పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సువేందు అధికారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో గళం సెల్ ద్వారా యువత, విద్యార్థులు, శ్రోతలను ఆకాశవాణి భాగస్వామ్యం చేయనుంది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఏపీకి చెందిన మహిళ మస్కట్ నుంచి క్షేమంగా స్వగ్రామానికి చేరుకుంది. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలానికి చెందిన షెహనాజ్ కుటుంబ జీవనం కోసం ఏజెంట్ ద్వారా మస్కట్కు వెళ్లి చిత్ర హింసలకు గురైంది.
విజయవాడ కనకదుర్గమ్మను మంత్రి నారా లోకేశ్ దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఈ మేరకు కోల్కతా వెళ్లేందుకు బయలుదేరారు.
ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల పట్టాల పంపిణీ, క్రమబద్ధీకరణ వంటి అంశాలపై కలెక్టర్ల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీలకు కలిగే ప్రతి లబ్ధిని బుడగ జంగాలకు వర్తింప చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై మే 12న హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల కోసం దుర్గగుడి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మే 12న ఉదయం 6 గంటల నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభంకానున్నాయి.
ఏపీ ECET- 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఈరోజు(శుక్రవారం) విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఫలితాలను విడుదల చేశారు. ఈసెట్ పరీక్షకు 32,434 మంది అభ్యర్థులు హాజరవగా.. 29,750 మంది అర్హత సాధించారు.
పెన్షన్స్పై తమ ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకురాబోతుందని తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) వ్యాఖ్యానించారు. ఆయా సమస్యల పరిష్కరానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
కలెక్టర్ల సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడి పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. ఈ-ఫైళ్ల క్లియరెన్స్ సమయాన్ని 5 గంటల నుంచి 2 గంటల 49 నిమిషాలకు తగ్గించడం ద్వారా అచ్చెన్నాయుడు రికార్డు సాధించారు.