• Home » Andhra Pradesh » Prakasam

ప్రకాశం

తొలిరోజు 702 పంచాయతీల్లో..

తొలిరోజు 702 పంచాయతీల్లో..

ఉపాధి పండుగ పేరుతో నెలరోజులపాటు చేపట్టిన పనులు పూర్వపు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో బుధవారం ప్రారంభమయ్యాయి, మొత్తం ఎనిమిది నియోజకవర్గాల్లో 729 గ్రామపంచాయతీలు ఉండగా తొలిరోజు కూలీలు ఎంతమంది హాజరు అన్న విషయాన్ని పక్కనపెట్టి అన్ని పంచాయతీల్లో పనులు ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు.

దర్శి ప్రజలకు అమృతం

దర్శి ప్రజలకు అమృతం

దర్శి మునిసిపాలిటీ పరిధిలోని ప్రజల చిరకాల వాంఛ నెరవేరనుంది. స్వచ్ఛమైన నీటిని అందించే అమృత్‌ పథకం పనులకు అంతా సిద్ధమైంది. టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో సంబంధిత కాంట్రాక్టర్‌కు అధికారులు అగ్రిమెంట్‌ చేశారు.

ఇక మాజీలే..

ఇక మాజీలే..

జిల్లాలో గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం గురువారంతో ముగియ నుంది. శుక్రవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలన రానుంది. ప్రకాశం జిల్లాలో 519 గ్రామ పంచాయతీలు ఉండగా 518 పంచాయతీలకు 2021లో ఎన్నికలు జరిగాయి. కొండపికి గత ఏడాది నిర్వహించారు.

నిర్దేశిత గడువులోపు వెలిగొండ పూర్తి

నిర్దేశిత గడువులోపు వెలిగొండ పూర్తి

ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు వెలిగొండ ప్రాజెక్టు పూర్తికి చర్యలు తీసుకుంటున్నట్లు మార్కాపురం జిల్లా కలెక్టర్‌ విజయసునీత తెలిపారు. వెలిగొండ పనులను ఆమె జాయింట్‌ కలెక్టర్‌ పులి శ్రీనివాసులుతో కలిసి బుధవారం పరిశీలించారు.

మార్కాపురం బస్సు ప్రమాదం.. డ్రైవర్, ఓనర్ అరెస్ట్

మార్కాపురం బస్సు ప్రమాదం.. డ్రైవర్, ఓనర్ అరెస్ట్

మార్కాపురం బస్సు ప్రమాదంలో డ్రైవర్, ఓవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్చి 26న జరిగిన ప్రమాదంలో 14 మంది సజీవ దహనమయ్యారు.

‘ఉపాధి’ పండుగ

‘ఉపాధి’ పండుగ

ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఇప్పటివరకు అమలులో ఉన్న నరేగా నిబంధనలను మరో నెలపాటు కేంద్రం పొడిగించింది. దీంతో ఈనెలలో గరిష్ఠంగా పనులు చేసి లబ్ధిపొందాలన్న సంకల్పంతో రాష్ట్రప్రభుత్వం ఉంది. తదనుగుణంగా ఏప్రిల్‌ అంతా ముమ్మరంగా కూలీలకు పనిదినాలు కల్పించే విధంగా అన్ని జిల్లాల డ్వామా అఽధికారు లను ఆదేశించింది.

చెత్త సమస్యకు పరిష్కారం

చెత్త సమస్యకు పరిష్కారం

పట్టణాల్లో పేరుకుపోయిన చెత్త నిల్వలను తొలగించే దిశగా లెగసీ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ (పాత వ్యర్థాల నిర్వహణ) కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. స్వచ్ఛభారత్‌ 2.0లో భాగంగా మునిసిపాలిటీల్లో దీన్ని అమలు చేస్తున్నారు.

బల్లిపల్లి వద్దే ట్రిపుల్‌ ఐటీ

బల్లిపల్లి వద్దే ట్రిపుల్‌ ఐటీ

కనిగిరి మండలం బల్లిపల్లి వద్ద ట్రిపుల్‌ ఐటీ కళాశాల నిర్మాణానికి ప్రభుత్వం ఉపక్రమించింది. తరగ తులు, ట్యుటోరియల్స్‌ గదుల నిర్మాణానికి మంగళవారం టెండర్లను ఆహ్వానించింది. ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు తరగతులు ప్రస్తుతం ఒంగోలులోని అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు.

పింఛన్‌ల పంపిణీ నేడే

పింఛన్‌ల పంపిణీ నేడే

రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద బుధవారం సామాజిక పింఛన్లను పంపిణీ చేయనుంది. వివిధ రకాలైన సామాజిక పింఛన్లు పొందుతున్న వారు ప్రకాశం జిల్లాలో 2,18,992 మంది ఉండగా వీరికి పింఛన్‌ సొమ్మును అందజేసేందుకు రాష్ట్రప్రభుత్వం రూ.95.28 కోట్లను విడుదల చేసింది.

గృహ గణనకు ఏర్పాట్లు పూర్తి

గృహ గణనకు ఏర్పాట్లు పూర్తి

వచ్చే ఏడాది జరగనున్న భారత జన గణనలో భాగంగా గృహ గణనకు జిల్లాలో ఏర్పాట్లు చక చకా జరుగుతున్నాయి. కేంద్రప్రభుత్వ ఆదేశా లతో ఈసారి సమగ్రంగా గృహగణన నిర్వహిం చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి