మద్యం కుంభకోణం కేసులో ముప్పిడి అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అవినాశ్ ఏ-7గా ఉన్నారు.
మచిలీపట్నంలో బాలికపై అత్యాచారం జరిగింది. ఆ బాలిక గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
జాబ్ క్యాలెండర్ విడుదల కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తాజా జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రభుత్వం.. విద్య, పోలీస్ శాఖలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిందని మంత్రి అన్నారు.
సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వానికి ఆ దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు. మచిలీపట్నంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు.
ఏపీలో అకాల వర్షాలపై మంత్రి అచ్చెన్నాయుడు అత్యవసర సమీక్ష నిర్వహించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను త్వరితగతిన గుర్తించి, నష్టాన్ని నమోదు చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.
పంచాంగం అంటే ఐదు అంగాలకు సంబంధించిన కాలాన్ని గణన చేసే ఒక అద్భుతమైన వ్యవస్థ అని పీవీఎన్ మాధవ్ అన్నారు. ప్రపంచంలో ఇలాంటిది ఎక్కడా లేదని పేర్కొన్నారు.
విలువలతో జీవనం గడిపేవారికి ఉన్న ఆనందం ఎవరికీ ఉండదని... విలువలు లేని చోట ఏమీ మిగలదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విదేశాల్లో తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు అంబాసిడర్లుగా ప్రవాసాంధ్రులు మారారని సీఎం తెలిపారు.
శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తెలుగు సంస్కృతి వినూత్నం, పండుగలు విభిన్నమైనవి అని సీఎం తెలిపారు.
ఉగాది పండుగ రోజున పేదలకు ఆర్థిక సాయం అందించే సీఎంఆర్ఎఫ్ ఫైల్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారు.
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.