భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ప్రతీ వీఐపీ బాధ్యత తమదే అని పేర్కొన్నారు.
ఐదేళ్ల తర్వాత రీన్యూ పవర్ తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా ఎక్స్లో ప్రకటించారు.
జగన్ దొంగలకు పెద్దన్నలా నిలిచారని దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకన్న స్వామితో పెట్టుకున్నారు కాబట్టే చిత్తుగా ఓడి 11 సీట్లకు పడిపోయారని వ్యాఖ్యలు చేశారు.
విశాఖలో జరిగే సీఐఐ సమ్మిట్ నేపథ్యంలో నాలుగు రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీబిజీగా గడుపనున్నారు. వరుస సమావేశాలతో పాటు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. విదేశీ ప్రతినిధులతో సమావేశం కానున్నారు.
మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీప నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని కూమటి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీపీపీ విధానంలో రెండేళ్లలోనే మెడికల్ కాలేజీలను పూర్తిచేస్తామని ప్రభుత్వ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు.
నందిగామలో వైసీపీ చేపట్టే ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పవిత్ర కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని శ్రీదుర్గమ్మ ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ నగదు ఇస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. సూపర్ సిక్స్.. సూపర్ హిట్ చేసి చూపించామని చెప్పారు. ఆర్ధిక ఇబ్బందులు ఉండటం వల్ల కొన్ని పనులు కొంత ఆలస్యం అవుతున్నాయని వివరించారు.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. నష్టాన్ని అంచనా వేసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కేంద్ర బృందం భేటీ అయ్యింది.
ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎంఎస్ ఎంఈ పాలసీ, ఏపీ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీలతో పరిశ్రమల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం మార్గం సుగమం చేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.