ఏపీలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. సాయికృష్ణ మృతదేహాన్ని సీఐ నాగరాజుతో కలిసి ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్, సీఐ స్నేహితుడు మాయం చేసినట్లు సిట్ విచారణలో బయటపడింది.
ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. ఉండవల్లి జోన్-11 పరిధిలో ట్రంక్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
నవ్యాంధ్రలో సరికొత్త ‘క్రియేటివ్ ఎకానమీ విప్లవం’కు శ్రీకారం చుట్టనున్నట్లు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. యువతకు ఆధునిక సినీ సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
విజయవాడలోని కానూరు గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ జెండా దిమ్మెను వైసీపీ స్థానిక నాయకుడు దేవభక్తుని చక్రవర్తి, అతని అనుచరులు కూల్చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల పోషకాహారాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ‘బాలామృతం+’ని విజయవాడలో ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల పురోగతిపై సమీక్ష నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
వైసీపీ నేత దేవినేని అవినాష్పై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వాస్తవాలు మరచి గొడ్డలి పార్టీ నాయకులు నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు.
ఏపీ రాజధాని అమరావతిలో నందమూరి నటసింహం బాలకృష్ణ 112వ చిత్రం గ్రాండ్గా లాంచ్ అయ్యింది. సినిమా ఓపెనింగ్ కోసం వచ్చిన మంత్రులు నారా లోకేశ్, కందుల దుర్గేష్కు బాలయ్య ధన్యవాదాలు తెలిపారు
ఏపీ రాజధాని అమరావతిలో సినీ సందడి మొదలైంది. ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో NBK 112వ సినిమా మొదలైంది.
గాదె సాయికృష్ణ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఐ నాగరాజును జైలుకు తరలించిన నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులు స్పందించారు. ABNతో మాట్లాడుతూ.. తమ పోరాటానికి ఫలితం దక్కిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని వారు పేర్కొన్నారు.
ఏపీలో 'నేషనల్ రేర్ డిసీజెస్ పాలసీ' సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆర్థిక స్థోమత లేకపోయినా, వ్యాధి అరుదైనదైనా ప్రతి రోగికీ వైద్యం అందాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు.