వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్థ రెడ్డిపై కర్నూలు పట్టణంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.
ఎస్సీలకు సామాజిక న్యాయం చేస్తామని ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని చిగురుమానుపేట కాలనీలో ఎమ్మెల్యే పర్యటించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీలపై చేసిన దౌర్జన్యాలు, వివక్షను ఖండించారు.
: మండలంలో వంటగ్యాస్ వినియోగదారులకు కష్టాలు తప్పడం లేదు. సుమారు నెలన్నర నుంచి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిలిండర్ బుక్చేసిన 20, 25 రోజుల తర్వాత కూడా డెలివరీ ఇవ్వడం లేదంటున్నారు. కొలమిగుండ్లలో భారత్, హెచ్పీ గ్యాస్ ఏజెన్సీలు ఉండగా సుమారు 14వేలకుపైగా వినియోగదారులు ఉన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వైసీపీ నాయకులు నిరసన చేయడం హాస్యాస్పదంగా ఉందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
బొలెరో డ్రైవర్ నిర్లక్ష్యానికి ఇద్దరి ప్రాణాలు బలి అయ్యాయి. అంత్యక్రియలకు వెళ్లొస్తూ ఒకరు మృతి చెందగా పనులు ముగించుకొని వెళ్తూ మరొకరు మృత్యు ఒడికి చేరుకున్నాడు.
ప్రజల్లో మమేకమై.. క్రమ శిక్షణగా విధులు నిర్వహిస్తూ పోలీసు శాఖ ప్రతిష్టను మరింత పెంపొందించాలని ఎస్పీ విక్రాంత పాటిల్ తెలిపారు.
స్థానిక పంచాయతీ కార్యాల యంలో తెలుగు తమ్ముళ్లు (టీడీపీ నాయకుల) మధ్య రగడ జరిగింది. మంగళవారం ఉదయం ఇరువర్గాల మాటలతో పంచా యతీ కార్యాలయం రణరంగంగా మారింది. మంత్రాలయం టీడీపీ ఇన్చార్జి ఎన్.రాఘవేంద్రరెడ్డి వర్గం, టీడీపీ రాష్ట్ర నాయకుడు తిక్కా రెడ్డి వర్గానికి చెందిన నాయకులు తీవ్రస్థాయిలో గొడవకు దిగడం మండలంలో కలకలం రేపింది.
‘జలధార.. జలహారతి’ పేరుతో వంద రోజుల మిషన్ను కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దీనికి ఉపాధి హామీ పథకం అనుసంధానం చేసి.. నీటి సంరక్షణకు నడుం బిగించింది. జిల్లాలో యేటా జరిగే ఉపాధి పనులు తప్ప.. వర్షపు నీరు చేయడానికి అవకాశం ఉన్న చెరువుల్లో పూడికతీత పనులు ముందుకు సాగడం లేదు
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో రీసర్వేకు గ్రహణం పట్టింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూరీసర్వే పనులు గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా సాగాల్సి ఉంది.
జిల్లాలో 2029 నాటికి సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యమని కలెక్టర్ ఏ. సిరి సంబంధిత శాఖల అధి కారులను ఆదేశించారు.