గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ ఏపీకి రాక సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్లో ట్వీట్ చేశారు. వెల్కమ్ బ్యాక్ మిస్టర్ బిల్ గేట్స్ అని పోస్టు చేశారు సీఎం.
గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్తోపాటు ఆయన ప్రతినిధి బృందం సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుంది. ఈ సందర్భంగా వారికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్తోపాటు పలువురు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.
గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంపైన బిల్ గేట్స్ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం 15 నిమిషాలపాటు చక్కర్లు కొట్టింది. ఉదయం వేళ విజయవాడ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో రన్వే స్పష్టంగా కనిపించలేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు అంబరాన్నంటాయి. శ్రీశైలం, ఏలూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. ఈ పర్వదినం సందర్భంగా భక్తుల ఆధ్యాత్మిక పారవశ్యాన్ని పొందుతున్నారు...
గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ సేవాలాల్ జయంతి వేడుకలను గిరిపుత్రులు వేడుకగా చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు.
సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని సినీ నిర్మాత బండ్ల గణేశ్ కుటుంబసమేతంగా వెళ్లి కలిశారు. చంద్రబాబుపై బండ్ల గణేశ్ అభిమానం మరువలేనిదని ఈ సందర్భంగా భువనేశ్వరి తెలిపారు..
యువత సాగు వైపు మళ్లాలంటే వ్యవసాయ రంగం లాభదాయకంగా మారాలని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. పంటలను కాపాడేందుకు రైతులకు అన్ని విధాలుగా సాయం అందిస్తామని తెలిపారు మంత్రి.
గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన బిల్లుల చెల్లింపులు, కేంద్ర ప్రాయోజిత పథకాల పునరుద్ధరణ, ఆర్థిక కార్యాకలాపాల పునరుజ్జీవన చర్యలను ఆర్థిక మంత్రి బడ్జెట్లో వివరించారు. ఆర్థిక శాఖ వర్గాలు ఇలాంటి అంశాలను బడ్జెట్లో ప్రస్తావించడం ఇదే తొలిసారి.
ఏపీ అసెంబ్లీలో రూ.3,32,205 కోట్లతో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు మంత్రి పయ్యావుల కేశవ్. 2026-27 ఏడాదిలో కూడా 10.75 శాతం మేర వృద్ధి నమోదు అవుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసిందన్నారు.
ఏపీ అసెంబ్లీలో 2026-27 వార్షిక బడ్జెట్ను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. ఏపీ ప్రజల ఆశలను నెరవేర్చే బడ్జెట్ అన్నారు ఆర్థిక మంత్రి.