వైజాగ్ రైల్వే జోన్ రికార్డు స్థాయిలో పురోగతి సాధించిందని కేంద్ర రైల్వే శాఖ వెల్లడించింది. వార్షికంగా రూ.2,493 కోట్ల ఆదాయంతో దేశంలోనే అత్యుత్తమ జోన్గా సౌత్ కోస్ట్ రైల్వే నిలిచిందని పేర్కొంది.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశపు గొప్ప నేత వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్న నైపుణ్యం గల చేతులను గౌరవిద్దామని అన్నారు.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. భారతీయ సంస్కృతిని చాటే చేనేత కళను ముందుకు తీసుకువెళుతున్న చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అగ్నికుల క్షత్రియుల జాతిపిత పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి సవిత ఘనంగా నివాళులర్పించారు.
విజయ డెయిరీ చైర్మన్ ఎన్నిక వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం సీరియస్ అయింది. చైర్మన్ ఎన్నిక ఆలోచించి చేద్దామన్న అధిష్ఠానం సూచనను చలసాని ఆంజనేయులు ధిక్కరించారు.
మచిలీపట్నంలో సైబర్ కేటుగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఢిల్లీ పోలీసులమంటూ వృద్ధురాలికి వాట్సాప్ కాల్ చేశారు. వృద్ధురాలి అకౌంట్ నుంచి రూ.1.43కోట్లు మాయం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఏదుల ముస్తూరులో 19.55 ఎకరాలు APIICకి బదిలీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు.
ఏపీ మోడల్ స్కూల్స్ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మోడల్ స్కూల్స్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని మంత్రులకు విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఈరోజు కేబినెట్ సమావేశానికి ముందు మంత్రులతో లోకేశ్ బ్రేక్ ఫాస్ట్ సమావేశం నిర్వహించారు.
ఏపీ హస్తకళలకు సాంకేతికతను జోడిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచన మేరకు దేశంలో తొలిసారిగా హస్తకళా ఉత్పత్తులకు క్యూఆర్ కోడ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది.