Rajam.. as it is. రాజాం మున్సిపాలిటీకి మరోసారి మొండిచేయి మిగిలింది. విజయనగరం కార్పొరేషన్తో పాటు బొబ్బిలి మున్సిపాలిటీ, నెల్లిమర్ల నగర పంచాయతీలలో వార్డుల విభజనకు సోమవారం అధికారిక ప్రకటన జారీ అవుతోంది. రాజాంను విస్మరించారు. ఇప్పటికే రెండు దశాబ్దాలుగా రాజాం ప్రత్యేకాధికారి పాలనలోనే ఉంది. ఇకపైనా అదే పరిస్థితి కొనసాగనుంది.
డెంకాడ మండలం పెదతాడివాడ వద్ద ఓ ప్రైవేటు పాఠశాల ఎదురుగా ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పూసపాటిరేగ మండలం పూసపాటిపాలెం గ్రామానికి చెందిన వలిరెడ్డి పద్మ(49) అనే మహిళ మృతిచెందింది.
Ordeal at the Hospital పేరుకే పెద్దాసుపత్రి.. కానీ ఆ స్థాయిలో వైద్య సిబ్బంది లేరు. సౌకర్యాలు అంతంతమాత్రమే. వసతి సమస్య కూడా తీవ్రంగా వేధిస్తోంది. దీంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొన్నాళ్లుగా పార్వతీపురం జిల్లాకేంద్రాసుపత్రిలో ఈ పరిస్థితి నెలకొన్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు.
Not Fetching Remunerative Prices! జీడి పంటకు గిట్టుబాటు ధర కరువైంది. దీంతో గిరిజన రైతులు లబోదిబోమంటున్నారు. జిల్లాలో సుమారు 65 వేల ఎకరాల్లో జీడితోటలు ఉన్నాయి.
Oh No… Elephants on the Move! జియ్యమ్మవలస, భామిని మండలాల్లో గజరాజులు హల్చల్ చేస్తున్నాయి. పంటలు, వ్యవసాయ సామగ్రిని ధ్వంసం చేస్తూ ప్రజలను బెంబే లెత్తిస్తున్నాయి. ఆదివారం ఉదయం గజరాజులు జియ్యమ్మవలస మండలం చినబుడ్డిడి నుంచి పరజపాడు పొలిమేరకు చేరుకున్నాయి.
When Will They Change It? జిల్లాలో చాలాచోట్ల ఇంకా గ్రామ సచివాలయాల పేర్లు మారలేదు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా.. అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవంగా గత వైసీపీ ప్రభుత్వం ఎంతో హడావుడిగా గ్రామ పంచాయతీ లను గ్రామ సచివాలయాలుగా మార్చింది. అవసరాన్ని మించి సిబ్బందిని నియమించి తీవ్ర విమర్శల పాలైంది.
Oh God… Who Will Stand By Us Now! కొన్నాళ్ల కిందట తండ్రి చనిపోవడంతో ఆ యువకుడు ఇంటికి పెద్ద దిక్కుగా మారాడు. ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే స్నేహితుడి తల్లి వర్ధంతి కోసమని రెండు రోజుల కిందట స్వగ్రామానికి వచ్చాడు. పనుల నిమిత్తం బైక్పై వెళ్లిన ఆ యువకుడు తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్లు ఢీ కొన్న ఘటనలో ఆ యువకుడు మృత్యువాత పడ్డాడు.
నగరంలోని టీడీపీ జిల్లా కార్యాల యంలో ఆదివారం ప్రజాదర్బార్ నిర్వహించారు. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొని నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజల నుంచి 170 వినతులను స్వీకరించారు.
తోటాడ- అక్కివరం పరిధిలోని భూములపై కొందరు వైసీపీ నాయకులు పన్నిన కుట్రలు, చేస్తున్న బ్లాక్ మెయి ల్ రాజకీయాలపై ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ భూ ములతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఒక్క అంగుళం భూమి ఆక్రమించినట్లు నిరూపించినా తాను ఏ శిక్షకైనా సిద్ధమేనని సవాల్ విసిరారు.
జీడి పంటకు గిట్టుబాటు ధర కల్పిం చి రైతులను ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.తులసీదాస్ డిమాండ్ చేశారు.