దేశ సాంప్రదాయం ప్రకారం ఉదయాన్నే ఇంటిముందు కాళ్లాపు(పేడ) చల్లి ముగ్గువేయడం మహిళలకు వాడుక. కాలక్రమంలో పేడ దొరక్కపోవడంతో మార్కెట్లో రసాయనాలతో తయారుచేసిన పేడరంగును వినియోగిస్తున్నారు
ప్రభుత్వ సర్వజన వైద్యశాల న్యూడయోగ్నస్టిక్ బ్లాక్లో అత్యాధునిక సీడీ4 ల్యాబ్ను ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.కే.వెంకటేశ్వర్లు వైస్ ప్రిన్సిపాల్ డా.రేణుకాదేవితో కలిసి ప్రారంభించారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లా మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎ్స)కు మహర్దశ పట్టింది. ఈసంస్థకు జవసత్వాలు కల్పించేందుకు ఆ సంస్థ చైర్మన్ వై.నాగేశ్వరరావు యాదవ్ చర్యలు చేపట్టారు. పాత భవనం స్థానంలో అధునాతన షాపింగ్ కాంప్లెక్స్ను నిర్మించేందుకు రూ.10కోట్లతో ప్రతి పాదనలు సిద్ధం చేసి చేసి ప్రభుత్వ ఆమోదం కోసం ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు నివేదికను అందజేశారు.
విద్యార్థులందరూ తప్పనిసరిగా నులి పురుగులు నివారించే అల్బెండజోల్ మాత్రలు వేసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.సిరి అధికారులను ఆదేశించారు.
ఆదిదేవుడు, భోళా శంకరుడైన శ్రీశైల మల్లికార్జున స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
గవర్నర్ ప్రసంగంలో ఇండస్ట్రియల్ కారిడార్
కేసీ ఆయ కట్టు రైతులు హంద్రీనీవా నుంచి, ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి కేసీకెనాల్కు విడుదల చేస్తున్న నీటిని సద్వినియోగించుకోవాలని హంద్రీనీవా సీఈ కబీర్, ఎస్ఈలు పాండురంగయ్య, బాల చంద్రారెడ్డి రైతులకు సూచించారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో తొలి రోజుల్లోనే అంచనాకు మించి రెట్టింపు స్థాయిలో భక్తులు వచ్చారని, అందుకు తగిన ఏర్పాట్లను చేసినట్లు కలెక్టర్ రాజకుమారి అన్నారు.
మల్లన్న దర్శనార్థం వివిధ ప్రాంతాల నుంచి క్షేత్రానికి వచ్చే భక్తులను గౌరవించడం పోలీసుల తొలి కర్తవ్యమని ఎస్పీ సునీల్ షెరాన్ సాయుధ బలగాల సిబ్బందికి దిశనిర్దేశం చేశారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానందికి విచ్చేసే సామాన్య భక్తులకు పెద్దపీట వేయ నున్నట్లు నంద్యాల ఆర్డీవో చల్లా విశ్వనాథ్ తెలిపారు.