్మిక సంఘాల వారితో కలిసి వామపక్ష, రైతు సంఘాలు ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి.
ఆర్డబ్ల్యూఎస్ శాఖలో టెండర్ల ప్రక్రియలో జరిగిన అక్రమాలను నిగ్గుతేల్చేందుకు విచారణ కమిటీ బుధవారం దర్శి నియోజకవర్గంలో పర్యటించింది. డీపీవో ఎం.వెంకటేశ్వరరావు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి జాన్సన్, పీఆర్ ఈఈ వేణుగోపాల్రెడ్డితో కూడిన ఈ కమిటీ స్థానిక ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో మాట్లాడింది.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కొమరోలు మండలం రాజుపాలెంలోని భారీ విద్యుత్ ప్రాజెక్టు పనులను ఏపీ జెన్కోకు ప్రభుత్వం అప్పగించింది. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆ మేరకు తీర్మానం చేశారు.
ఓ ప్రైవేటు భూమి ఆక్రమణ విషయమై చోటుచేసుకున్న వివాదం ముదురుతోంది. ముక్తినూతలపాడు పంచాయతీ పరిధిలో ప్రభుత్వం వేసిన లేఅవుట్లో తాము స్థలాలు కొనుగోలు చేశామని హక్కుదారులు వెల్లడిస్తుండగా, గత పదిహేనేళ్ల నుంచి తాము నివా సాలు ఏర్పరుచుకుని జీవిస్తున్నామంటూ మరికొందరు వాపోతున్నారు.