2026-27 వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం నాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ సందర్భంగా ఉభయసభల్లో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు.
ఏపీ అసెంబ్లీని ఇప్పటివరకు 700 మందికి పైగా విద్యార్థులు వీక్షించారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. విద్యార్థులకు అసెంబ్లీని చూసే అవకాశం కల్పించడం వెనుక ఉద్దేశం నెరవేరుతున్నందుకు తృప్తిగా ఉందన్నారు.
ఏపీ 2026-27 వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ అధికారులు బడ్జెట్ ప్రతులను దుర్గమ్మ సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.
ఏపీ మద్యం కుంభకోణంలో సీఐడీ మరో కేసు నమోదు చేసింది. ఏపీఎస్పీబీసీఐ డిపోల నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలకు పంపే లిక్కర్ రవాణా టెండర్లలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది.
ధనుర్మాసం.. మౌడ్యమితో శుభ ముహూర్తాలు లేక వివాహాలు జరగలేదు. ముహూర్తాలు లేక వివాహాలు నిలిచి పోయిన వారికి ఇది శుభవార్తే. ఈ నెల 19వ తేదీ నుంచి వరుస ముహూర్తాలతో పెళ్లి సందడి ప్రారంభం కానుంది.
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ నేత పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను నిత్యం భయభ్రాంతులకు గురిచేసే క్రిమినల్ అంబటి రాంబాబు అంటూ మండిపడ్డారు.
లిక్కర్ కేసులో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఫిబ్రవరి 19వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితోపాటు బాలాజీ గోవిందప్ప ఏసీబీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
అసెంబ్లీ లాబీలో పలువురు ఎమ్మెల్యేలతో నందమూరి బాలకృష్ణ సరదాగా సంభాషించారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజును డాకూ మహారాజ్ అని పిలిచారు బాలయ్య.
ఎన్టీఆర్కు భారతరత్న ఇస్తే ఆంధ్రులకు, తెలుగు జాతికి గౌరవం చేకూరినట్టు అవుతుందని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనే ప్రస్తావనను తీసుకొచ్చారు ఎమ్మెల్యే.
శ్వేత విప్లవంలో కృష్ణా మిల్క్ యూనియన్ ఆదర్శంగా నిలిచిందని శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి వ్యాఖ్యానించారు. కృష్ణా మిల్క్ యూనియన్ చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయమని పేర్కొన్నారు.