నీటి వనరుల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలధార-జలహారతి కార్యక్రమం జిల్లాలో ఉపయుక్తంగా సాగే విధంగా యంత్రాంగం కృషి చేస్తోంది. లక్ష్యానికి అనుగుణంగా చెరువులు, కుంటల్లో వర్షపు నీరు నిల్వ, తద్వారా భూగర్భ జలాల పెంపు జరగాలంటే పూడికతీత ప్రధానమని గుర్తించింది.
తెలుగు దేశం పార్టీ ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు పండుగకు శ్రేణులు సన్నద్ధమవు తున్నారు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని ఆపార్టీ మూడు రోజులపాటు మహానాడును నిర్వహిస్తోంది.
ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ఇద్దరు యువకు లు దుర్మరణం చెందారు. ఈ ఘటన మండలంలోని మాదాలవారిపాలెం-సలకనూతల గ్రామాల మధ్య బుధవారం చోటుచేసుకుంది.
దక్షిణాది పొగాకు మార్కెట్లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. భారీగా బేళ్ల తిరస్కరణ కొనసాగుతూనే ఉంది. బుధ వారం మార్కెట్లో కూడా వ్యాపారులు కొనుగోలు చేసిన వాటి కన్నా తిరస్కరిం చినవే అధికంగా ఉన్నాయి.
ముస్లిం విద్యార్థుల్లో ప్రతిభ ఉండి చదువుకు దూరమయ్యే వారికోసం ప్రభుత్వం వక్ఫ్బోర్డు ఆధ్వర్యంలో ఉచిత విద్య అందించాలని నిర్ణయించింది. కార్పొరేటు కళాశాలల్లో వసతితో కూడిన బోధన అందించేలా పథకాన్ని రూపొందించింది.
చెత్త నుంచి సంప దను సృష్టించడం ప్రారంభమైంది. గ్రామ పంచాయతీల్లో చెత్త సంపద కేంద్రాలు కళకళలాడుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన వీటిని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.
తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలకు పార్లమెంట్ స్థానాలను అధిష్ఠానం కేటాయించింది. రాష్ట్రవ్యా ప్తంగా పదిమంది ముఖ్య నాయకులను సమన్వ యకర్తలుగా నియమించింది. వారికి రెండు నుంచి మూడు పార్లమెంట్ స్థానాలను కేటాయిం చింది.
బడి పిలుస్తోంది.. కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటికే భారీగా ఎన్రోల్మెంట్ నమోదైంది. గతంలో వేసవి సెలవుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికపై పెద్దగా దృష్టిపెట్టేవారు కాదు.
మండ లంలో రెండు వారాలుగా ఉపాధి పనులు లేకపోవడంతో కూలీలు ఉసూరుమంటున్నారు. వేసవికాలం కావడంతో గ్రామాల్లో రోజువారీ పొలం, వ్యవసాయ పనులు లేక కూలీలు ఉపాధి పనికి వెళ్తున్నారు. వారు చేసిన పనిని బట్టి రోజుకు సుమారు రూ.250 వరకు కూలి గిట్టుబాటు అవుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం రవాణాశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. దళారీ వ్యవస్థకు చెక్పెట్టి వాహనదారులకు ఇబ్బందిలేకుండా చర్యలు చేపట్టింది. కొత్త వాహనం కొనుగోలు చేసిన తర్వాత 24 గంటల్లో రిజిస్ట్రేష న్ పూర్తయ్యేలా మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.